తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. 3 పంటలు కావాలా 3 గంటలు కావాలా అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి చురకలంటించారు.
ఇక, ఎమ్మెల్సీ కవిత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పంచ్ లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుందంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 గంటలని దుష్ప్రచారం చేసిన మూడు చెరువుల నీళ్లు తాగిన మూడోసారి అధికారంలోకి రావడం కల్ల అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అన్నారు. ఈ ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే మాట్లాడిన వీడియోను రేవంత్ ఆ ట్వీట్ కు యాడ్ చేశారు. బాయ్ బాయ్ కెసిఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతకుముందు, అమెరికాలోని తానా 23వ మహాసభల సందర్భంగా తెలంగాణలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, 3 ఎకరాలలో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 8 గంటలు సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
This post was last modified on July 13, 2023 7:32 am
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…