తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. 3 పంటలు కావాలా 3 గంటలు కావాలా అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి చురకలంటించారు.
ఇక, ఎమ్మెల్సీ కవిత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పంచ్ లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుందంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 గంటలని దుష్ప్రచారం చేసిన మూడు చెరువుల నీళ్లు తాగిన మూడోసారి అధికారంలోకి రావడం కల్ల అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అన్నారు. ఈ ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే మాట్లాడిన వీడియోను రేవంత్ ఆ ట్వీట్ కు యాడ్ చేశారు. బాయ్ బాయ్ కెసిఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతకుముందు, అమెరికాలోని తానా 23వ మహాసభల సందర్భంగా తెలంగాణలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, 3 ఎకరాలలో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 8 గంటలు సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
This post was last modified on July 13, 2023 7:32 am
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…
ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ మల్లారెడ్డి యునివర్సిటిలో ఘనంగా జరిగింది. తెలుగు…
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…