తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. 3 పంటలు కావాలా 3 గంటలు కావాలా అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి చురకలంటించారు.
ఇక, ఎమ్మెల్సీ కవిత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పంచ్ లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుందంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 గంటలని దుష్ప్రచారం చేసిన మూడు చెరువుల నీళ్లు తాగిన మూడోసారి అధికారంలోకి రావడం కల్ల అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అన్నారు. ఈ ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే మాట్లాడిన వీడియోను రేవంత్ ఆ ట్వీట్ కు యాడ్ చేశారు. బాయ్ బాయ్ కెసిఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతకుముందు, అమెరికాలోని తానా 23వ మహాసభల సందర్భంగా తెలంగాణలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, 3 ఎకరాలలో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 8 గంటలు సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
This post was last modified on July 13, 2023 7:32 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…