టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచాల్సిందేనని సీనియర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్న నేపథ్యంలో ఆయన చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాదే ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యే ఆలోచన కనిపిస్తోంది. దీనికిపై వైసీపీ అన్నీ అప్ర మత్తం చేసుకుంటోంది.
వైసీపీ పరంగా చూసుకుంటే.. కేవలం 30 నుంచి 40 నియోజకవర్గాల్లోనే మార్పులు కనిపిస్తున్నాయి. వీటిలో గతంలో ఓడిపోయిన 23 స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. వీటిని ఒకటి రెండు రోజుల్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఇక, నియోజకవర్గాల్లోనూ .. ఇప్పటికే మార్పులు, చేర్పులపై సంకేతాలు ఇచ్చారు. నాయకులను కూడా మానసికంగా సీఎం జగన్ సిద్ధం చేశారు. ఇక, ఎటొచ్చీ.. టీడీపీలోనే ఇలాంటి కార్యక్రమం ఊపందుకోలేదు.
ఆశలు పెట్టుకున్న నాయకులు.. తమకు తప్ప ఎవరికి టికెట్ ఇస్తారులే.. అని భావిస్తున్నతమ్ముళ్లను దారిలో పెట్టుకునే కార్యక్రమానికి చంద్రబాబు ఇంకా శ్రీకారం చుట్టలేదు. దీనివల్ల నియోజకవర్గాల్లో పార్టీ అనుకున్న విధంగా అయితే పుంజుకున్న దాఖలాలు కనిపించలేదని.. సీనియర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా.. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని.. ఎవరో ఉంటారు.. ఎవరో పోతారు.. అనే సందేహాలను కూడా వీడి నిర్ణయాలపై స్పందించాలని కోరుతున్నారు.
గత వారం రోజులుగా నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక చర్చలు చేస్తున్నారు. ఇలా మొత్తం 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పరిస్థితిని చంద్రబాబు సమీక్షించారు. అయితే.. అత్యంత తక్కువగానే నాయకులను కన్ఫర్మ్ చేశారు. దీంతో మిగిలిన స్థానాల పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. కాబట్టి.. ఈ పరిస్థితిలో వేగం తీసుకురావాలనేది సీనియర్ల సూచనగా ఉంది. దీనిపై చంద్రబాబు దృష్టి పెడుతులన్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 13, 2023 7:23 am
యూత్ హీరో రాజ్ తరుణ్ కు మంచి హిట్టు దక్కి ఎంత కాలమయ్యిందో చెప్పడం కష్టం. సీనియర్ హీరోలతో సపోర్టింగ్…
ఎన్నికలు అయిపోయాయి. ఫలితాలు ఇంకో పద్దెనిమిది రోజుల్లో రాబోతున్నాయి. ఎవరికి వారు విజయం పట్ల ధీమాగా ఉన్నారు. అధికార పార్టీ,…
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…