టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడు పెంచాల్సిందేనని సీనియర్లు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు వడివడిగా మారుతున్న నేపథ్యంలో ఆయన చురుగ్గా నిర్ణయాలు తీసుకోవాలని చెబుతున్నారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం.. వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ఢిల్లీ పరిణామాల నేపథ్యంలో ఈ ఏడాదే ఎన్నికలకు ముహూర్తం ఫిక్సయ్యే ఆలోచన కనిపిస్తోంది. దీనికిపై వైసీపీ అన్నీ అప్ర మత్తం చేసుకుంటోంది.
వైసీపీ పరంగా చూసుకుంటే.. కేవలం 30 నుంచి 40 నియోజకవర్గాల్లోనే మార్పులు కనిపిస్తున్నాయి. వీటిలో గతంలో ఓడిపోయిన 23 స్థానాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. వీటిని ఒకటి రెండు రోజుల్లోనే కన్ఫర్మ్ చేస్తారు. ఇక, నియోజకవర్గాల్లోనూ .. ఇప్పటికే మార్పులు, చేర్పులపై సంకేతాలు ఇచ్చారు. నాయకులను కూడా మానసికంగా సీఎం జగన్ సిద్ధం చేశారు. ఇక, ఎటొచ్చీ.. టీడీపీలోనే ఇలాంటి కార్యక్రమం ఊపందుకోలేదు.
ఆశలు పెట్టుకున్న నాయకులు.. తమకు తప్ప ఎవరికి టికెట్ ఇస్తారులే.. అని భావిస్తున్నతమ్ముళ్లను దారిలో పెట్టుకునే కార్యక్రమానికి చంద్రబాబు ఇంకా శ్రీకారం చుట్టలేదు. దీనివల్ల నియోజకవర్గాల్లో పార్టీ అనుకున్న విధంగా అయితే పుంజుకున్న దాఖలాలు కనిపించలేదని.. సీనియర్లు చెబుతున్నారు. దీంతో ఇప్పటికైనా.. వేగంగా నిర్ణయాలు తీసుకోవాలని.. ఎవరో ఉంటారు.. ఎవరో పోతారు.. అనే సందేహాలను కూడా వీడి నిర్ణయాలపై స్పందించాలని కోరుతున్నారు.
గత వారం రోజులుగా నియోజకవర్గాలపై చంద్రబాబు ప్రత్యేక చర్చలు చేస్తున్నారు. ఇలా మొత్తం 20 నుంచి 30 నియోజకవర్గాల్లో పరిస్థితిని చంద్రబాబు సమీక్షించారు. అయితే.. అత్యంత తక్కువగానే నాయకులను కన్ఫర్మ్ చేశారు. దీంతో మిగిలిన స్థానాల పరిస్థితి ఏంటి? అనేది చర్చనీయాంశంగా మారింది. కాబట్టి.. ఈ పరిస్థితిలో వేగం తీసుకురావాలనేది సీనియర్ల సూచనగా ఉంది. దీనిపై చంద్రబాబు దృష్టి పెడుతులన్నట్టు సమాచారం. మరి ఏం చేస్తారో చూడాలి.
This post was last modified on July 13, 2023 7:23 am
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…