Political News

పవన్ ను ఓడించింది టీడీపీనే:పోసాని

ఏపీలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు చేరవేస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, దాన్ని రద్దు చేయాని అన్న రీతిలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. వాలంటీర్లతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ పై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే. పవన్ పై పోసాని కృష్ణ మురళి సంచలన విమర్శలు చేశారు.

పవన్ చేసిన ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, 10 మంది బాధితుల పేర్లు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో, తమ ఇంట్లో ఆడవాళ్ళని లోకేష్ తిట్టించారని పవన్ బాధపడ్డారని, తన మాతృమూర్తి ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పవన్ మరిచినట్టు ఉన్నారని పోసాని అన్నారు. అదే సమయంలో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు విని ఆ మాతృమూర్తులు బాధపడరా అని నిలదీశారు.

పవన్ పై తనకు ద్వేషం లేదని, ఇంకా గౌరవమే ఉందని పోసాని అన్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని, కానీ, ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారని చెప్పారు. ప్రజాభిమానం ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు. భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 కోట్లు ఖర్చుపెట్టి మరీ పవన్కు ఓటేయ్యొద్దని టీడీపీ ప్రచారం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే ఈ విషయంపై విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

పవన్ నమ్ముకున్న నేతలు ఎన్నటికీ ఆయనను సీఎం చేయరని చెప్పారు. పొరపాటున పవన్ సీఎం అయితే ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి తిడతారని అన్నారు. వాలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన రాజకీయ జీవితానికి ఇది మంచిది కాదని పోసాని హితవు పలికారు. పొరపాటు చేయడం సహజమని, కానీ దాన్ని గుర్తించి క్షమాపణ చెప్పడం హుందాతనమని అన్నారు.

This post was last modified on July 12, 2023 4:23 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ తాండవానికి అదొక్కటే సమస్య

రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…

10 minutes ago

రెహమాన్ మీదే ‘పెద్ది’ బరువు

ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…

20 minutes ago

బోరుగడ్డతో వైసీపీకి సంబంధం లేదా?

బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…

24 minutes ago

‘మీ మతంలో జరిగినా అలాగే మాట్లాడతారా జగన్’

తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ తీవ్రంగా…

2 hours ago

ఆఖర్లోనూ సిక్సర్లు కొడుతున్న బాలీవుడ్

గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…

2 hours ago

బ్రేకింగ్: రేపు కోర్టులో లొంగిపోనున్న పిన్నెల్లి బ్రదర్స్

పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…

3 hours ago