Political News

పవన్ ను ఓడించింది టీడీపీనే:పోసాని

ఏపీలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజలకు సంబంధించిన సున్నితమైన అంశాలను సేకరించి సంఘ విద్రోహ శక్తులకు వాలంటీర్లు చేరవేస్తున్నారని పవన్ చేసిన ఆరోపణలు రాజకీయ దుమారం రేపాయి. అసలు వాలంటీర్ల వ్యవస్థ అవసరం లేదని, దాన్ని రద్దు చేయాని అన్న రీతిలో పవన్ చేస్తున్న వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. వాలంటీర్లతో పాటు వైసీపీ నేతలు కూడా పవన్ పై విమర్శలు చేస్తున్నారు ఈ క్రమంలోనే. పవన్ పై పోసాని కృష్ణ మురళి సంచలన విమర్శలు చేశారు.

పవన్ చేసిన ఉమెన్ ట్రాఫికింగ్ ఆరోపణలకు ఆధారాలు చూపాలని, 10 మంది బాధితుల పేర్లు చెప్పాలని పోసాని డిమాండ్ చేశారు. చంద్రబాబు చెప్పినట్లు పవన్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. గతంలో, తమ ఇంట్లో ఆడవాళ్ళని లోకేష్ తిట్టించారని పవన్ బాధపడ్డారని, తన మాతృమూర్తి ఏడ్చిందని ఆవేదన వ్యక్తం చేసిన విషయాన్ని పవన్ మరిచినట్టు ఉన్నారని పోసాని అన్నారు. అదే సమయంలో వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు విని ఆ మాతృమూర్తులు బాధపడరా అని నిలదీశారు.

పవన్ పై తనకు ద్వేషం లేదని, ఇంకా గౌరవమే ఉందని పోసాని అన్నారు. జగన్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని పవన్ ఆలోచిస్తున్నారని, కానీ, ప్రజల గుండెల్లో జగన్ ఉన్నారని చెప్పారు. ప్రజాభిమానం ఉన్నంతకాలం ఆయనే ముఖ్యమంత్రి అని చెప్పారు. భీమవరంలో పవన్ ఓటమికి టీడీపీనే కారణమని పోసాని షాకింగ్ కామెంట్స్ చేశారు. 15 కోట్లు ఖర్చుపెట్టి మరీ పవన్కు ఓటేయ్యొద్దని టీడీపీ ప్రచారం చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కావాలంటే ఈ విషయంపై విచారణ చేసుకోవచ్చని సవాల్ విసిరారు.

పవన్ నమ్ముకున్న నేతలు ఎన్నటికీ ఆయనను సీఎం చేయరని చెప్పారు. పొరపాటున పవన్ సీఎం అయితే ఇలాగే ప్రెస్ మీట్ పెట్టి తిడతారని అన్నారు. వాలంటీర్లపై పవన్ నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని, ఆయన రాజకీయ జీవితానికి ఇది మంచిది కాదని పోసాని హితవు పలికారు. పొరపాటు చేయడం సహజమని, కానీ దాన్ని గుర్తించి క్షమాపణ చెప్పడం హుందాతనమని అన్నారు.

This post was last modified on July 12, 2023 4:23 pm

Share

Recent Posts

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

16 minutes ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

3 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

4 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

5 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago