Political News

ఇది చాలా పెద్ద డ్యామేజీ జగన్!

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న ఉన్న‌ట్టు ఈ రోజు.. ఈ రోజు ఉన్న‌ట్టు రేపు ఉండాల‌ని లేదు. ప్ర‌తిప‌క్ష పార్టీల వ్యూహాలు, ప్ర‌తివ్యూహాలు ఎలా ఉన్నా.. సొంత గూటిలో రేపుతున్న మంట‌లు కూడా .. ఒక్కొక్క సారి పార్టీల‌కు పెను ప్ర‌మాదం తెచ్చే అవ‌కాశం మెండుగా ఉంటుంది. ఇప్పుడు ఏపీలో ముఖ్యంగా అధికార వైసీపీలో ఇదే జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో వైసీపీ ప‌రిస్థితి కొంత ఇబ్బందిగానే ఉంది.

వివిధ ర‌కాల ప‌న్నులు పెంచ‌డం.. ముఖ్యంగా చెత్త‌పై ప‌న్ను విధింపు, పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు, రిజిస్ట్రేష‌న్ చార్జీల పెంపు.. ఇలా అనేక రూపాల్లో ప్ర‌జ‌లు ఒకింత ఆగ్ర‌హంతోనే ఉన్నారు. ఇక‌, ఉద్యోగుల ప‌రిస్థితి న‌ర్మ‌గ‌ర్భంగా ఉంది. ఇదిలావుంటే.. వైసీపీ నాయ‌కులు ఎక్కువ‌గా గ్రామీణ ఓటు బ్యాంకుపై ఆశ‌లు పెట్టుకున్నారు. గ‌త ఎన్నిక‌ల్లోనూ గ్రామీణ స్థాయిలో ప‌క్కాగా దూసుకుపోవాల‌నే ల‌క్ష్యంతో ప‌నిచేసి.. దానిని సాధించార‌నే చెప్పాలి. లేక‌పోతే.. ఇంత భారీ మెజారిటీ వ‌చ్చేది కాద‌ని కూడా.. నిపుణులు చెప్పిన విష‌యం తెలిసిందే.

అయితే.. ఇప్పుడు అదే గ్రామీణ భార‌తంలో వైసీపీకి వ్య‌తిరేకంగా చేతులు క‌లుపుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ముఖ్యంగా గ్రామ పంచాయ‌తీల స‌ర్పంచులు స‌ర్కారు వైఖ‌రిపై ఆగ్ర‌హంతో ఉన్నారు. తాజాగా విజ‌యవాడ‌లో నిర్వ‌హించిన పంచాయతీ సంఘాల సమావేశంలో సంచ‌ల‌నం జ‌రిగింది. గ‌తంలోనూ ఇలాంటి స‌మావేశాలు జ‌రిగినా.. వైసీపీ అనుబంధం సంఘంగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీ స‌ర్పంచుల సంఘం దూరంగా ఉంది.

కానీ, తాజాగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయ‌తీరాజ్ చాంబ‌ర్ ఆధ్వ‌ర్యంలో సీపీఐ, టీడీపీ, సీపీఎం.. ఇతర పార్టీలు నిర్వ‌హించిన రౌండ్ టేబుల్ స‌మావేశంలో వైసీపీ అనుబంధం సర్పంచుల సంఘం కూడా చేతులు క‌లిపింది. పంచాయ‌తీ నిధుల‌ను స‌ర్కారు వాడుకుంటోంద‌ని.. త‌మ‌కు క‌నీసం వ‌లంటీర్ల‌కు ఇస్తున్న విలువ కూడా ఇవ్వ‌డం లేద‌ని స‌ర్పంచులు వాపోయారు. అంతేకాదు.. వ‌లంటీర్ల‌కు రూ.5000 చొప్పున గౌర‌వ వేత‌నం ఇస్తుంటే.. త‌మ‌కు 3 వేలు కూడా ద‌క్క‌డం లేద‌ని విమ‌ర్శించారు.

విధులు, నిధులు.. వంటివి లేకుండా పోయాయ‌ని ఆగ్ర‌హంతో ఊగిపోయారు. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల‌తో చేతులు క‌లిపి.. ప్ర‌భుత్వంపై ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌తిజ్ఞ చేశారు. గ్రామీణ స్తాయిలో అన్ని పంచాయ‌తీల్లోనూ ఇంటింటికీ తిరిగి.. స‌ర్కారు తీరును వివ‌రిస్తామ‌ని కూడా వెల్ల‌డించారు. క‌ట్ చేస్తే.. ఇదే క‌నుక జ‌రిగితే.. వైసీపీ గ్రామీణ ఓటు బ్యాంకుపై ప్ర‌భావం ప‌డ‌డం ఖాయ‌మ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. ఇప్ప‌టికైనా దీనిని స‌రిదిద్ది.. పంచాయ‌తీస‌ర్పంచుల ఆగ్ర‌హాన్ని త‌గ్గించే ప్ర‌య‌త్నం చేయాల‌నే సూచ‌న‌లు వ‌స్తున్నాయి.

Satya

Recent Posts

నాని నెక్స్ట్… ఒకటి డౌట్.. ఒకటి ఫిక్స్?

టాలీవుడ్లో ఎప్పుడూ ఒక పద్ధతి ప్రకారం, డెడ్ లైన్స్ పెట్టుకుని పని చేసే హీరో నేచురల్ స్టార్ నాని. చెప్పిన డేటుకు సినిమాను…

7 minutes ago

కళాకారుడి చెమటకు దక్కిన గౌరవం

చేతి కళను మాత్రమే కాదు... ఆ చేతుల వెనుక ఉన్న జీవితాలను కూడా స్పృశించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.…

32 minutes ago

బ్యాన్ వల్లే ఎక్కువ మంది చూసారా?

సినిమాలను అడ్డుకోవడం లేదా బ్యాన్ చేయడం వల్ల వాటి క్రేజ్ తగ్గడం పక్కన పెడితే నెటిజన్లలో క్యూరియాసిటీ మరింత పెరుగుతుందని…

1 hour ago

కంగనా సినిమా… 250 కోట్లు కట్టమంటున్నారు

బాలీవుడ్లో ఒకప్పుడు కంగనా రనౌత్‌కు తిరుగులేని స్టార్ ఇమేజ్, మార్కెట్ ఉండేది. కానీ వరుస ఫ్లాపులకు తోడు ఆమె వ్యక్తిగత ప్రవర్తన కారణంగా…

1 hour ago

దర్శకత్వాన్ని పంచుకుంటున్న లారెన్స్

రాఘవ లారెన్స్ అంటే మొదట స్టార్ కొరియోగ్రాఫర్. తర్వాత అతను నటుడిగా మారి కొన్ని సినిమాలు చేశాడు. అంత వరకు…

4 hours ago

రామాయణ డిమాండ్ సగానికి తగ్గిందా?

బాలీవుడ్ బిగ్గెస్ట్ విజువల్ గ్రాండియర్ గా ప్రచారంలో ఉన్న రామాయణ పార్ట్ 1 దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఇంకా…

5 hours ago