వారాహి విజయయాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ మామూలుగా లేదు. వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్ను ఇక నుంచి మీరు అని కాకుండా నువ్వు అనే అంటానని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడని పవన్ ఇటీవల వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల సమావేశంలో జగన్ మీద ఇంకాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు జనసేనాని. జగన్ వేదికల మీద ప్రసంగాలు చేసేటపుడు ఎంత తడబడతారో తెలిసిందే. ఒకప్పుడు నారా లోకేష్ ఇలా తడబడితే విపరీతంగా గేలి చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ తడబాటు చూసి ఏమంటాయన్నది ప్రశ్న. దీనికి అటునుంచి సమాధానమే ఉండదు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. జగన్ తడబాటు మీద కౌంటర్లు వేస్తూ ప్రసంగించాడు. జగన్ పేరు ఎత్తకుండా మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామంటే అని పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా.. అంతలోనే జనసైనికులు సైకో అని అరిచారు.
అందుకు పవన్ నవ్వుతూ.. అది అందరికీ తెలిసిందే కదా అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పిండాకూడు అంటే పిండి వంటలు అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, అ కి ఆ కి తేడా తెలియనివాడు, వారాహి కి వరాహి కి తేడా తెలియనివాడు.. పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు, చావింటికి వెళ్ళు ఒక్కటే నవ్వు ఎవరైనా చెప్పండయ్యా జగన్కు అంటూ పవన్ పంచులు వేస్తుంటే జనసైనికుల నుంచి మామూలు రెస్పాన్స్ లేదు.
జగన్ పై ఇది మాస్ ర్యాగింగ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
This post was last modified on July 12, 2023 8:22 am
స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎమోషన్స్ క్యాష్ చేసుకోవడానికి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు వాడుతున్న ఆయుధం రీ రిలీజులు. ఏదో కొత్త…
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి ఫ్యామిలీ ఇప్పుడు పెను వివాదంలో చిక్కుకుంది. మంత్రి కుమారుడు బండి భగీరథ్ ఓ…
బాక్సాఫీస్ వద్ద కరుప్పు / వీరభద్రుడు జోరు బాగానే ఉంది. ముఖ్యంగా తమిళనాడులో రికార్డులు రాసే దిశగా పరుగులు పెడుతోంది.…
హఠాత్తుగా పెద్ది సినారియో మారిపోయింది. ప్యాన్ ఇండియా స్థాయిలో పెద్ది గురించి రెండు మూడు రోజులు మాట్లాడుకుంటారనుకుంటే దానికి భిన్నంగా…
మంచు మనోజ్.. కొన్నేళ్ల ముందు భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అది అతడికి రెండో పెళ్లి. మరోవైపు…
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…