వారాహి విజయయాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ మామూలుగా లేదు. వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్ను ఇక నుంచి మీరు అని కాకుండా నువ్వు అనే అంటానని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడని పవన్ ఇటీవల వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల సమావేశంలో జగన్ మీద ఇంకాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు జనసేనాని. జగన్ వేదికల మీద ప్రసంగాలు చేసేటపుడు ఎంత తడబడతారో తెలిసిందే. ఒకప్పుడు నారా లోకేష్ ఇలా తడబడితే విపరీతంగా గేలి చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ తడబాటు చూసి ఏమంటాయన్నది ప్రశ్న. దీనికి అటునుంచి సమాధానమే ఉండదు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. జగన్ తడబాటు మీద కౌంటర్లు వేస్తూ ప్రసంగించాడు. జగన్ పేరు ఎత్తకుండా మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామంటే అని పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా.. అంతలోనే జనసైనికులు సైకో అని అరిచారు.
అందుకు పవన్ నవ్వుతూ.. అది అందరికీ తెలిసిందే కదా అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పిండాకూడు అంటే పిండి వంటలు అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, అ కి ఆ కి తేడా తెలియనివాడు, వారాహి కి వరాహి కి తేడా తెలియనివాడు.. పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు, చావింటికి వెళ్ళు ఒక్కటే నవ్వు ఎవరైనా చెప్పండయ్యా జగన్కు అంటూ పవన్ పంచులు వేస్తుంటే జనసైనికుల నుంచి మామూలు రెస్పాన్స్ లేదు.
జగన్ పై ఇది మాస్ ర్యాగింగ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
This post was last modified on July 12, 2023 8:22 am
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…
ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్సభ స్పీకర్పై తమకు విశ్వాసం…
ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…
అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…