వారాహి విజయయాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ మామూలుగా లేదు. వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్ను ఇక నుంచి మీరు అని కాకుండా నువ్వు అనే అంటానని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడని పవన్ ఇటీవల వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల సమావేశంలో జగన్ మీద ఇంకాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు జనసేనాని. జగన్ వేదికల మీద ప్రసంగాలు చేసేటపుడు ఎంత తడబడతారో తెలిసిందే. ఒకప్పుడు నారా లోకేష్ ఇలా తడబడితే విపరీతంగా గేలి చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ తడబాటు చూసి ఏమంటాయన్నది ప్రశ్న. దీనికి అటునుంచి సమాధానమే ఉండదు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. జగన్ తడబాటు మీద కౌంటర్లు వేస్తూ ప్రసంగించాడు. జగన్ పేరు ఎత్తకుండా మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామంటే అని పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా.. అంతలోనే జనసైనికులు సైకో అని అరిచారు.
అందుకు పవన్ నవ్వుతూ.. అది అందరికీ తెలిసిందే కదా అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పిండాకూడు అంటే పిండి వంటలు అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, అ కి ఆ కి తేడా తెలియనివాడు, వారాహి కి వరాహి కి తేడా తెలియనివాడు.. పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు, చావింటికి వెళ్ళు ఒక్కటే నవ్వు ఎవరైనా చెప్పండయ్యా జగన్కు అంటూ పవన్ పంచులు వేస్తుంటే జనసైనికుల నుంచి మామూలు రెస్పాన్స్ లేదు.
జగన్ పై ఇది మాస్ ర్యాగింగ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
This post was last modified on July 12, 2023 8:22 am
మొన్నటిదాకా టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా అత్యధిక డిమాండ్ అనుభవించిన పూజా హెగ్డే కెరీర్ ప్రారంభంలో వచ్చిన ఐరన్ లెగ్…
ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ రాజకీయంగా ఒక బలమైన నాయకుడే అని చెప్పాలి. అయితే తన రాజకీయ భవిష్యత్తు కోసం…
తెలంగాణలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రెండు ప్రమాదాలు తప్పించుకుని మూడో ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో…
ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ 2003లో జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో 681 చదరపు గజాల స్థలం సుంకు గీత అనే…
ఒక్క చిన్న ఇన్స్ టా పోస్ట్ తో ప్రభాస్ సోషల్ మీడియాని ఊపేస్తున్నాడు. హలో డార్లింగ్స్ చివరికి చాలా ప్రత్యేకం…
ఎక్కువ సినిమాలు తీస్తున్న నిర్మాణ సంస్థలు ఏవంటే మనకు వెంటనే గుర్తొచ్చే బ్యానర్లు సితార, మైత్రి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…