వారాహి విజయయాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ మామూలుగా లేదు. వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్ను ఇక నుంచి మీరు అని కాకుండా నువ్వు అనే అంటానని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడని పవన్ ఇటీవల వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల సమావేశంలో జగన్ మీద ఇంకాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు జనసేనాని. జగన్ వేదికల మీద ప్రసంగాలు చేసేటపుడు ఎంత తడబడతారో తెలిసిందే. ఒకప్పుడు నారా లోకేష్ ఇలా తడబడితే విపరీతంగా గేలి చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ తడబాటు చూసి ఏమంటాయన్నది ప్రశ్న. దీనికి అటునుంచి సమాధానమే ఉండదు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. జగన్ తడబాటు మీద కౌంటర్లు వేస్తూ ప్రసంగించాడు. జగన్ పేరు ఎత్తకుండా మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామంటే అని పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా.. అంతలోనే జనసైనికులు సైకో అని అరిచారు.
అందుకు పవన్ నవ్వుతూ.. అది అందరికీ తెలిసిందే కదా అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పిండాకూడు అంటే పిండి వంటలు అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, అ కి ఆ కి తేడా తెలియనివాడు, వారాహి కి వరాహి కి తేడా తెలియనివాడు.. పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు, చావింటికి వెళ్ళు ఒక్కటే నవ్వు ఎవరైనా చెప్పండయ్యా జగన్కు అంటూ పవన్ పంచులు వేస్తుంటే జనసైనికుల నుంచి మామూలు రెస్పాన్స్ లేదు.
జగన్ పై ఇది మాస్ ర్యాగింగ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
This post was last modified on July 12, 2023 8:22 am
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…