ఏలూరు బహిరంగ సభలో వాలంటీర్ల పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై వాలంటీర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు కూడా తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు.
వాలంటీర్ల పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయనకు డ్యామేజీ కలిగించేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తన వ్యాఖ్యలపై వివరణ ఇస్తారనుకున్న పవన్… తాజాగా మరోసారి వాలంటీర్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లకు ఐదు వేల జీతమిచ్చి జనాల ఇళ్లలో దూరే అవకాశమిచ్చారని పవన్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు.
వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడకు వెళుతోందని? అంత సున్నితమైన సమాచారం వేరే వాళ్ళ చేతులలోకి వెళ్తే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలను అదుపు చేయడానికి వాలంటీర్ల వ్యవస్థను తెచ్చారని, కొన్నిచోట్ల ప్రజలను వాలంటీర్లు బెదిరిస్తున్న ఘటనలున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే, తాను అందరు వాలంటీర్లను అనడం లేదని, వారి పొట్ట కొట్టడం తన ఉద్దేశం కాదని చెప్పారు. 100 పండ్లలో ఒకటి కుళ్ళినా మిగతావి కూడా కుళ్ళిపోతాయని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. 5 వేలతో వాలంటీర్లను ఉపయోగించుకొని ఊడిగం చేయిస్తున్నారని, నిరుద్యోగం పెరిగితేనే డిగ్రీ చదివిన వాళ్ళు ఐదువేలకు పనిచేస్తున్నారని అన్నారు.
వాలంటీర్లతో వెట్టిచాకిరి చేయిస్తున్న జగన్.. క్లాస్ వరకు గురించి మాట్లాడుతున్నారని అన్నారు. వాలంటీర్ వ్యవస్థను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని, ప్రతి పార్టీ వారు వాలంటీర్ వ్యవస్థపై కన్నేసి ఉంచాలని పవన్ చెప్పారు. వారు తమ పని తాము చేస్తే ఎవరికీ ఇబ్బంది లేదని, వైసీపీకి మాత్రమే పనిచేస్తామంటే మాత్రం ప్రజలు ప్రశ్నించాలని అన్నారు.
ఆడపిల్లలు ఉన్న కుటుంబాలు వాలంటీర్ వ్యవస్థ పై అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా మీ డేటా వారికి ఇవ్వొద్దని సూచించారు. ఒంటరి మహిళలు, వితంతువులు భద్రంగా ఉన్నారా లేదా అని పరిశీలించాలని, మహిళల మిస్సింగ్ పై కేంద్ర సంస్థలు అధ్యయనం చేస్తున్నాయని అన్నారు.
This post was last modified on July 11, 2023 10:20 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…