దెబ్బకు ఠా! అనే మాట వినే ఉంటారు. ఆ విషయం ఎలా ఉన్నా.. ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఒక్క మాటకు లైన్లోకి వచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ అధిష్టానానికి కూడా బిగ్ రిలీఫేనని చెబుతున్నారు పరిశీలకులు. మంచికో.. చెడుకో.. ఆలోచించి అన్నారో.. లేక అన్యాపగా అనేశారో.. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఒక వ్యాఖ్య అయితే చేసేశారు. ప్రస్తుత ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేయొచ్చు.. అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ మాట నిజమవుతుందా? కాదా.. అనే మీమాంస.. సందేహాలను పక్కన పెడితే.. కాంగ్రెస్లో సీఎం రేసులో ఉన్నవారి ముందర కాళ్లకు చక్కని బంధం అయిపోయింది. అంతేకాదు.. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ అధిష్టా నానికి కూడా బిగ్ రిలీఫ్ వచ్చేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా.. సీఎం సీటు కోసం.. కర్ణాటకలో ఇద్దరు మాత్రమే కొట్టుకున్నంత పనిచేస్తే.. ఇక్కడ నలుగురు నుంచి పది మంది వరకు నాయకులు సీఎం రేసులో ఉన్నారు.
సో… ఈ పరిణామం.. ఎన్నికల్లో గెలిచిన కష్టం కన్నా ఎక్కువగా కాంగ్రెస్కు ఏర్పడుతుంది. కర్ణాటకలోనూ ఇదే కదా జరిగింది. ఎంతో కష్టపడి పార్టీని గెలిపించినా.. చివరకు ముఖ్యమంత్రి పీఠం విషయానికి వస్తే.. మాత్రం దానికి మించిన కష్టం పార్టీ పడాల్సి వచ్చింది. ఇక, తెలంగాణలో అధికారం కోసం ఆవురావురు మంటున్ననాయకులు రేపు ప్రజలు అధికారం కట్టబెట్టాక.. సీఎం సీటు కోసం కర్ణాటకను మించిన ఫైట్ చేసుకుంటారనడంలో సందేహం లేదు.
దీంతో అధిష్టానానికి తిప్పలు తప్పవు. సో.. ఇప్పుడు రేవంత్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఈ సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటు అధికార పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు .. ప్రజల్లో సానుభూతి తెచ్చుకునేందుకు.. గెలుపు గుర్రం ఎక్కడానికి.. ముఖ్యంగా రేపు సీఎం సీటు కోసం నేతలు కొర్రీలు పెట్టుకోకుండా ఉండేందుకు కూడా సీతక్క మంత్రం పనిచేస్తుందని అంటున్నారు. సీతక్క అయితే.. విభేదించే నాయకులు దాదాపు ఉండరు. పైగా సామాజిక వర్గం పరంగా కూడా ఎవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు. సో.. దెబ్బకు ఠా! అన్నట్టుగా రేవంత్ చేసిన ప్రకటన కాంగ్రెస్ను దారిలో పెట్టేస్తుందని అంటున్నారు.
This post was last modified on July 11, 2023 2:25 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…