దెబ్బకు ఠా! అనే మాట వినే ఉంటారు. ఆ విషయం ఎలా ఉన్నా.. ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఒక్క మాటకు లైన్లోకి వచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ అధిష్టానానికి కూడా బిగ్ రిలీఫేనని చెబుతున్నారు పరిశీలకులు. మంచికో.. చెడుకో.. ఆలోచించి అన్నారో.. లేక అన్యాపగా అనేశారో.. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఒక వ్యాఖ్య అయితే చేసేశారు. ప్రస్తుత ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేయొచ్చు.. అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ మాట నిజమవుతుందా? కాదా.. అనే మీమాంస.. సందేహాలను పక్కన పెడితే.. కాంగ్రెస్లో సీఎం రేసులో ఉన్నవారి ముందర కాళ్లకు చక్కని బంధం అయిపోయింది. అంతేకాదు.. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ అధిష్టా నానికి కూడా బిగ్ రిలీఫ్ వచ్చేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా.. సీఎం సీటు కోసం.. కర్ణాటకలో ఇద్దరు మాత్రమే కొట్టుకున్నంత పనిచేస్తే.. ఇక్కడ నలుగురు నుంచి పది మంది వరకు నాయకులు సీఎం రేసులో ఉన్నారు.
సో… ఈ పరిణామం.. ఎన్నికల్లో గెలిచిన కష్టం కన్నా ఎక్కువగా కాంగ్రెస్కు ఏర్పడుతుంది. కర్ణాటకలోనూ ఇదే కదా జరిగింది. ఎంతో కష్టపడి పార్టీని గెలిపించినా.. చివరకు ముఖ్యమంత్రి పీఠం విషయానికి వస్తే.. మాత్రం దానికి మించిన కష్టం పార్టీ పడాల్సి వచ్చింది. ఇక, తెలంగాణలో అధికారం కోసం ఆవురావురు మంటున్ననాయకులు రేపు ప్రజలు అధికారం కట్టబెట్టాక.. సీఎం సీటు కోసం కర్ణాటకను మించిన ఫైట్ చేసుకుంటారనడంలో సందేహం లేదు.
దీంతో అధిష్టానానికి తిప్పలు తప్పవు. సో.. ఇప్పుడు రేవంత్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఈ సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటు అధికార పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు .. ప్రజల్లో సానుభూతి తెచ్చుకునేందుకు.. గెలుపు గుర్రం ఎక్కడానికి.. ముఖ్యంగా రేపు సీఎం సీటు కోసం నేతలు కొర్రీలు పెట్టుకోకుండా ఉండేందుకు కూడా సీతక్క మంత్రం పనిచేస్తుందని అంటున్నారు. సీతక్క అయితే.. విభేదించే నాయకులు దాదాపు ఉండరు. పైగా సామాజిక వర్గం పరంగా కూడా ఎవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు. సో.. దెబ్బకు ఠా! అన్నట్టుగా రేవంత్ చేసిన ప్రకటన కాంగ్రెస్ను దారిలో పెట్టేస్తుందని అంటున్నారు.
This post was last modified on July 11, 2023 2:25 pm
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…
ఏపీలో గత 2 మాసాల కిందటి వరకు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అయిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి నియోజకవర్గం…
ప్రజలు, శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిని కొట్టే హక్కు పోలీసులకు ఉందా? అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇలా అయితే.. దేశం మొత్తం…