ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ నాయకులకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోం ది. మంత్రులుగా ఉన్నవారిని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో కీలక నేతలకు టికెట్ భయం కన్నా.. ఓటమి భయం వెంటాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు నగరి, చిలకలూరిపేట, శ్రీకాకుళం, పలాస, కళ్యాణదుర్గం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లోని మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఎదురు గాలి వీస్తోంది. పలాసలో అయితే బహిరంగంగానే నాయకులు ఓడిస్తామని చెబుతున్నారు. ఇక, నగరిలో అయితే.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా.. మంత్రి రోజా ఓటమికి తాము కూడా చేయి కలుపుతామని చెబుతున్నా రు. దీంతో రోజా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంటున్నారు.
ఇక, శ్రీకాకుళంలో వ్యతిరేకత అండర్ కరెంటును తలపిస్తోంది. మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ఆయనను ప్రతిపక్ష నేతలు ఓడించాల్సిన అవసరం లేదని.. సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చిలకలూరిపేటలోనూ.. మంత్రి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం అయితే.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణదుర్గంలోనూ.. మంత్రికి వ్యతిరేకంగా ముఠా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో మంత్రులుగా ఉన్నవారికి సెగతప్పదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 11, 2023 12:12 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…