ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ నాయకులకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోం ది. మంత్రులుగా ఉన్నవారిని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో కీలక నేతలకు టికెట్ భయం కన్నా.. ఓటమి భయం వెంటాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు నగరి, చిలకలూరిపేట, శ్రీకాకుళం, పలాస, కళ్యాణదుర్గం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లోని మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఎదురు గాలి వీస్తోంది. పలాసలో అయితే బహిరంగంగానే నాయకులు ఓడిస్తామని చెబుతున్నారు. ఇక, నగరిలో అయితే.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా.. మంత్రి రోజా ఓటమికి తాము కూడా చేయి కలుపుతామని చెబుతున్నా రు. దీంతో రోజా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంటున్నారు.
ఇక, శ్రీకాకుళంలో వ్యతిరేకత అండర్ కరెంటును తలపిస్తోంది. మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ఆయనను ప్రతిపక్ష నేతలు ఓడించాల్సిన అవసరం లేదని.. సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చిలకలూరిపేటలోనూ.. మంత్రి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం అయితే.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణదుర్గంలోనూ.. మంత్రికి వ్యతిరేకంగా ముఠా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో మంత్రులుగా ఉన్నవారికి సెగతప్పదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 11, 2023 12:12 pm
విద్యార్థి ఉద్యమాలకు తెరదీసిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నాయకులు, కార్యకర్తలకు తొలిసారి పరాభవం ఎదురైంది. ఇటీవల నీట్ ప్రశ్న పత్రం…
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…