ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ నాయకులకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోం ది. మంత్రులుగా ఉన్నవారిని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో కీలక నేతలకు టికెట్ భయం కన్నా.. ఓటమి భయం వెంటాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు నగరి, చిలకలూరిపేట, శ్రీకాకుళం, పలాస, కళ్యాణదుర్గం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లోని మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఎదురు గాలి వీస్తోంది. పలాసలో అయితే బహిరంగంగానే నాయకులు ఓడిస్తామని చెబుతున్నారు. ఇక, నగరిలో అయితే.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా.. మంత్రి రోజా ఓటమికి తాము కూడా చేయి కలుపుతామని చెబుతున్నా రు. దీంతో రోజా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంటున్నారు.
ఇక, శ్రీకాకుళంలో వ్యతిరేకత అండర్ కరెంటును తలపిస్తోంది. మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ఆయనను ప్రతిపక్ష నేతలు ఓడించాల్సిన అవసరం లేదని.. సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చిలకలూరిపేటలోనూ.. మంత్రి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం అయితే.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణదుర్గంలోనూ.. మంత్రికి వ్యతిరేకంగా ముఠా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో మంత్రులుగా ఉన్నవారికి సెగతప్పదని అంటున్నారు పరిశీలకులు.
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం తన పొరుగు రాష్ట్రం తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని హన్మకొండ…
వయసు ఒక నంబర్ మాత్రమే అనే నానుడిని రుజువు చేస్తూ 94 ఏళ్ల వయసులో ఫుల్ లెంత్ ఫీచర్ ఫిలిం…
సమంత మా ఇంటి బంగారం బాగానే బోణీ కొట్టేలా ఉంది. ఓవర్సీస్ లో ఇప్పటికే లక్షా పాతిక వేల డాలర్లు…
వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల కానున్న వారణాసి నుంచి ఇప్పుడప్పుడే అప్డేట్స్ వచ్చేలా లేవు కానీ ఈ ప్రాజెక్టుకు…
దర్శకుడు లొకేషన్లో లేకుండా సినిమా తీయడం సాధ్యం అవుతుందా? అదెలా సాధ్యం అంటారా? సింగ్ గీతం టీం ఈ విషయాన్ని…
నిజమేనండోయ్… ఏ విషయంలో అయినా టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ…