ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ నాయకులకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోం ది. మంత్రులుగా ఉన్నవారిని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో కీలక నేతలకు టికెట్ భయం కన్నా.. ఓటమి భయం వెంటాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు నగరి, చిలకలూరిపేట, శ్రీకాకుళం, పలాస, కళ్యాణదుర్గం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లోని మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఎదురు గాలి వీస్తోంది. పలాసలో అయితే బహిరంగంగానే నాయకులు ఓడిస్తామని చెబుతున్నారు. ఇక, నగరిలో అయితే.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా.. మంత్రి రోజా ఓటమికి తాము కూడా చేయి కలుపుతామని చెబుతున్నా రు. దీంతో రోజా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంటున్నారు.
ఇక, శ్రీకాకుళంలో వ్యతిరేకత అండర్ కరెంటును తలపిస్తోంది. మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ఆయనను ప్రతిపక్ష నేతలు ఓడించాల్సిన అవసరం లేదని.. సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చిలకలూరిపేటలోనూ.. మంత్రి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం అయితే.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణదుర్గంలోనూ.. మంత్రికి వ్యతిరేకంగా ముఠా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో మంత్రులుగా ఉన్నవారికి సెగతప్పదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 11, 2023 12:12 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…