ఏలూరు సభలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లపై, ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాళ్లు పవన్ మొక్కితే ఇబ్బంది లేదని, కానీ వాలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.
జగన్ ను ఏకవచనంతో పిలిచి చూడాలని ఛాలెంజ్ చేశారు. పవన్ ఒక్కడికే నాలుక లేదని, వైసీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు నాలుక ఉందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో మహిళల మిస్సింగ్ గురించి పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తం 16 వేలకు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, వాటిపై మాట్లాడకుండా వాలంటీర్లపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటం, విషం చిమ్మడం సరికాదని, వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్, చంద్రబాబులకు భయం పట్టుకుందని, రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు సేవలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే వాలంటీర్లను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
జనసేన ప్రభుత్వంగానీ, టీడీపీ ప్రభుత్వం గానీ వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగలరా అని నాని…చంద్రబాబు, పవన్ లకు సవాల్ విసిరారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పవన్ జీవితానికి మాయని మచ్చ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడు కరెక్ట్ అని చిరంజీవి గతంలో అభిప్రాయపడ్డారని, చిరంజీవి అలా ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. చిరంజీవికి, పవన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.
This post was last modified on July 10, 2023 9:22 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…