Political News

వైసీపీ ఎంపీల్లో మైన‌స్‌లు.. ఎంద‌రంటే..!

ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఎన్నిక‌ల లెక్క‌లు మారుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు ఎమ్మెల్యేల ప‌నితీరు.. వారి గ్రాఫ్‌పైనే పార్టీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ దృష్టి పెట్టారు. వారిని అదిలిస్తున్నారు.. క‌దిలిస్తున్నారు.. ప్ర‌జ‌ల చెంత‌కు పంపిస్తున్నారు. జాగ్ర‌త్త‌గా లేక‌పోతే.. టికెట్ ద‌క్క‌ద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నారు. స‌రే.. ఇదంతా బాగానే ఉంది. మ‌రి ఎంపీల మాటేంటి? వారి లెక్క‌ల ప‌రిస్థితి ఏంటి? అనేది మాత్రం ప్ర‌స్తుతానికి ప‌క్క‌న పెట్టారు.

కానీ, అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో మాత్రం ఎంపీల్లో మైన‌స్‌లు ఎవ‌రు? ప్ల‌స్‌లు ఎవ‌రు? అనే చ‌ర్చ సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం లోక్‌స‌భ‌కు సంబంధించి వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో ఒక‌రు రెబ‌ల్ అయిన విష‌యం తెలిసిందే. ఇక‌, మిగిలిన 21 మందిలో ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వారికే క‌నుక టికెట్లు ఇస్తే.. గెలిచేది కేవ‌లం 7-8 మంది మాత్ర‌మేన‌ని లెక్క‌లు తేలుతుండ‌డం.. అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చ‌ర్చ‌కు వ‌స్తుండ‌డం సంచ‌లనంగా మారింది.

గెలిచే వారిక‌న్నా.. ఓడే వారే ఎక్కువ‌ని చెబుతున్నారు. ఓట‌మి ఎదుర్కొనే ఎంపీల జాబితాలో మ‌హిళా నాయ‌కులు కూడా ఉన్నార‌ని వైసీపీలో చ‌ర్చ సాగుతోంది. ఇక‌, ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. ఫ‌స్ట్ పోయే సీటు హిందూపురం, నెక్ట్స్ పోయే సీటు రాజ‌మండ్రి అని కీల‌క నాయ‌కులు ఘంటా ప‌థంగా చెబుతున్నారు. ఇక‌, కాకినాడ‌, అర‌కు ఎంపీ సీట్లు కూడా ఓట‌మి అంచుల్లో ఉన్నాయ‌ని అంటున్నారు.

ఏలూరు, క‌ర్నూలు, బాప‌ట్ల ఎంపీ స్థానాలు ఫిఫ్టీగా ఉన్నాయ‌ని అయితే.. ప్ర‌తిప‌క్షాల దూకుడు పెరిగి.. ఇక్క‌డ క‌నుక లెక్క‌లు మారితే.. గెలుపు గుర్రం ఎక్క‌డం సాధ్యం కాద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఇక‌, విజ‌య న‌గ‌రం, నంద్యాల, అన‌కాప‌ల్లి ప‌రిస్థితి కూడా ఇలానే ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఎంపీ అభ్య‌ర్థుల‌ను మారిస్తే త‌ప్ప‌.. మార్పు క‌నిపించ‌డం క‌ష్ట‌మ‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. క‌డ‌ప‌లో ఈ సారి ఓట‌మి ఖాయ‌మ‌ని అంటున్నారు. మిథున్‌రెడ్డి గెలుపు గుర్రం ఎక్కుతార‌ని అంచ‌నా ఉంది. ఈ నేప‌థ్యంలో ఎంపీల ప‌రిస్థితి మైన‌స్‌ల‌లోనే ఉంద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌రి జ‌గ‌న్ ఎలా ముందుకు వెళ్తారో చూడాలి.

This post was last modified on July 10, 2023 3:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్లాస్ రవితేజకు మాస్ చిరు ఛాలెంజ్

సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…

22 minutes ago

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

2 hours ago

‘పోలవరం పూర్తయితే ఏపీతో ఎవరూ పోటీ పడలేరు’

పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…

2 hours ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

3 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

8 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

8 hours ago