జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతారు.. మరికొందరు నమ్మరు. కానీ.. శాస్త్రీయంగా కొన్ని అంశాల ప్రాతిపదికన ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందని విశ్లేషించే వారు కొందరుంటారు. ఆ కోవలోకే వస్తారు అమెరికాకు చెందిన ప్రొఫెసర్ అలన్.
ఆయన ప్రత్యేకత ఏమంటే.. గడిచిన నలభై ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో ఆయన ఇట్టే చెప్పేస్తారు. ఆయన నోటి నుంచి ఏదైనా అంచనా వెలువడిందంటే.. అది జరిగిపోతుందంతే. గడిచిన నలభై ఏళ్లుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచేదెవరో ముందే చెప్పేయటం.. ఆయన చెప్పినట్లే తుది ఫలితం రావటం ఇప్పటివరకు జరిగింది.
ఎక్కడిదాకానో ఎందుకు 2016లో హిల్లరీ క్లింటన్ మీద ట్రంప్ గెలుస్తారని ఆయన అంచనా వేశారు. ఆయన మాటల్ని చాలామంది పట్టించుకోలేదు. తుది ఫలితం ఏమైందో తెలిసిందే. అనూహ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్.. రెండోసారి అధ్యక్షుడిగా విజయం సాధించాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం ఆయన విశ్వ ప్రయత్నాల్ని చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఆయనకు ప్రత్యర్థిగా నిలిచిన జో బైడెన్ బలమైన అభ్యర్థే అయినప్పటికీ.. ఆయన వయసు ఆయనకు పెద్ద అవసరోధంగా మారింది. ఈ విషయాన్ని గుర్తించిన జోబైడెన్ తాజాగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా భారత సంతతికి చెందిన కమలా హారీస్ ను ఉపాధ్యక్ష పదవికి ఎంపిక చేయటం ద్వారా తన చాణుక్యాన్ని ప్రదర్శించారు. ఇదిలా ఉంటే.. తాజాగా జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ కు ఓటమి తప్పదని స్పష్టం చేశారు ప్రొఫెసర్ అలాన్.
తాను వెల్లడించిన అంచనా పదమూడు సూత్రాల్ని ఆధారంగా చేసుకొని చెప్పానని.. ఇప్పటివరకు తాను చెప్పిన ఏ అంచనా కూడా తప్పలేదన్నారు. అలన్ నోటి నుంచి వచ్చిన తాజా అంచనా రిపబ్లికన్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. మరి.. ఈ అంచనాపై ట్రంప్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.
This post was last modified on August 14, 2020 7:07 pm
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…
మెగాస్టార్ చిరంజీవి అభినందన అంటే యువ నటీనటులకు ఒక సర్టిఫికెట్ లాంటిదే. ఐతే ఏదైనా ఈవెంట్లకు వచ్చినపుడు అక్కడున్న వారిని…
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…