రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ స్ధానాల్లో మళ్ళీ గెలుపుపై చంద్రబాబునాయుడు దృష్టిపెట్టినట్లు సమాచారం. హ్యాట్రిక్ స్ధానాల్లో నాలుగోసారి గెలిచి పార్టీసత్తాను చాటాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకు వీలుగా గెలుపుకోసం హ్యాట్రిక్ వీరులతో చంద్రబాబు ఇప్పటికే అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. 2009, 2014, 19 ఎన్నికల్లో టీడీపీ వరుసగా విజయాలు సాధించిన సీట్లు రాష్ట్రం మొత్తం మీద ఏడు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో గెలుపును కంటిన్యుచేస్తే నాలుగోసారి కూడా గెలిచినట్లవుతుందన్నది చంద్రబాబు ఆలోచన.
హ్యాట్రిక్ సీట్లు సాధించిన నియోజకవర్గాలు కుప్పం, హిందుపురం, గన్నవరం, మండపేట, విశాఖపట్నం తూర్పు, రాజమండ్రి రూరల్, ఇచ్చాపురం ఉన్నాయి. వీటిల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుచ్చయ్య చౌదరి గెలిచింది రెండుసార్లే అయినా అంతకుముందు అంటే 2009లో చందన రమేష్ గెలిచారు. అంటే రెండు ఎన్నికల్లో అభ్యర్ధులు మారినా మూడు ఎన్నికల్లో వరుసగా టీడీపీనే గెలుస్తోంది.
ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచినా తర్వాత చంద్రబాబుకు దూరమైపోయి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. దాంతో రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ జెండా ఎగరేయాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ బచ్చుల అర్జునుడిని ఇన్చార్జిగా నియమించినా ఆయన ఈమధ్యనే మరణించారు. అందుకనే ఇక్కడ గట్టి అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. నందమూరి వంశం నుండి ఎవరినైనా పోటీపెడితే ఎలాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. మరి ఈ సీటు విషయంలో ఏమిచేస్తారో చూడాలి.
అలాగే హిందుపురంలో కూడా రెండు ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గెలిచారు. మూడోసారి గెలిస్తే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినట్లవుతుంది. పార్టీ 1983లో పెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఓటమెరుగని నియోజకవర్గం హిందుపురమే. ఇచ్చాపురంలో బెందాళం అశోక్ కూడా 2014, 19 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. మూడో ఎన్నికల్లో పోటీచేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం తూర్పులోను, మండపేటలో జోగేశ్వరరావు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కుప్పంలో చంద్రబాబు మాత్రమే వరుసగా ఆరుసార్లుగా గెలుస్తున్నారు. మొత్తానికి అభ్యర్ధులకు లేదా టీడీపీకి హ్యాట్రిక్ విజయాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది.
This post was last modified on July 10, 2023 1:35 pm
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…