ఆయన నోరు విప్పితే.. మాటల తూటాలు పేలతాయి. ప్రతిపక్ష నాయకులపై అనర్గళంగా విమర్శలు గుప్పించగల ఫైర్ బ్రాండ్ మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే అనకాపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చిన్న విషయంలో ఆయన తడబడ్డారు. ముందు ఒక మాట.. తర్వాత మరో మాట మాట్లాడారు. ఈ సవరణలు ఇప్పటి వరకు లేకపోవడం గమనార్హం.
విషయం ఏంటంటే.. విశాఖలోని ప్రఖ్యాత రుషి కొండ బీచ్లో సాధారణ పౌరులు కాలక్షేపం చేయడానికి ప్రభుత్వం ప్రవేశ రుసుము పెట్టిన విషయం తెలిసిందే. అయితే,.. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇటు మీడియా, అటు ప్రజా సంఘాలు.. స్థానికుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు మంత్రి అమర్నాథ్ మీడియా ముందుకు వచ్చారు. రుషి కొండలో ప్రవేశానికి రూ.20 ఫీజు నిర్ణయించామని ముందు చెప్పారు.
రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉందని, జియెగ్రాఫికల్ ఐడెంటిటీ (జీఐ) కలిగిన ఈ బీచ్ నిర్వహణ, ఆ గుర్తింపును మరింతగా మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంలో ప్రవేశ రుసుము పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అయితే.. మళ్లీ ఏమనుకున్నారో ఏమో.. మరో కొద్దిసేపటి తర్వాత మీడియా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. బీచ్ నిర్వహణకు రుసుము అవసరం ఉందని మాట్లాడిన ఆయన ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ రుషి కొండా బీచ్ కు ప్రవేశ రుసుము అవసరం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఫీజు నిర్ణాయక అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుషి కొండ బీచ్ ప్రవేశ రుసుము పెట్టాలనే ఆలోచన కూడా లేదని తెలిపారు. అయితే.. దీనిపై వ్యతిరేకత రావడం దురదృష్టకరమన్నారు. మొత్తానికి ఆయన తడబాటుపై విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on July 10, 2023 8:32 am
అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ను చూస్తే పెద్ద స్టార్ కావడానికి అవసరమైన అన్ని లక్షణాలు ఉన్నట్లే కనిపిస్తాడు. ఆరడుగుల ఆజానుబాహుడు,…
పోలవరం జిల్లా ఈర్లపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్ధిని ముర్రం శివాని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన కారణాలు…
తెలంగాణలో ఆక్రమ కట్టడాలకు సింహ స్వప్నంగా మారిన హైడ్రా విధానంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తమ మాటంటే హైడ్రాకు…
వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ నాయకుడు, మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీలో కోడలు చేసిన ఆరోపణలు పెను కుదుపునకు…
సినిమాల్లో రాజకీయ అంశాలు పెట్టాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితులున్నాయి ప్రస్తుతం. తమ నాయకుల మీద పొలిటికల్ కౌంటర్లు వేస్తే…
జన నాయకుడు సినిమా ఎలా ఉందనేది మళ్ళీ చెప్పనవసరం లేదు. విజయ్ ఇమేజ్ పుణ్యమాని రెండు వందల కోట్లు దాటేసింది…