Political News

మాట‌ల తూటాలు పేల్చే మంత్రి గారు త‌డ‌బ‌డ్డారే.. !

ఆయ‌న నోరు విప్పితే.. మాట‌ల తూటాలు పేల‌తాయి. ప్ర‌తిప‌క్ష నాయకుల‌పై అన‌ర్గ‌ళంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌గ‌ల ఫైర్ బ్రాండ్ మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌నే అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌. ఆయ‌న మాట్లాడితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చిన్న విష‌యంలో ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ముందు ఒక మాట‌.. త‌ర్వాత మ‌రో మాట మాట్లాడారు. ఈ స‌వ‌ర‌ణ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. విశాఖలోని ప్ర‌ఖ్యాత రుషి కొండ బీచ్లో సాధార‌ణ పౌరులు కాల‌క్షేపం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌వేశ రుసుము పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే,.. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటు మీడియా, అటు ప్ర‌జా సంఘాలు.. స్థానికుల నుంచి కూడా వ్య‌తిరేక‌త ఎదురైంది. దీంతో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేందుకు మంత్రి అమ‌ర్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చారు. రుషి కొండ‌లో ప్రవేశానికి రూ.20 ఫీజు నిర్ణయించామ‌ని ముందు చెప్పారు.

రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉందని, జియెగ్రాఫికల్ ఐడెంటిటీ (జీఐ) కలిగిన ఈ బీచ్ నిర్వహణ, ఆ గుర్తింపును మరింతగా మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంలో ప్రవేశ రుసుము పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అయితే.. మ‌ళ్లీ ఏమ‌నుకున్నారో ఏమో.. మరో కొద్దిసేప‌టి త‌ర్వాత‌ మీడియా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యలను వెన‌క్కి తీసుకున్నారు. బీచ్ నిర్వహణకు రుసుము అవసరం ఉందని మాట్లాడిన ఆయ‌న‌ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ రుషి కొండా బీచ్ కు ప్రవేశ రుసుము అవసరం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఫీజు నిర్ణాయక అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుషి కొండ బీచ్ ప్ర‌వేశ రుసుము పెట్టాల‌నే ఆలోచన కూడా లేదని తెలిపారు. అయితే.. దీనిపై వ్య‌తిరేక‌త రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మొత్తానికి ఆయ‌న త‌డ‌బాటుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on July 10, 2023 8:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago