Political News

మాట‌ల తూటాలు పేల్చే మంత్రి గారు త‌డ‌బ‌డ్డారే.. !

ఆయ‌న నోరు విప్పితే.. మాట‌ల తూటాలు పేల‌తాయి. ప్ర‌తిప‌క్ష నాయకుల‌పై అన‌ర్గ‌ళంగా విమ‌ర్శ‌లు గుప్పించ‌గ‌ల ఫైర్ బ్రాండ్ మంత్రిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌నే అన‌కాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, వైసీపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్‌. ఆయ‌న మాట్లాడితే ఎలా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. అనూహ్యంగా చిన్న విష‌యంలో ఆయ‌న త‌డ‌బ‌డ్డారు. ముందు ఒక మాట‌.. త‌ర్వాత మ‌రో మాట మాట్లాడారు. ఈ స‌వ‌ర‌ణ‌లు ఇప్ప‌టి వ‌ర‌కు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

విష‌యం ఏంటంటే.. విశాఖలోని ప్ర‌ఖ్యాత రుషి కొండ బీచ్లో సాధార‌ణ పౌరులు కాల‌క్షేపం చేయ‌డానికి ప్ర‌భుత్వం ప్ర‌వేశ రుసుము పెట్టిన విష‌యం తెలిసిందే. అయితే,.. దీనిపై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇటు మీడియా, అటు ప్ర‌జా సంఘాలు.. స్థానికుల నుంచి కూడా వ్య‌తిరేక‌త ఎదురైంది. దీంతో ఈ విష‌యంపై క్లారిటీ ఇచ్చేందుకు మంత్రి అమ‌ర్నాథ్ మీడియా ముందుకు వ‌చ్చారు. రుషి కొండ‌లో ప్రవేశానికి రూ.20 ఫీజు నిర్ణయించామ‌ని ముందు చెప్పారు.

రుషికొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ అంతర్జాతీయ గుర్తింపు కలిగి ఉందని, జియెగ్రాఫికల్ ఐడెంటిటీ (జీఐ) కలిగిన ఈ బీచ్ నిర్వహణ, ఆ గుర్తింపును మరింతగా మెయింటెయిన్ చేయాలనే ఉద్దేశంలో ప్రవేశ రుసుము పెట్టాలని నిర్ణయించి ఉండొచ్చని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అయితే.. మ‌ళ్లీ ఏమ‌నుకున్నారో ఏమో.. మరో కొద్దిసేప‌టి త‌ర్వాత‌ మీడియా ముందుకొచ్చి ఆ వ్యాఖ్యలను వెన‌క్కి తీసుకున్నారు. బీచ్ నిర్వహణకు రుసుము అవసరం ఉందని మాట్లాడిన ఆయ‌న‌ ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో గానీ రుషి కొండా బీచ్ కు ప్రవేశ రుసుము అవసరం లేదన్నారు.

రాష్ట్ర ప్రభుత్వమే నిధులు వెచ్చిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ తీరు వల్ల ఫీజు నిర్ణాయక అంశం చర్చకు వచ్చిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి రుషి కొండ బీచ్ ప్ర‌వేశ రుసుము పెట్టాల‌నే ఆలోచన కూడా లేదని తెలిపారు. అయితే.. దీనిపై వ్య‌తిరేక‌త రావ‌డం దుర‌దృష్ట‌క‌ర‌మ‌న్నారు. మొత్తానికి ఆయ‌న త‌డ‌బాటుపై విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

This post was last modified on July 10, 2023 8:32 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఈసారి ఉగాది పండగ మాత్రమే కాదు

తెలుగు వారి నూత‌న సంవ‌త్స‌రాది ఉగాది మ‌రో 20 రోజుల్లో రానుంది. ఏటా వ‌చ్చే పండుగే క‌దా.. ఏముంది ?…

3 hours ago

కూటమి ఎమ్మెల్యేల ప్రశ్నలే ఘాటుగా ఉన్నాయి

అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విష‌యం తెలిసిందే. త‌మ‌కు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా ఇస్తే త‌ప్ప‌.. స‌భ‌కు…

6 hours ago

రామాయణానికి నాలుగు వేల కోట్లు ఎలా?

ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…

6 hours ago

ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం: బయటపడుతున్న నిజాలు

జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…

7 hours ago

వెంకటేష్ వదులుకుంటే మంచి నిర్ణయమే

ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…

8 hours ago

పునర్విక ప్రాణాలకు లోకేష్ అండ

మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్‌ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…

9 hours ago