Political News

కుక్క తోక తో గోదావరి ఈదుతున్న పవన్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏలూరు నుంచి వారాహి యాత్ర రెండో విడతను ఈరోజు ప్రారంభిస్తున్న సంగతి తెలిసిందే. తొలి విడత వారాహి యాత్రలో వైసీపీ నేతలు వర్సెస్ పవన్ అన్న రీతిలో మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే రెండో విడత యాత్ర మొదలు కాకముందే పవన్ కళ్యాణ్ పై వైసీపీ నేతలు విమర్శలు మొదలుపెట్టారు. తాజాగా పవన్ పై మంత్రి గుడివాడ గుడివాడ అమర్నాథ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. పవన్ సినిమాలోని హీరో అని రాజకీయాల్లో మాత్రం సైడ్ హీరో అని అమర్నాథ్ పంచులు వేశారు.

ఎన్నికలు జరగకుండానే పవన్ విజయ యాత్ర చేస్తున్నారని, మొన్న పార్ట్-1 జరిగిందని, ఇప్పుడు పార్ట్-2 మొలైందని ఎద్దేవా చేశారు. రాజకీయం అంటే ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్ అని పవన్ అనుకుంటున్నారా అని అమర్నాథ్ ప్రశ్నించారు. పవన్ ను హీరోని చేయాలని జనసేన నేతలు, కార్యకర్తలు అనుకుంటున్నారని, కానీ, వేరే సినిమా హీరో పక్కన సైడ్ హీరోలా నిల్చుంటానని పవన్ అంటున్నారని సెటైర్లు వేశారు. అయితే, పక్క సినిమా హీరో చంద్రబాబు…విలన్ అనే మరచిపోయిన పవన్ ఆయన కోసం ఎందుకు తాపత్రయ పడుతున్నారని ప్రశ్నించారు

175 సీట్లలో జనసేన ఒంటరిగా పోటీ చేస్తే జనసేనకు ఏదో ఒక రోజు ప్రజలు అవకాశం ఇవ్వొచ్చని అన్నారు. అలా కాకుండా చంద్రబాబు వెంట ఉంటే కుక్కతోక పట్టుకుని గోదావరి ఈడుతున్నట్టే అని ఎద్దేవా చేశారు. చంద్రబాబును భుజాన వేసుకుని తిరగడానికి సొంతగా రాజకీయ పార్టీ దేనికి అని సంచలన వ్యాఖ్యలు చేశారు. 175 స్థానాలు ఎలా గెలవాలి అని తాము ఆలోచిస్తున్నామని, 175 సీట్లలో అభ్యర్థులను ఎలా నిలబెట్టాలి అని పవన్ చంద్రబాబు ఆలోచిస్తున్నారని విమర్శించారు. జనసేన, టీడీపీలు తమకు పోటీ కాదని, ఎన్ని యాత్రలు చేసినా 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని గుడివాడ అమర్నాథ్ ధీమా వ్యక్తం చేశారు.

This post was last modified on July 9, 2023 4:42 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాగయన్ లీక్ వెనుక..

ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…

12 minutes ago

గాడ్ ఆఫ్ వార్… ఏదో ఒకటి తేలిపోవాలి

గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…

14 minutes ago

మృణాల్‌తో సినిమా చేస్తే హీరో ఔటేనా?

సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…

2 hours ago

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై…

3 hours ago

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…

4 hours ago

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…

4 hours ago