Political News

జ‌గ‌న్.. 639 కోట్ల‌ను ఏం చేశారు? మోడీ సీరియ‌స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సీరియ‌స్ అయింది. తాము ఒక కార్య‌క్ర‌మం కోసం ఇచ్చిన సొమ్ముల‌ను.. ఆ కార్యక్ర‌మానికి ఖ‌ర్చు చేయ‌క‌పోగా.. క‌నీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. వేరే వాటికి ఎలా వాడేస్తార‌ని నిల‌దీసింది. ఈ క్ర‌మంలో సుమారు 639 కోట్ల రూపాయ‌ల‌ను ఏం చేశార‌ని కేంద్ర స‌ర్కారు నిల‌దీసింది. అంతేకాదు.. త‌క్ష‌ణం ఈ నిధుల‌ను సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఏం జ‌రిగిందంటే..

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద‌.. అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించా ల‌నే ల‌క్ష్యాన్నినిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో 90 శాతం నిధుల‌ను కేంద్ర‌మే ఇస్తోంది. మిగిలిన 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాల‌ని, ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి.. ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేరే ప‌థ‌కాల‌కు వాడేసింది.

గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులు దారిమళ్లించిన ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే మోడీ స‌ర్కారు తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.1,039 కోట్ల నిధుల్లో రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఖాతాకు ఆ నిధులు జ‌మ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.1879 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

ఈ మొత్తంలో నుంచి మరో రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల రూపాయల మేర బిల్లులను రాష్ట్ర గృహనిర్మాణశాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్‌ నోడల్‌ ఖాతాలో కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే మిగిలాయి. మరో వైపు పీఎం ఆవాస్‌ యోజనలో రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఈ ప‌రిణామాలపై ఉప్పందిన కేంద్రం తాజాగా జ‌గ‌న్‌ను నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 9, 2023 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

2 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

4 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

11 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

12 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

12 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

14 hours ago