Political News

జ‌గ‌న్.. 639 కోట్ల‌ను ఏం చేశారు? మోడీ సీరియ‌స్‌

ఏపీ సీఎం జ‌గ‌న్ వ్య‌వ‌హార శైలిపై తాజాగా కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు సీరియ‌స్ అయింది. తాము ఒక కార్య‌క్ర‌మం కోసం ఇచ్చిన సొమ్ముల‌ను.. ఆ కార్యక్ర‌మానికి ఖ‌ర్చు చేయ‌క‌పోగా.. క‌నీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. వేరే వాటికి ఎలా వాడేస్తార‌ని నిల‌దీసింది. ఈ క్ర‌మంలో సుమారు 639 కోట్ల రూపాయ‌ల‌ను ఏం చేశార‌ని కేంద్ర స‌ర్కారు నిల‌దీసింది. అంతేకాదు.. త‌క్ష‌ణం ఈ నిధుల‌ను సంబంధిత ఖాతాలో జ‌మ చేసి ర‌సీదుల‌ను పంపించాల‌ని ఆదేశించింది. ఈ విష‌యం ప్ర‌భుత్వంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది.

ఏం జ‌రిగిందంటే..

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు.. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న ప‌థ‌కం కింద‌.. అన్ని రాష్ట్రాల్లోని పేద‌ల‌కు ఇళ్లు నిర్మించా ల‌నే ల‌క్ష్యాన్నినిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో 90 శాతం నిధుల‌ను కేంద్ర‌మే ఇస్తోంది. మిగిలిన 10 శాతం నిధుల‌ను రాష్ట్రాలు భ‌రించాల‌ని, ల‌బ్ధి దారుల‌ను ఎంపిక చేసి.. ఇళ్ల‌ను నిర్మించి ఇవ్వాల‌ని పేర్కొంది. ఈ క్ర‌మంలో ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్ల‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వం వేరే ప‌థ‌కాల‌కు వాడేసింది.

గృహ నిర్మాణానికి ఇచ్చిన‌ నిధులు దారిమళ్లించిన ఘ‌ట‌న తెలిసిన వెంట‌నే మోడీ స‌ర్కారు తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.1,039 కోట్ల నిధుల్లో రూ.639 కోట్ల‌ను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. తక్షణమే సింగిల్‌ నోడల్‌ ఖాతాకు ఆ నిధులు జ‌మ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస్‌ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.1879 కోట్లు కేంద్రం విడుదల చేసింది.

ఈ మొత్తంలో నుంచి మరో రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల రూపాయల మేర బిల్లులను రాష్ట్ర గృహనిర్మాణశాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్‌ నోడల్‌ ఖాతాలో కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే మిగిలాయి. మరో వైపు పీఎం ఆవాస్‌ యోజనలో రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఈ ప‌రిణామాలపై ఉప్పందిన కేంద్రం తాజాగా జ‌గ‌న్‌ను నిల‌దీయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 9, 2023 11:19 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లాప్ సినిమాకు సీక్వెల్ ప్లానింగా?

మూడేళ్ల ముందు పాన్ ఇండియ ా స్థాయిలో భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. అదేమీ బ్యాడ్…

5 minutes ago

స్లమ్ డాగ్ మేలుకుంటే బాగుండేది

దర్శకుడు పూరి జగన్నాథ్, హీరో విజయ్ సేతుపతి కలయికలో రూపొందిన స్లమ్ డాగ్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. అదిగో ఇదిగో…

7 hours ago

చరణ్ క్లారిటీ ఇస్తేనే చిరు బయటపడేది

మెగా ఫ్యాన్స్ మహా అయోమయంలో ఉన్నారు. పెద్ది పోస్ట్ పోన్ అయ్యింది కానీ జూన్ నెలలో ఏ డేట్ కి…

8 hours ago

ఫ్రెష్షుగా టార్గెట్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్

స్టార్ హీరోలు డిజాస్టర్లు ఇచ్చినప్పుడు దాని తాలూకు పరిణామాలు కేవలం బాక్సాఫీస్ నష్టాలకే పరిమితం కాదు. ముఖ్యంగా సోషల్ మీడియా…

9 hours ago

అలాంటి మ్యాజిక్.. ఇంకోసారి సాధ్యమేనా?

గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీల్లో ‘సైయారా’ ఒకటి. సంగీత ప్రధానంగా సాగే ఈ ప్రేమకథ.. దేశవ్యాప్తంగా…

9 hours ago

జననాగయన్ లీక్ వెనుక..

ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…

12 hours ago