Political News

ఈ ముగ్గురు నేతలు మాయమైపోయారా ?

ముఖ్యమంత్రి తమ జిల్లాకు వస్తున్నారంటే నేతలందరూ ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు పోటీలు పడతారు. ప్రధానమంత్రి తమ రాష్ట్రానికి వస్తున్నారంటే ఆ పార్టీ నేతలంతా తప్పకుండా హాజరవుతారు. ప్రధానమంత్రి దృష్టిలో పడితే చాలని ఎగబడతారు. అలాంటిది వరంగల్ జిల్లాకు నరేంద్రమోడి వచ్చినా ముగ్గురు నేతలు గైర్హాజరయ్యారంటే ఏమిటర్ధం ? చాలామంది సీనియర్లు పాల్గొన్న కార్యక్రమంలో ఈ ముగ్గురునేతలు మాత్రం ఎక్కడా కనబడలేదు. ఇపుడీ విషయమే పార్టీలో హాట్ టాపిక్ అయిపోయింది.

అసలు విషయం ఏమిటంటే వరంగల్ జిల్లాలో మోడీ పర్యటించారు. రైల్వే వ్యాగన్ సెంటర్ నిర్మాణానికి శంకుస్ధాపన చేశారు. అలాగే ఇతరత్రా అభివృద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారంచుట్టారు. మోడీ కార్యక్రమంలో పాల్గొనేందుకు నేతలంతా పోటీలుపడ్డారు. ఎన్నికలు దగ్గరకువచ్చేస్తున్నాయి కదా మోడీ కంట్లో పడి ఒక నమస్కారం పెట్టుకుంటే టికెట్ గ్యారెంటీ అని ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అయితే ఇంతమంది పాల్గొన్న కార్యక్రమంలో విజయశాంతి, వివేక్, చంద్రశేఖర్ మాత్రం ఎక్కడా కనబడలేదు.

వీళ్ళముగ్గురు పార్టీ నాయకత్వంపైన చాలా అసంతృప్తిగా ఉన్నారని తొందరలోనే బీజేపీకి రాజీనామా చేయబోతున్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. వీళ్ళచూపు కాంగ్రెస్ వైపే ఉందని మరో సమాచారం. ఇప్పటికే చంద్రశేఖర్, వివేక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవైపు మోడీ పర్యటన మరోవైపు బీజేపీకి రాజీనామా చేయబోతున్నారనే ప్రచారం మధ్యలో వీళ్ళు మాయమైపోయారు.

ఇంత ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ కు వీళ్ళముగ్గురూ ఎందుకు దూరంగా ఉన్నారనే విషయమై ఇపుడు పార్టీలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. వీళ్ళముగ్గురికీ కొత్తగా అపాయింటైన అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పెద్దగా సఖ్యత లేదు. పైగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళకి టికెట్ విషయంలో కూడా సరైన హామీ దొరకలేదని సమాచారం. ఇప్పటికే తన సేవలను పార్టీ నాయకత్వం సరిగా ఉపయోగించుకోవటంలేదని విజయశాంతి బాహాటంగానే చెప్పిన విషయం తెలిసిందే. ఎందుకైనా మంచిదని వివేక్ మాత్రం బీఆర్ఎస్ నేతలతో కూడా టచ్ లో ఉన్నట్లు టాక్ వినబడుతోంది. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on July 9, 2023 11:12 am

Share
Show comments
Published by
satya
Tags: Feature

Recent Posts

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

30 mins ago

టీడీపీలో 92 గెలుపు గుర్రాలు.. అధికారం ఖాయ‌మే!

బీజేపీ, జ‌న‌సేన‌లతో కూట‌మి క‌ట్టిన టీడీపీ ఏపీలో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోరాటం చేసిన విష‌యం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…

2 hours ago

గురుశిష్యులతో రామ్ చరణ్ సింగిల్ ప్లాన్

గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…

2 hours ago

జగన్ విమానం ఖర్చు అంతుంటుందా ?

ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…

3 hours ago

ప్రేక్షకుల అటెండెన్సుకి ఎవరిది బాధ్యత

చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…

3 hours ago

కోరుకోని చిక్కులో రష్మిక మందన్న

యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…

4 hours ago