Political News

అమరావతిపై జగన్ ప్లాన్-బి రెడీ?

గత ప్రభుత్వం ఏరి కోరి ఎంచుకుని రాజధానిని చేసిన అమరావతి విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ అంతుబట్టకుండా ఉంది. ప్రతిపక్షంలో ఉండగా.. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలనుకోవట్లేదని, అమరావతిని రాజధానిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నామని ప్రకటించిన జగన్.. అధికారంలోకి వచ్చాక మాత్రం అమరావతి పేరెత్తితే మంటెత్తిపోయేట్లుగా వ్యవహరిస్తున్నారు.

మూడు రాజధానుల ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చి.. పట్టుబట్టి దాని మీద తీర్మానం చేసి గవర్నర్‌తోనూ ఆమోద ముద్ర వేసుకున్నారు. అమరావతి నుంచి రాజధానిని తరలించకుండా ఆపడం కష్టమే అన్న అభిప్రాయాన్ని తీసుకొచ్చారు. కానీ ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా.. కోర్టు మాత్రం కచ్చితంగా ఈ నిర్ణయానికి బ్రేక్ వేస్తుందనే రాజకీయ విశ్లేషకులు, న్యాయ నిపుణులు చెబుతూ వచ్చారు.

ప్రస్తుత పరిణామాలు చూస్తే అదే జరుగుతుందేమో అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ నిర్ణయంపై స్టే విధించిన హైకోర్టు.. విచారణ సందర్భంగా రైతులతో గత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాల సంగతేంటని జగన్ సర్కారును కచ్చితంగా అడుగుతుందని.. ఇక్కడ ప్రభుత్వం ఇరుకునపడుతుందని అంచనా వేస్తున్నారు.

ఐతే ఈ విషయంలో జగన్ కొంచెం ముందుగా మేల్కొని ప్లాన్-బిని అమలు చేయడానికి రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అమరావతిని మెట్రోపాలిటిన్ సిటీగా అభివృద్ధి చేయనున్నట్లు ఇంతకుముందు ప్రకటించిన జగన్.. ఈ విషయమై అధికారులతో తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించారు.

అమరావతిలో ఇప్పటికే నిర్మాణంలో ఉన్న భవనాలు, ఇతర నిర్మాణాల్ని పూర్తి చేయడానికి ఎంత ఖర్చవుతుంది, వాటిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి.. రైతుల ఫ్లాట్లను ఎలా అభివృద్ధి చేయాలనే విషయంలో అధికారులతో జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

ఇలా చేయడం ద్వారా తాము రైతుల ఒప్పందాల్ని గౌరవిస్తున్నాం, వారికి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం అని జగన్ సంకేతాలిస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా కోర్టులో బ్రేక్ పడకుండా చూసుకోవాలని.. ఇక్కడ అడ్డంకి తొలగిపోతే అమరావతి అభివృద్ధి విషయంలో పరిస్థితుల్ని బట్టి ముందుకెళ్లవచ్చని జగన్ భావిస్తున్నట్లు అర్థమవుతోంది.

This post was last modified on August 14, 2020 4:34 pm

Share

Recent Posts

దేవర కలెక్షన్లపై డిస్ట్రిబ్యూటర్ క్లారిటీ

ఒక సినిమా రిలీజైన రెండు మూడేళ్ల తర్వాత కూడా దాని కలెక్షన్ల గురించి విపరీతమైన చర్చ జరగడం అరుదు. ‘దేవర’ విషయంలో ఇదే…

3 hours ago

ఏజెంట్‌లో నన్ను చూసి అసహ్యమేసింది – అఖిల్

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి రూపొందించిన ‘ఏజెంట్’ టాలీవుడ్ చరిత్రలోనే అతి పెద్ద…

5 hours ago

కొత్త విద్యా మంత్రిగా జోషి… ఎవరీయన?

కేంద్ర విద్యా శాఖకు నూతన మంత్రిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కేబినెట్ లో కీలక శాఖల మంత్రిగా కొనసాగుతున్న ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు.…

6 hours ago

విజయ్ బలహీనతే కిరణ్ బలం

బాక్సాఫీస్ దగ్గర పోటీ ఉన్నప్పుడు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతాయి. ఇది అలాంటిదే. కేవలం ఒక్క రోజు గ్యాప్ తో…

7 hours ago

‘స్పైడర్ మ్యాన్’ రచ్చ చేసేలా ఉన్నాడు

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న స్పైడర్ మ్యాన్ సిరీస్ లోని కొత్త సినిమా బ్రాండ్ న్యూ డే జూలై…

8 hours ago

జగన్ లాజిక్… ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ కి లోకేష్ కు ముడి!

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ కొత్త లాజిక్ మాట్లాడుతున్నారు. నైతిక బాధ్యత వహిస్తూ…

8 hours ago