ఏపీ సీఎం జగన్ కేంద్రంగా టీడీపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, వైసీపీ సీనియర్ నాయకుడు, మంత్రి బొత్స సత్యనారాయణలు మాటల తూటాలు పేల్చారు. జగన్పై అశోక్ గజపతి రాజు చేసిన ఘాటు విమర్శలకు అంతే ఘాటుగా బొత్స సత్యనారాయణ కూడా.. సమాధానం ఇచ్చారు. దీంతో విజయనగరం పాలిటిక్స్లో హాట్ ఎట్మాస్ఫియర్ ఏర్పడింది.
అశోక్ ఏమన్నారంటే..
”చంచల్ గూడ జైలు నుంచి ఉత్తర కోస్తా జిల్లాలకు జగన్ రెడ్డి ట్రాన్సఫర్ పెట్టుకున్నారు. జైల్లో చిప్ప కూడున్న తిన్న దొంగను మనం ఆంధ్రాకు ముఖ్యమంత్రిని చేసేశాం. అభివృద్ధి చేసేశాం అని చెబుతున్న వైసీపీ నేతల చేష్టలు ఏంటో మనకు తెలియవా.!” అని అశోక్గజపతిరాజు విమర్శించారు. ఆర్థిక నేరాలకు పాల్పడి, 16 నెలలు జైల్లో ఉన్న దొంగను ముఖ్యమంత్రి చేసిన రాష్ట్ర ప్రజలంతా నేడు నరకాన్ని చూస్తున్నారని అశోక్గజపతిరాజు వ్యాఖ్యానించారు. అంతేకాదు.. ఒక్క చాన్స్ అంటూ తండ్రి ఫొటోను అడ్డం పెట్టుకుని వచ్చిన ఆయన నేడు అన్నివర్గాల ప్రజలకు నరకం చూపిస్తున్నారని దుయ్యబట్టారు. బెయిల్పై చంచల్గుడా జైలు నుంచి వచ్చిన ఆయన తిరిగి విశాఖ జైలుకు వెళ్లేందుకు సమయం ఆసన్నమైందన్నారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్రెడ్డి ప్రధాని మోడీ కాళ్లముందు మెడలు వంచడం ద్వారా తెలుగుజాతి గౌరవాన్ని మంటకలుపుతున్నారని విమర్శించారు.
బొత్స కూడా తగ్గలేదు!
సీఎం జగన్ కేంద్రంగా అశోక్ గజపతి రాజుచేసిన ఘాటు వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. సమాజానికే జగన్ అంకితమయ్యారని చెప్పారు. సమాజం ఆలోచననే జగన్ అమలు చేస్తున్నారని చెప్పారు. సీనియర్ నాయకుడు గజపతి రాజు మాట్లాడేటప్పుడు వెనుకా ముందూ ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు. తమకు వ్యక్తిగత ద్వేషాలు ఉండవని, సీఎం జగన్ కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్న గజపతి రాజు..గల్లీ నేతగా వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
This post was last modified on July 9, 2023 10:14 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…