నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. స్వపక్షంలోనే విపక్షంలా మారిన ఆర్ఆర్ఆర్…తనకు ప్రాణహాని ఉందంటూ ఏకంగా కేంద్ర బలగాల భద్రత కోరి సంచలనం రేపారు.
ఓ వైపు సొంత పార్టీపైనే విమర్శలు గుప్పిస్తూ…మరో వైపు సీఎం జగన్ మరో 30 ఏళ్లు సీఎం అంటూ పొగుడుతున్నారు. తాను రాజీనామా చేయబోనని, తాను సీఎం జగన్ బొమ్మతోపాటు తన ఇమేజ్ తోనే గెలిచానని గతంలోనే పలు మార్లు చెప్పారు రఘురామకృష్ణరాజు.
ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆర్ఆర్ఆర్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ రెడ్డీస్ అంటూ తనను బెదిరిస్తూ కాల్ చేస్తున్న వారికి ఆర్ఆర్ఆర్ వీరావేశంతో వార్నింగ్ ఇచ్చారు. తనకు ఫోన్ చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, అటువంటి వారు తన ఇంటి దగ్గరకు వస్తే పారామిలటరీ వారు కాల్చిపడేస్తారని మండిపడ్డారు.
తాను జగన్ బొమ్మతోపాటు తన బొమ్మతోనే అధికారంలోకి వచ్చానని రఘురామకృష్ణరాజు అన్నారు. ఏయ్ రెడ్డీస్ మీరు అబద్ధాలాడి అధికారంలోకి వచ్చారు…అమరావతి ఇక్కడే ఉంటుందని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఊరికే ఫోన్ నంబర్ ఉంది కదా అని ఫోన్ చేసి బెదిరిస్తే ఊరుకోబోనని, తాను ప్రజల మద్దతుతో నెగ్గానని రఘురామకృష్ణరాజు అన్నారు.
తనను బెదిరించిన వారి ఫోన్ నెంబర్లన్నీ తన వద్ద ఉన్నాయని, కానీ, వారి పేరు చివర రెండక్షరాల సామాజిక వర్గం వాళ్లు ఉంటే న్యాయం జరగదన్న ఉద్దేశంతో కంప్లయింట్ చేయకుండా ఆగిపోతున్నానని అన్నారు. ఇంటర్నెట్ లో ఫోన్ నెంబర్ ఉంది కదా అని ఊరికే ఫోన్ చేస్తున్నారు…నేనెందుకు రాజీనామా చేయాల్రా యూజ్ లెస్ ఫెలోస్ అటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జుట్టు గురించి కామెంట్ చేసిన వారిపై ఆర్ఆర్ఆర్ మండిపడ్డారు.
రాజధాని అమరావతి నుంచి తరలిపోవడం జరగని పని అని, రైతులకు నూటికి నూరుపాళ్లు న్యాయం జరిగి తీరుతుందని రఘురామకృష్ణరాజు అన్నారు. జగదేకవీరుని కథ సినిమాలో ఐదుగురు ఎన్టీ రామారావులు వచ్చి పాట పాడినప్పుడు కఠిన శిల కూడా కరుగుతుందని, అలాగే రాజధాని రైతుల ఆక్రందనలు జగన్ ను కరిగిస్తాయని ఆర్ఆర్ఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ జగన్ మనసు కరగకపోయినా ఈలోపే న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుందని అన్నారు.
This post was last modified on August 14, 2020 4:47 pm
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్లో వెబ్ సిరీస్లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బీజేపీ అగ్రనేత. ఇక, ఆయన సొంత రాష్ట్రం గుజరాత్. తాజాగా మోడీ చిన్ననాటి స్నేహితుడు,…
విడుదలకు ఇంకా రెండు నెలలు లేని నేపథ్యంలో రామాయణ బృందం సంగీత ప్రచారానికి తెరతీసింది. యూట్యూబ్ కన్నా ముందు స్పాటిఫై…