వైసీపీలో కుమ్ములాటలు.. ఆత్మ స్థయిర్యం కోల్పోతున్న వైనం స్పష్టంగా తెరమీదికి వచ్చింది. ఎక్కడికక్కడ నాయకులు తమకు టికెట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు.. ఎవరికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంపై ప్రభావం చూపించిందని అంటున్నారు పరిశీలకులు. శనివారం(జూలై 8) వైఎస్ జయంతి. కానీ, ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానాలు కూడా చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ కీర్తిని కూడా ప్రచారం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది ఎక్కడా అలాంటి సంబరాలు ఏవీ కనిపించ డం లేదు. ముఖ్యమంత్రి జగన్.. యథావిథిగా.. తన తండ్రి ఘాట్కు వెళ్లిపోయారు. పులివెందులలో పర్యటిస్తున్నారు.
మరి క్షేత్రస్థాయిలో వైఎస్ జయంతిని ఎవరు నిర్వహించాలి? అనే ప్రశ్నకు మాత్రం నాయకుల నుంచి ఎలాంటి ఆన్సర్ కనిపించడం లేదు. దీనికి కారణం.. మీరు చేస్తారంటే.. మీరు చేస్తారులే.. అని నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదు.. వైఎస్ జయంతిని నిర్వహించడమూ లేదు. మరోవైపు.. ఇంకొందరు నాయకులు తెలివి ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉచితంగా వచ్చే సోషల్ మీడియాలో వైఎస్ ఎంబ్లమ్లు రూపొందించి.. వాటిపై తమ ఫొటోలు వేసుకుని.. నివాళులర్పిస్తున్నట్టు.. జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే.. వీరు వైఎస్ ను ఒక రకంగా.. సోషల్ మీడియాకే పరిమితం చేసినట్టు అయింది. ఇక, సీమలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తమ సొంత కార్యాలయాల్లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీలో వైఎస్ జోష్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 8, 2023 1:41 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…