వైసీపీలో కుమ్ములాటలు.. ఆత్మ స్థయిర్యం కోల్పోతున్న వైనం స్పష్టంగా తెరమీదికి వచ్చింది. ఎక్కడికక్కడ నాయకులు తమకు టికెట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు.. ఎవరికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంపై ప్రభావం చూపించిందని అంటున్నారు పరిశీలకులు. శనివారం(జూలై 8) వైఎస్ జయంతి. కానీ, ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానాలు కూడా చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ కీర్తిని కూడా ప్రచారం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది ఎక్కడా అలాంటి సంబరాలు ఏవీ కనిపించ డం లేదు. ముఖ్యమంత్రి జగన్.. యథావిథిగా.. తన తండ్రి ఘాట్కు వెళ్లిపోయారు. పులివెందులలో పర్యటిస్తున్నారు.
మరి క్షేత్రస్థాయిలో వైఎస్ జయంతిని ఎవరు నిర్వహించాలి? అనే ప్రశ్నకు మాత్రం నాయకుల నుంచి ఎలాంటి ఆన్సర్ కనిపించడం లేదు. దీనికి కారణం.. మీరు చేస్తారంటే.. మీరు చేస్తారులే.. అని నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదు.. వైఎస్ జయంతిని నిర్వహించడమూ లేదు. మరోవైపు.. ఇంకొందరు నాయకులు తెలివి ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉచితంగా వచ్చే సోషల్ మీడియాలో వైఎస్ ఎంబ్లమ్లు రూపొందించి.. వాటిపై తమ ఫొటోలు వేసుకుని.. నివాళులర్పిస్తున్నట్టు.. జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే.. వీరు వైఎస్ ను ఒక రకంగా.. సోషల్ మీడియాకే పరిమితం చేసినట్టు అయింది. ఇక, సీమలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తమ సొంత కార్యాలయాల్లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీలో వైఎస్ జోష్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 8, 2023 1:41 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…