వైసీపీలో కుమ్ములాటలు.. ఆత్మ స్థయిర్యం కోల్పోతున్న వైనం స్పష్టంగా తెరమీదికి వచ్చింది. ఎక్కడికక్కడ నాయకులు తమకు టికెట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు.. ఎవరికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంపై ప్రభావం చూపించిందని అంటున్నారు పరిశీలకులు. శనివారం(జూలై 8) వైఎస్ జయంతి. కానీ, ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానాలు కూడా చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ కీర్తిని కూడా ప్రచారం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది ఎక్కడా అలాంటి సంబరాలు ఏవీ కనిపించ డం లేదు. ముఖ్యమంత్రి జగన్.. యథావిథిగా.. తన తండ్రి ఘాట్కు వెళ్లిపోయారు. పులివెందులలో పర్యటిస్తున్నారు.
మరి క్షేత్రస్థాయిలో వైఎస్ జయంతిని ఎవరు నిర్వహించాలి? అనే ప్రశ్నకు మాత్రం నాయకుల నుంచి ఎలాంటి ఆన్సర్ కనిపించడం లేదు. దీనికి కారణం.. మీరు చేస్తారంటే.. మీరు చేస్తారులే.. అని నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదు.. వైఎస్ జయంతిని నిర్వహించడమూ లేదు. మరోవైపు.. ఇంకొందరు నాయకులు తెలివి ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉచితంగా వచ్చే సోషల్ మీడియాలో వైఎస్ ఎంబ్లమ్లు రూపొందించి.. వాటిపై తమ ఫొటోలు వేసుకుని.. నివాళులర్పిస్తున్నట్టు.. జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే.. వీరు వైఎస్ ను ఒక రకంగా.. సోషల్ మీడియాకే పరిమితం చేసినట్టు అయింది. ఇక, సీమలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తమ సొంత కార్యాలయాల్లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీలో వైఎస్ జోష్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 8, 2023 1:41 pm
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…
నిన్నటివరకు టీవీకే అధ్యక్షుడు, దళపతి విజయ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారని కేవలం తమిళనాట ప్రజలు మాత్రమే కాదు, దక్షిణ భారత…