తొందరలోనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ విస్తృతంగా సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తోంది. ఐప్యాక్ బృందం తయారుచేసిన సర్వే రిపోర్టుపై జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంఎల్ఏల మీద ఉన్న ప్లస్సులు, మైనస్సులతో పాటు జనాల్లో ఉన్న అభిప్రాయాలు, వ్యతిరేకత తదితర అంశాలపైన కూడా ఐప్యాక్ బృందం క్లారిటితో రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. అందుకనే జగన్ కూడా అంత సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తున్నది.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే చాలామంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఐప్యాక్ చేస్తున్న సర్వేల మీద పూర్తిగా నమ్మకంలేకేనా అన్నదే అర్ధంకావటంలేదు. ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ఐప్యాక్ చేస్తున్న సర్వేల్లో ప్రభుత్వం అంతా బ్రహ్మాండమని, ఎంఎల్ఏల్లో కొందరిపైన వ్యతిరేకత ఉందని ఫీడబ్యాక్ వస్తోంది.
ఇదే సమయంలో ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ప్రభుత్వం ఇన్ని సంక్షేమపథకాలు అమలుచేస్తున్నా ఇంకా వ్యతిరేకత ఎందుకుందో ఎంఎల్ఏలకు అర్ధంకావటంలేదని సమాచారం. వివిధ రకాల పన్నులు పెంచడం, విద్యుత్ చార్జీలు పెరుగుతుండటం, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుందటం లాంటివి జనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అర్ధమవుతోందట. వచ్చేఎన్నికల్లో పోటీ ఆయా పార్టీల అభ్యర్ధుల మధ్య కాకుండా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు మధ్యే అన్నట్లుగా ఉందట.
అందుకనే వైసీపీ ఎంఎల్ఏలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల విషయమై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. అదే టీడీపీ గనుక జనసేనతో పొత్తులో వెళితే రిజల్టు ఇంకోలాగ ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళితే ఫలితం మరోలాగ ఉంటుందని ఎంఎల్ఏలకు కూడా జనాల ఫీడ్ బ్యాక్ అందుతోందట. అందుకనే టీడీపీ పెట్టుకోబోయే పొత్తులపైన వైసీపీలో కూడా బాగా ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తంమీద పొత్తుల సంగతిని పక్కనపెట్టేస్తే ఐప్యాక్ కు సమాంతరంగా ఎంఎల్ఏలు కూడా ఫీడ్ బ్యాక్ కోసం సర్వేలు చేయించుకున్నారన్న విషయం తేలిపోయింది.
This post was last modified on July 8, 2023 1:32 pm
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…