Political News

ఐప్యాక్ మీద నమ్మకంలేదా ?

తొందరలోనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ విస్తృతంగా సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తోంది. ఐప్యాక్ బృందం తయారుచేసిన సర్వే రిపోర్టుపై జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంఎల్ఏల మీద ఉన్న ప్లస్సులు, మైనస్సులతో పాటు జనాల్లో ఉన్న అభిప్రాయాలు, వ్యతిరేకత తదితర అంశాలపైన కూడా ఐప్యాక్ బృందం క్లారిటితో రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. అందుకనే జగన్ కూడా అంత సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తున్నది.

సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే చాలామంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఐప్యాక్ చేస్తున్న సర్వేల మీద పూర్తిగా నమ్మకంలేకేనా అన్నదే అర్ధంకావటంలేదు. ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ఐప్యాక్ చేస్తున్న సర్వేల్లో ప్రభుత్వం అంతా బ్రహ్మాండమని, ఎంఎల్ఏల్లో కొందరిపైన వ్యతిరేకత ఉందని ఫీడబ్యాక్ వస్తోంది.

ఇదే సమయంలో ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ప్రభుత్వం ఇన్ని సంక్షేమపథకాలు అమలుచేస్తున్నా ఇంకా వ్యతిరేకత ఎందుకుందో ఎంఎల్ఏలకు అర్ధంకావటంలేదని సమాచారం. వివిధ రకాల పన్నులు పెంచడం, విద్యుత్ చార్జీలు పెరుగుతుండటం, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుందటం లాంటివి జనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అర్ధమవుతోందట. వచ్చేఎన్నికల్లో పోటీ ఆయా పార్టీల అభ్యర్ధుల మధ్య కాకుండా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు మధ్యే అన్నట్లుగా ఉందట.

అందుకనే వైసీపీ ఎంఎల్ఏలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల విషయమై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. అదే టీడీపీ గనుక జనసేనతో పొత్తులో వెళితే రిజల్టు ఇంకోలాగ ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళితే ఫలితం మరోలాగ ఉంటుందని ఎంఎల్ఏలకు కూడా జనాల ఫీడ్ బ్యాక్ అందుతోందట. అందుకనే టీడీపీ పెట్టుకోబోయే పొత్తులపైన వైసీపీలో కూడా బాగా ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తంమీద పొత్తుల సంగతిని పక్కనపెట్టేస్తే ఐప్యాక్ కు సమాంతరంగా ఎంఎల్ఏలు కూడా ఫీడ్ బ్యాక్ కోసం సర్వేలు చేయించుకున్నారన్న విషయం తేలిపోయింది.

This post was last modified on July 8, 2023 1:32 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

4 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

5 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago