Political News

ఐప్యాక్ బృందంతో జ‌గ‌న్ భేటీ.. ముంద‌స్తుపైనేనా?!

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ అనూహ్యంగా ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. సాధార‌ణంగా ఆయ‌న నెల‌కు ఒక్క‌సారి మాత్ర‌మే ఇలాంటి భేటీ నిర్వ‌హిస్తున్నారు. ఈ నెల‌లో 1వ తారీకు ఒక‌సారి ఐప్యాక్ బృందంతో భేటీ అయ్యారు. అయితే.. ఢిల్లీ ప‌ర్య‌ట‌న ముగించుకుని వ‌చ్చిన త‌ర్వాత‌..కేవ‌లం రెండురోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రోసారి ఆయ‌న ఐప్యాక్ బృందంతో భేటీ కావ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌కు దారితీసింది. మ‌ధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు సుదీర్ఘంగా 5 గంట‌ల పాటు ఆయ‌న చ‌ర్చించారు.

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఐప్యాక్‌ భేటీలో వైసీపీ ముఖ్యనేతలు, ఐప్యాక్‌ టీమ్‌ ఇన్‌ఛార్జి రిషిరాజ్‌, సహ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, తాజా పరిణామాలపై చర్చించారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీ తాజా పరిస్థితిపై సీఎం విశ్లేషించారు. గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష కార్యక్రమం జరుగుతున్న తీరుపై సీఎం సమీక్షించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రుల భాగస్వామ్యం, పనితీరుపై చర్చించారు.

ఎమ్మెల్యేల పనితీరుపై ఐప్యాక్ టీం ఇచ్చిన నివేదికలపై సీఎం చర్చించినట్లు తెలిసింది. నియోజకవర్గాల్లో గ్రాఫ్ తగ్గిన ఎమ్మెల్యే లపై నా సీఎం చర్చించారు. పలు నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేధాలు నెలకొన్న పరిస్ధితుల్లో నియోజకవర్గ ఇన్‌ఛార్జిల మార్పు, నియామకాలపై సమాలోచనలు జరిపినట్టు తెలిసింది. అదేస‌మ‌యంలో ముంద‌స్తుకు వెళ్లే అవ‌కాశంపై వారితో చ‌ర్చించార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. ఇటీవ‌ల కాలంలో ముంద‌స్తు ఎన్నిక‌ల వ్య‌వ‌హారం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారిన నేప‌థ్యంలో ఐప్యాక్ స‌భ్యుల‌తో భేటీప్రాధాన్యం సంత‌రించుకుంది.

This post was last modified on July 7, 2023 9:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

3 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

8 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

9 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

9 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago