Political News

ష‌ర్మిల షాకింగ్ డెసిష‌న్‌.. త‌న పేరిట భూములను ఏం చేశారంటే..

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు.. వెంట‌నే అమ‌లు కూడా చేసేశారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. రాజ‌కీయంగా కూడా ఈ చ‌ర్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ‌నివారం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ నుంచి క‌డ‌ప‌కు వ‌చ్చిన ష‌ర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజ‌లి కూడా ఉన్నారు. అయితే.. క‌డ‌ప విమానాశ్ర‌యానికి వ‌చ్చీరావ‌డంతోనే ష‌ర్మిల త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో ష‌ర్మిల‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య ప‌రిణామం వెనుక ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ సాగుతోం ది.

ష‌ర్మిల పేరుతో ఉన్న రికార్డుల‌ను వెంట‌నే మార్చేందుకు కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసిన‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌స్య లు వ‌స్తాయ‌నైనా భావించి ఉండాల‌ని.. లేక‌.. రాజ‌కీయంగా దీనిని వినియోగించుకునే చ‌ర్య‌ల్లో భాగ‌మైనా అయి ఉండాల‌ని పొలిటిక‌ల్ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. లేక‌పోతే.. అన్న జ‌గ‌న్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలో ఇలా హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా ష‌ర్మిల ఎందుకు ఇంత హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నార‌నేది మాత్రం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 7, 2023 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago