వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. అయితే.. కడప విమానాశ్రయానికి వచ్చీరావడంతోనే షర్మిల తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.
ఎవరూ ఊహించని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోం ది.
షర్మిల పేరుతో ఉన్న రికార్డులను వెంటనే మార్చేందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు అఫిడవిట్ సమస్య లు వస్తాయనైనా భావించి ఉండాలని.. లేక.. రాజకీయంగా దీనిని వినియోగించుకునే చర్యల్లో భాగమైనా అయి ఉండాలని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే.. అన్న జగన్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా షర్మిల ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది.
This post was last modified on July 7, 2023 9:53 pm
తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ?…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు వైసీపీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప.. సభకు…
ఇండియన్ సినిమా స్థాయి ఎంత పెరిగినా సరే.. ఇప్పటికీ వెయ్యి కోట్ల బడ్జెట్ అంటేనే చాలా ఎక్కువ. అలాంటిది రామాయణం…
జార్ఖండ్లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా…
ఇంకో ముప్పై నాలుగు రోజుల్లో మలయాళం దృశ్యం 3 విడుదల కానుంది. ఈ భాగంతో కథకు ముగింపు ఇవ్వబోతున్నారు. కొడుకు…
మంత్రి నారా లోకేష్ తన సహృదయత చాటుకున్నారు. ఎస్ఎంఏ టైప్–1 అనే అరుదైన జన్యు వ్యాధితో పోరాడుతున్న కర్నూలుకు చెందిన…