Political News

ష‌ర్మిల షాకింగ్ డెసిష‌న్‌.. త‌న పేరిట భూములను ఏం చేశారంటే..

వైసీపీ అధినేత సీఎం జ‌గ‌న్ సోద‌రి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల షాకింగ్ నిర్ణ‌యం తీసుకున్నారు. అంతేకాదు.. వెంట‌నే అమ‌లు కూడా చేసేశారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. అంతేకాదు.. రాజ‌కీయంగా కూడా ఈ చ‌ర్య చ‌ర్చ‌నీయాంశంగా మారింది. శ‌నివారం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్ నుంచి క‌డ‌ప‌కు వ‌చ్చిన ష‌ర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజ‌లి కూడా ఉన్నారు. అయితే.. క‌డ‌ప విమానాశ్ర‌యానికి వ‌చ్చీరావ‌డంతోనే ష‌ర్మిల త‌న ఇద్ద‌రు బిడ్డ‌ల‌ను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లారు.

ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో ష‌ర్మిల‌ రిజిస్ట్రేషన్‌ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్‌ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్‌ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య ప‌రిణామం వెనుక ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ సాగుతోం ది.

ష‌ర్మిల పేరుతో ఉన్న రికార్డుల‌ను వెంట‌నే మార్చేందుకు కార‌ణం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేసిన‌ప్పుడు అఫిడ‌విట్ స‌మ‌స్య లు వ‌స్తాయ‌నైనా భావించి ఉండాల‌ని.. లేక‌.. రాజ‌కీయంగా దీనిని వినియోగించుకునే చ‌ర్య‌ల్లో భాగ‌మైనా అయి ఉండాల‌ని పొలిటిక‌ల్ ప‌రిశీల‌కులు చెబుతున్నారు. లేక‌పోతే.. అన్న జ‌గ‌న్‌తో ఉన్న విభేదాల నేప‌థ్యంలో ఇలా హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నారా? అనే చ‌ర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా ష‌ర్మిల ఎందుకు ఇంత హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నార‌నేది మాత్రం ఆస‌క్తిగా మారింది.

This post was last modified on July 7, 2023 9:53 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago