వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. అయితే.. కడప విమానాశ్రయానికి వచ్చీరావడంతోనే షర్మిల తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.
ఎవరూ ఊహించని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోం ది.
షర్మిల పేరుతో ఉన్న రికార్డులను వెంటనే మార్చేందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు అఫిడవిట్ సమస్య లు వస్తాయనైనా భావించి ఉండాలని.. లేక.. రాజకీయంగా దీనిని వినియోగించుకునే చర్యల్లో భాగమైనా అయి ఉండాలని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే.. అన్న జగన్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా షర్మిల ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది.
This post was last modified on July 7, 2023 9:53 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…