వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. అయితే.. కడప విమానాశ్రయానికి వచ్చీరావడంతోనే షర్మిల తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.
ఎవరూ ఊహించని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోం ది.
షర్మిల పేరుతో ఉన్న రికార్డులను వెంటనే మార్చేందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు అఫిడవిట్ సమస్య లు వస్తాయనైనా భావించి ఉండాలని.. లేక.. రాజకీయంగా దీనిని వినియోగించుకునే చర్యల్లో భాగమైనా అయి ఉండాలని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే.. అన్న జగన్తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా షర్మిల ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది.
తెలుగులో చాలా కొద్ది మంది హీరోయిన్లకు మాత్రమే సాధ్యమైన స్టార్ ఇమేజ్ సంపాదించింది సమంత. విజయశాంతి, అనుష్కల తర్వాత హీరోలతో…
కేవలం పది కోట్ల బడ్జెట్లో తెరకెక్కిన సినిమా.. అబ్సెషన్. ఈ హాలీవుడ్ హార్రర్ మూవీ విడుదలైనప్పటి నుంచి వరల్డ్ వైడ్…
స్టార్ హీరో సినిమాల రిపీట్ వేల్యూకి ప్రధానంగా దోహదం చేసేది పాటలే. ఫైట్లు, ఎలివేషన్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్కువ లేని…
సంక్రాంతికి రిలీజైన మన శంకరవరప్రసాద్ గారులో ప్రాణ స్నేహితులుగా నటించిన చిరంజీవి, వెంకటేష్ మొదటిసారి స్క్రీన్ పంచుకుని ఎంత పెద్ద…
హెడింగ్ చూడగానే ఏవో ముళ్లచెట్ల వల్ల ఎవరికో ఏదో అయిపోయి షూటింగ్ బ్రేక్ పడిందని అనుకోకండి. ఇక్కడ అడ్డంకులనే కోణంలో…
రాష్ట్రంలో అటవీ సంపదను కాపాడడంతోపాటు.. వన్యప్రాణుల సంరక్షణకు సైతం ప్రాధాన్యం ఇస్తున్న ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్…