జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు విమర్శలు చేశారు. వారాహి యాత్రపై ఆయన మాట్లాడుతూ.. తొలి విడత ప్యాకేజీ డబ్బులు అయిపోవడంతో పవన్ యాత్రను అర్ధంతరంగా ముగించేశాడని వ్యాఖ్యానించారు. వాస్తవానికి రెండు జిల్లాల్లోనూ పూర్తవుతుందని.. పేర్కొంటూ ముందు జనసేన షెడ్యూల్ ఇచ్చిందని.. కానీ, దీనిని మధ్యలోనే ఆపేసి హైదరాబాద్ వెళ్లిపోయాడని చెప్పారు.
దీనికి కారణం.. ప్యాకేజీ సొమ్ము పూర్తిగా అందకపోయినా అయి ఉండాలని.. లేకపోతే, అయిపోయి అయినా అయి ఉండాలని వెల్లంపల్లి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రస్తుతం ప్యాకేజీపై హైదరాబాద్లో చర్చలు జరుగుతున్నట్టు తమకు సమాచారం ఉందన్నారు. ఇది ఖరారయ్యాకే రెండో విడత వారాహి యాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. అందుకే డేట్ ప్రకటించి కూడా.. షెడ్యూల్ ఇవ్వలేక పోతున్నారని.. అలాంటి ప్యాకేజీ స్టార్ గురించి.. ఇంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదని అన్నారు.
తాజాగా ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అయితే.. ఇతర నేతల మాట ఎలా ఉన్నా అధికార పార్టీ నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల కాలంలో తిరుమలలో రాజకీయ విమర్శలు చేయడం.. సవాళ్లు రువ్వడం(తాజాగా రోజా కూడా ఇక్కడే మాట్లాడుతూ.. పవన్కు సవాల్ రువ్వారు) వంటివాటిని భక్తులు విమర్శిస్తున్నారు. పవిత్ర తిరుమలను రాజకీయ వేదికగా మార్చడం సరికాదని వ్యాఖ్యానిస్తున్నారు.
This post was last modified on July 7, 2023 6:31 pm
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…
సందీప్ రెడ్డి వంగనే కాదు.. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాదని.. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్…
AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…