Political News

చాప‌కింద నీరులా.. కేశినేని వ్య‌వ‌హారం..

ఎన్నిక‌ల‌కు స‌మయం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితేనే 9 నెల‌లు ఉన్నాయి. కానీ, ముంద స్తు ముచ్చ‌ట‌కు ఇష్ట‌ప‌డుతున్నట్టు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ స‌మ‌యం మ‌రింత త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. త‌మ్ముళ్ల‌ను సెట్ చేస్తు న్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఆయ‌న‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు మైల‌వ‌రం, తిరువూరు, నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని అనుకూల ప్ర‌తికూల వ‌ర్గాల మ‌ధ్య పోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నాలుగు నియోజ‌క వ‌ర్గా ల‌పై ఎంపీ వ్యూహ‌మే ప‌నిచేస్తోంద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టే జ‌రుగుతోంద‌ని, పార్టీ ఏదైనా కూడా.. ఎంపీ హ‌వా ఉంద‌ని టీడీపీ అధినేత‌కు నివేదిక‌లు అందాయి. దీంతో ఇక్క‌డ స‌మీక్ష చేయాలా? వ‌ద్దా? అనేది సందే హంగా మారింది.

పై నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క విజ‌య‌వాడ తూర్పులో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు గెలుపు గుర్రం ఎక్కారు. మిగిలిన తిరువూరు, నందిగామ‌, మైల‌వ‌రం నియోజక‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్నాయి. ఏదో గ‌త ఎన్ని క‌ల్లో జ‌గ‌న్ హవాతో ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుందనే టాక్ వినిపించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఇక్క‌డి నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. ఎంపీ కేశినేని నాని ఈ మూడు చోట్ల కూడా.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు ద‌న్నుగా ఉన్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీలోనూ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తిరువూరు మాట ఎలా ఉన్నా.. నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నాని కార‌ణంగా.. టీడీపీలో వ‌ర్గ పోరు పెరిగింద‌నే స‌మాచారం చంద్ర‌బాబుకు చేరింది. గొడ‌వ‌లు అయితే ముదిరి పాకాన ప‌డ్డాయి. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని.. ఇక్క‌డి ప‌రిస్థితిని చ‌క్క దిద్దుతారో చూడాలి.

This post was last modified on July 7, 2023 6:33 pm

Share

Recent Posts

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

2 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

2 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

3 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

4 hours ago

గవర్నర్ గా యనమల రామకృష్ణుడు?

కేంద్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జంతర్ మంతర్ దెబ్బకు కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయడం తెలిసిందే.…

6 hours ago