Political News

చాప‌కింద నీరులా.. కేశినేని వ్య‌వ‌హారం..

ఎన్నిక‌ల‌కు స‌మయం చాలా ద‌గ్గ‌ర‌గా ఉంది. షెడ్యూల్ ప్ర‌కారం జ‌రిగితేనే 9 నెల‌లు ఉన్నాయి. కానీ, ముంద స్తు ముచ్చ‌ట‌కు ఇష్ట‌ప‌డుతున్నట్టు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో ఈ స‌మ‌యం మ‌రింత త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు అలెర్ట్ అయ్యారు. త‌మ్ముళ్ల‌ను సెట్ చేస్తు న్నారు. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి ఆయ‌న‌కు కొరుకుడు ప‌డ‌డం లేదు.

ఉదాహ‌ర‌ణ‌కు మైల‌వ‌రం, తిరువూరు, నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గాల్లో సొంత పార్టీ ఎంపీ కేశినేని నాని అనుకూల ప్ర‌తికూల వ‌ర్గాల మ‌ధ్య పోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. ఈ నాలుగు నియోజ‌క వ‌ర్గా ల‌పై ఎంపీ వ్యూహ‌మే ప‌నిచేస్తోంద‌ని.. ఆయ‌న చెప్పిన‌ట్టే జ‌రుగుతోంద‌ని, పార్టీ ఏదైనా కూడా.. ఎంపీ హ‌వా ఉంద‌ని టీడీపీ అధినేత‌కు నివేదిక‌లు అందాయి. దీంతో ఇక్క‌డ స‌మీక్ష చేయాలా? వ‌ద్దా? అనేది సందే హంగా మారింది.

పై నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక్క విజ‌య‌వాడ తూర్పులో మాత్ర‌మే టీడీపీ అభ్య‌ర్థి గ‌ద్దె రామ్మోహ‌న్‌రావు గెలుపు గుర్రం ఎక్కారు. మిగిలిన తిరువూరు, నందిగామ‌, మైల‌వ‌రం నియోజక‌వ‌ర్గాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కింది. అయితే.. ఈమూడు నియోజ‌క‌వ‌ర్గాలు కూడా.. టీడీపీకి కంచుకోట‌లుగా ఉన్నాయి. ఏదో గ‌త ఎన్ని క‌ల్లో జ‌గ‌న్ హవాతో ఇక్క‌డ వైసీపీ విజ‌యం ద‌క్కించుకుందనే టాక్ వినిపించింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఖ‌చ్చితంగా ఈ మూడు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గెలిచి తీరుతుంద‌ని ఇక్క‌డి నాయ‌కులు ఆశ‌లు పెట్టుకున్నారు.

అయితే.. ఎంపీ కేశినేని నాని ఈ మూడు చోట్ల కూడా.. వైసీపీ ఎమ్మెల్యేల‌కు ద‌న్నుగా ఉన్నారు. దీంతో ఇక్క‌డ టీడీపీలోనూ రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. తిరువూరు మాట ఎలా ఉన్నా.. నందిగామ‌, విజ‌య‌వాడ తూర్పు, మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గాల్లో నాని కార‌ణంగా.. టీడీపీలో వ‌ర్గ పోరు పెరిగింద‌నే స‌మాచారం చంద్ర‌బాబుకు చేరింది. గొడ‌వ‌లు అయితే ముదిరి పాకాన ప‌డ్డాయి. మ‌రి ఎలాంటి నిర్ణ‌యం తీసుకుని.. ఇక్క‌డి ప‌రిస్థితిని చ‌క్క దిద్దుతారో చూడాలి.

This post was last modified on July 7, 2023 6:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

2 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

2 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

4 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

4 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

5 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

5 hours ago