Political News

హాట్ టాపిక్: కేసీఆర్ లేకుండా కేబినెట్ జరిగిందా?

కీలకమైన అంశం ఒకటి చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. అది కూడా మంత్రి కేటీఆర్ తనకు తానుగా ట్వీట్ చేసిన తర్వాత మాత్రమే బయటకు రావటం మరో విశేషంగా చెప్పక తప్పదు. ఇంతకూ జరిగిందేమంటే.. బుధవారం ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్ పాలసీలపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం తెలిసిందే. త్వరలో చేపట్టే పాలసీలను మంత్రులకు వివరించారు.

ఇంచుమించే ఇదే విషయం గురువారం అన్ని పేపర్లలోనూ.. టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. అయితే.. అన్ని మీడియా సంస్థలు.. అసలు పాయింట్ ను వదిలేసి కొసరి పాయింట్ ను పట్టుకొని వార్తల్ని ప్రజలకు అందించారు.

కొద్ది గంటల క్రితం మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం.. ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్స్ పాలసీలను కేబినెట్ మిత్రులందరికి వివరించినట్లుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ప్రజంటేషన్ కార్యక్రమం ఏకంగా ఎనిమిది గంటల పాటు సాగిందని.. ఆ సందర్భంగా చర్చకు వచ్చిన కీలక అంశాల్ని త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నట్లు వెల్లడించారు.

అప్పటివరకు కేబినెట్ మంత్రులంతా కలిసి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరగటం.. అది కేబినెట్ తరహాలోనే జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. ఇంత కీలక పరిణామం జరిగినా.. మీడియాలో కవర్ కాకపోవటం గమనార్హం.

ఇలా ముఖ్యమంత్రి లేకుండా మంత్రులంతా కలిసి సమావేశమైన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు చోటు చేసుకుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.

అలిపిరి దగ్గర చంద్రబాబు మీద దాడి జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ నాయకత్వంలో కేబినెట్ భేటీ జరగ్గా.. అలిపిరి వద్ద వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సందర్భంలో నాటి కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది.

తాజాగా..సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న వేళ.. కేటీఆర్ నాయకత్వాన తాజా భేటీ జరగటం.. అందులో మంత్రులతో పాటు.. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్లు.. అధికారులు పాల్గొనటం గమనార్హం.

This post was last modified on August 14, 2020 5:45 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

12 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

26 minutes ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

3 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

5 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

5 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

5 hours ago