Political News

వైసీపీకి భారీ దెబ్బ‌.. 7-8 శాతం ఓట్లు గండి.. రీజ‌నేంటి..?

ఏపీలో ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉన్నా.. ముంద‌స్తు కోయిల‌లు కూస్తున్నాయ‌నే సంకేతాలు వ‌స్తున్న ద‌రిమిలా.. రాష్ట్రంలో ఒక‌విధ‌మైన ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం నెల‌కొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వ‌స్తుంది? అనే ఇంట్ర‌స్టింగ్ టాపిక్ జ‌నాల మ‌ధ్య హ‌ల్చ‌ల్ చేస్తోంది. మ‌రోవైపు స‌ర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వ‌స్తాయ‌నే లెక్క‌లు చెబుతున్నారు.

స‌రే.. ఎవ‌రు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫ‌లితాన్ని బ‌ట్టి చూస్తే వైసీపీ స‌ర్కారుకు భారీ దెబ్బ త‌గిలే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిప‌డు తోంద‌ని అంటున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. క‌నీ వినీ ఎరుగ‌ని విజ‌యాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాల‌ను కైవ‌సం చేసుకుంది.

అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని స‌ర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల‌.. వ్య‌తిరేక స‌ర్వేరాయుళ్లు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవ‌డం ఖాయ‌మ‌ని ముక్త‌కంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. వైసీపీ కేవ‌లం 42-43 శాతం ఓటు బ్యాంకుకే ప‌రిమితం అవుతుంద‌ని అంటున్నారు.

ఇదే జ‌రిగితే.. తిరిగి అధికారంలోకి రావాల‌ని భావిస్తున్న సీఎం జ‌గ‌న్ ఆశ‌లు ఏమేర‌కు సానుకూలంగా మార‌తాయి? అనేది చ‌ర్చ‌నీయాంశ‌మే. ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయ‌కులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు త‌గ్గుతుంద‌న్నఅంచ‌నాల నేప‌థ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్ల‌లో పార్టీ ఓట‌మి చెందే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి దీనిని అడ్డుకునేందుకు.. క‌ట్ట‌డి చేసేందుకు జ‌గ‌న్ ఎలాంటి నిర్ణ‌యాలు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on July 7, 2023 5:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజ‌క‌వ‌ర్గాల‌పై రేవంత్ కొత్త ఫార్ములా… వ‌ర్కువ‌ట్ అయ్యేనా?

2029 పార్ల‌మెంటు ఎన్నిక‌ల నాటికి దేశంలో నియోజ‌క‌వ‌ర్గాల‌ను పున‌ర్విభ‌జించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న విష‌యం తెలిసిందే. ఇటు అసెంబ్లీ,…

1 hour ago

పెను సంక్షోభంలో ప్ర‌పంచం…!

అమెరికా - ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న చర్చల ప్రతిష్టంభ‌న ప్రపంచ దేశాలను పెను సంక్షోభంలోకి నెట్టే దిశగా మారుతోందా?…

2 hours ago

రాష్ట్ర‌ప‌తికి బహుమతిగా మంగళగిరి చీర

భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దిముర్ముతో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ భేటీ అయ్యారు. పార్టీకి చెందిన…

2 hours ago

ఏపీ కొత్త ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్‌… వైసీపీకి షాకేనా?

ఏపీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం క‌మిష‌న‌ర్ ప‌ద‌వి ఖాళీ అయింది. గ‌త నెల 31వ తేదీ వ‌ర‌కు ఉన్న రాష్ట్ర…

2 hours ago

‘హోం’ ప్రశ్నలపై ‘సీఎం’ సమాధానం చెప్తారా?

తెలంగాణలో కీలకమైన హోం శాఖను సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర పెట్టుకున్నారు. శాంతిభద్రతలను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. అయితే తరచుగా…

4 hours ago

కేసీఆర్ వరకు వెళ్లిన సీతక్క పంచాయితీ

తెలంగాణలో అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన మహిళా నేత, సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కేబినెట్ లో కీలక…

5 hours ago