ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు కోయిలలు కూస్తున్నాయనే సంకేతాలు వస్తున్న దరిమిలా.. రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ జనాల మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వస్తాయనే లెక్కలు చెబుతున్నారు.
సరే.. ఎవరు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిపడు తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. కనీ వినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని సర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల.. వ్యతిరేక సర్వేరాయుళ్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవడం ఖాయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ కేవలం 42-43 శాతం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతుందని అంటున్నారు.
ఇదే జరిగితే.. తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్ ఆశలు ఏమేరకు సానుకూలంగా మారతాయి? అనేది చర్చనీయాంశమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయకులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు తగ్గుతుందన్నఅంచనాల నేపథ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్లలో పార్టీ ఓటమి చెందే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని అడ్డుకునేందుకు.. కట్టడి చేసేందుకు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on July 7, 2023 5:15 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పటిలా సినిమాల మీద సీరియస్గా లేకపోయినా, తన పొటెన్షియాలిటీకి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నా.. ఆయన…
వైసీపీ అధినేత జగన్పై ఆయన సోదరి, ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి నిప్పులు చెరిగారు. 'అన్న'…
దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న…
ఏపీలో మరో కీలక పథకం ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. 'దివ్యాంగ శక్తి' పేరుతో కీలక పథకాన్ని సీఎం చంద్రబాబు, ఉప…
మంత్రి నారా లోకేష్.. మంగళవారం ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఓ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ విషయాన్ని అత్యంత గోప్యంగా…
ఏపీకి పొరుగునే ఉన్న తమిళనాడులో ఇప్పుడు ఇదే తరహా రాజకీయాలు కూడా కనిపిస్తున్నాయి. పార్టీలు లెక్కకు మిక్కిలిగా ఉన్నా.. నాయకులు…