ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు కోయిలలు కూస్తున్నాయనే సంకేతాలు వస్తున్న దరిమిలా.. రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ జనాల మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వస్తాయనే లెక్కలు చెబుతున్నారు.
సరే.. ఎవరు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిపడు తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. కనీ వినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని సర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల.. వ్యతిరేక సర్వేరాయుళ్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవడం ఖాయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ కేవలం 42-43 శాతం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతుందని అంటున్నారు.
ఇదే జరిగితే.. తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్ ఆశలు ఏమేరకు సానుకూలంగా మారతాయి? అనేది చర్చనీయాంశమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయకులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు తగ్గుతుందన్నఅంచనాల నేపథ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్లలో పార్టీ ఓటమి చెందే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని అడ్డుకునేందుకు.. కట్టడి చేసేందుకు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్లదే ఆధిపత్యం నడుస్తోంది. కుర్రాడు వైభవ్ సూర్యవంశీతో…
ఇటీవలే విడుదలైన నాగబంధంకు అంత ఓపెనింగ్స్ వస్తాయని ఊహించినవాళ్లు చాలా తక్కువ. ఎంత విజువల్ ఎఫెక్ట్స్ తో తీసిన సినిమా…
రెండు సంవత్సరాలకు పైగా మోక్షం కోసం ఎదురు చూస్తున్న విశ్వంభర విడుదలకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇప్పటికే ఆలస్యం వల్ల హైప్…
కాపు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే.. దివంగత వంగవీటి మోహన్రంగా కుమార్తె ఆశాలత త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చు కోనున్నారా?…
ఫుట్బాల్ ప్రపంచాన్ని దశాబ్దాల పాటు శాసించిన క్రిస్టియానో రొనాల్డో శకం కన్నీటితో ముగిసింది. 2026 ఫిఫా వరల్డ్ కప్ ప్రీ…
కేవలం మూడు వారాలు... ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్గా రికార్డు సృష్టించిన ఎలాన్ మస్క్ మళ్లీ పాత స్థానానికి పడిపోవడానికి పట్టిన…