ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు కోయిలలు కూస్తున్నాయనే సంకేతాలు వస్తున్న దరిమిలా.. రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ జనాల మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వస్తాయనే లెక్కలు చెబుతున్నారు.
సరే.. ఎవరు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిపడు తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. కనీ వినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని సర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల.. వ్యతిరేక సర్వేరాయుళ్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవడం ఖాయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ కేవలం 42-43 శాతం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతుందని అంటున్నారు.
ఇదే జరిగితే.. తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్ ఆశలు ఏమేరకు సానుకూలంగా మారతాయి? అనేది చర్చనీయాంశమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయకులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు తగ్గుతుందన్నఅంచనాల నేపథ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్లలో పార్టీ ఓటమి చెందే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని అడ్డుకునేందుకు.. కట్టడి చేసేందుకు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
ఒకప్పుడు సౌత్ సినిమాలను బాలీవుడ్ వాళ్లు ఎంత తక్కువగా చూశారో తెలిసిందే. కానీ ‘బాహుబలి’ సినిమా తర్వాత లెక్కలన్నీ మారిపోయాయి.…
ఏపీలో కూటమి అధికారం చేపట్టి అప్పుడే రెండేళ్లు దాటిపోయింది. 2024 ఎన్నికల్లో ఏ ఒక్కరి ఊహకు అందని రీతిలో టీడీపీ,…
ఏపీ సీఎం చంద్రబాబు.. పాలన, ఆయన తీసుకున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగులు, భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ నిర్మాణం.. వంటి పలు…
2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడతారన్న పేరుంది. పైగా మాటల విషయంలో ఆమె…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…