ఈ ఏడాది దుబాయ్ లో నిర్వహించనున్న ఐపీఎల్ టోర్నీ స్పాన్సర్ కు సంబంధించిన విశేషాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. ప్రముఖ చైనా మొబైల్ సంస్థ వివో.. టైటిల్ స్పాన్సరర్ గా వ్యవహరిస్తోంది. ఇటీవల భారత్ – చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో టైటిల్ స్పాన్సర్ షిప్ నుంచి బయటకు తప్పుకుంటున్న సంగతి తెలిసిందే.
గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. వివో ప్రతి ఏటా రూ.440 కోట్లు బీసీసీఐకు చెల్లించాల్సి ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో కొత్తగా వచ్చే టైటిల్ స్పాన్సరర్.. అంత మొత్తం ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా అంత భారీ మొత్తాన్ని చెల్లించేందుకు ముందు వస్తారా? అన్నది సందేమంగా మారింది. దీంతో.. అధికారిక స్పాన్సర్లను మూడు నుంచి ఐదుకు పెంచటం ద్వారా.. వీలైనంత ఎక్కువ మొత్తాన్ని రాబట్టాలని బోర్డు భావిస్తోంది.
ఇందులో భాగంగా పలు పేర్లు వినిపిస్తున్నాయి. స్పాన్సర్లు ఎంతమంది ఏమిటి? అన్నది పక్కన పెడితే.. మొత్తంగా రూ.300 కోట్లు రాబడిని సమకూర్చుకోవాలన్నది బోర్డు ఆలోచనగా చెబుతున్నారు. ఇప్పటికే అమెజాన్.. బైజూస్.. డ్రీమ్ లెవెన్ టైటిల్ స్పాన్సర్ షిప్ రేసులో ఉన్న విషయం తెలిసిందే. అనూహ్యంగా కొత్త సంస్థ తెర మీదకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారం చివరికి టైటిల్ స్పాన్సర్ వ్యవహారాన్ని తేల్చేస్తారని భావిస్తున్నారు. మరి.. బోర్డు అంచనా వేస్తున్నట్లుగా రూ.300 కోట్ల ఆదాయ లక్ష్యాన్ని చేరుకుంటుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
This post was last modified on August 14, 2020 11:57 am
ఈ వారం విడుదల కాబోతున్న అన్ని భాషల సినిమాల్లో అత్యధిక బుకింగ్స్ జరుపుకున్నది హాలీవుడ్ మూవీ మైఖేల్ ఒక్కటే. ఇప్పటిదాకా…
అదేంటి ఇప్పటికే బోలెడు సినిమాల్లో చూసేశాం కదా కొత్తగా మళ్ళీ డెబ్యూ ఏంటనుకుంటున్నారా. మ్యాటర్ వేరే ఉంది. శ్రీలీల బాలీవుడ్…
చిన్న సినిమాలను జనాల్లోకి తీసుకెళ్లడం, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం ఈ రోజుల్లో పెద్ద సవాలుగా మారిపోయింది. గతంలో సినిమా బాగుంటే…
ఐపీఎల్ 2026 సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి రోజురోజుకూ అట్టడుగుకు పడిపోతోంది. నేటి మ్యాచ్ లో సొంత…
ఇటీవలే టోవినో థామస్ 'పళ్ళి చట్టంబి' తెలుగు వెర్షన్ విడుదలయ్యింది. మార్నింగ్ షోనే డెఫిసిట్ తో మొదలై సాయంత్రానికే డిజాస్టర్…
కల్వకుంట్ల కవిత.. మాజీసీఎం కేసీఆర్ తనయగా.. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన ఆమె.. ఎంపీగా, ఎమ్మెల్సీగా వ్యవహరించారు. ఇక, ఆ పార్టీతో…