Political News

ముందస్తు పై సజ్జల ఫుల్ క్లారిటీ

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చించారని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదని సజ్జల తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు స్పష్టం చేశామని అన్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలం పరిపాలన చేస్తామని, చివరి రోజు వరకు ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని సజ్జల క్లారిటీనరిచ్చారు. ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని, ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని సజ్జలు ఆరోపించారు.

చంద్రబాబు ఏం చేసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సజ్జల. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. జగన్ చేపట్టిన పథకాలే మరోసారి ఆయనను గెలిపిస్తాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. కాగా, ముందస్తు ఎన్నికలపై సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని, ముందయినా..వెనుకైనా యుద్ధానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్నది కేవలం కల్పిత ప్రచారం అని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా తాము మాత్రం ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతామని కారుమూరి స్పష్టం చేశారు.

Satya

Recent Posts

రజినీకి నచ్చనిది కమల్‌కు నచ్చిందా?

తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…

3 minutes ago

కాపులంటే వైసీపీలో ఉన్నొళ్లు మాత్రమేనా?

ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…

4 minutes ago

సాయిపల్లవి చేసుంటే ఎలా ఉండేది

మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…

2 hours ago

తమిళ నటుడికి పిచ్చెక్కించేసిన కంచరపాలెం

స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్‌కు మంచి గుర్తింపే ఉంది.…

3 hours ago

ఫోటో కోసం శ్రీలీలను పక్కకు జరిపిన సీఎం భార్య?

ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…

3 hours ago

ఈ తప్పులకూ అంత పెద్ద శిక్షా…?

తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…

3 hours ago