Political News

ముందస్తు పై సజ్జల ఫుల్ క్లారిటీ

సీఎం జగన్ ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని ముమ్మరంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జగన్ భేటీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించే విషయంపై చర్చించారని పుకార్లు వస్తున్నాయి. మరోవైపు, టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీలో ముందస్తు ఎన్నికల వ్యవహారం పై ఏపీ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.

ఏపీలో ముందస్తు ఎన్నికల ప్రసక్తేలేదని సజ్జల తేల్చి చెప్పేశారు. ఇదే విషయాన్ని గతంలోనూ చాలాసార్లు స్పష్టం చేశామని అన్నారు. ముందస్తు ఎన్నికలపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్తల్లో వాస్తవం లేదన్నారు. జగన్ కు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల కాలం పరిపాలన చేస్తామని, చివరి రోజు వరకు ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రాన్ని పరిపాలిస్తారని సజ్జల క్లారిటీనరిచ్చారు. ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ ప్రచారం చేస్తోందని, ఇదంతా చంద్రబాబు గేమ్ ప్లాన్ అని సజ్జలు ఆరోపించారు.

చంద్రబాబు ఏం చేసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు సజ్జల. ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని, రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని చెప్పారు. జగన్ చేపట్టిన పథకాలే మరోసారి ఆయనను గెలిపిస్తాయని సజ్జల ధీమా వ్యక్తం చేశారు. కాగా, ముందస్తు ఎన్నికలపై సరఫరాల శాఖా మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సింగిల్ గా ఎదుర్కొంటామని, ముందయినా..వెనుకైనా యుద్ధానికి సిద్ధమని సంచలన ప్రకటన చేశారు.

అయితే, ముందస్తు ఎన్నికలకు వెళ్తామన్నది కేవలం కల్పిత ప్రచారం అని, షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళ్ళబోతున్నామని అన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎక్కువ సీట్లు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పోటీ చేసినా తాము మాత్రం ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగుతామని కారుమూరి స్పష్టం చేశారు.

This post was last modified on July 6, 2023 9:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సునీతా 9 నెలల అంతరిక్ష ప్రయాణం… సంపాదన ఎంతో తెలుసా?

నాసా వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్‌మోర్ ఎనిమిది రోజుల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి, అనుకోని సమస్యల…

25 minutes ago

ఫ్యామిలీకి దూరంగా.. బీసీసీఐ నిబంధనపై కోహ్లీ అసహనం!

టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ, బీసీసీఐ తీసుకున్న కుటుంబ పరిమితి నిబంధనలపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. బీసీసీఐ…

1 hour ago

లాంఛనం పూర్తి… రాజధానికి రూ.11 వేల కోట్లు

నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర…

1 hour ago

అక్క బదులు తమ్ముడు… మరో వివాదంలో భూమా

టీడీపీలో భూమా ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యం ఉంది. దివంగత భూమా నాగిరెడ్డి, భూమా శోభా నాగిరెడ్డిలు... ఒకేసారి ఎంపీగా, ఎమ్మెల్యేలుగా కొనసాగారు. అయితే…

2 hours ago

ఎల్2….సినిమాని తలదన్నే బిజినెస్ డ్రామా

మోహన్ లాల్ ఎల్2 ఎంపురాన్ వచ్చే వారం మార్చి 27 విడుదల కానుంది. ఇది ఎప్పుడో ప్రకటించారు. అయితే నిర్మాణ…

3 hours ago

కోర్ట్ – టాలీవుడ్ కొత్త ట్రెండ్ సెట్టర్

ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేకుండా, పరిచయం లేని జంటను తీసుకుని, విలన్ ని హైలైట్ చేస్తూ ఒక చిన్న బడ్జెట్…

3 hours ago