Political News

కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే అసలు ప్లానా ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిపై అనేకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ విశ్లేషణలు పార్టీ నేతల చర్చల్లో కూడా దొర్లుతున్నాయి. ఇంతకీ అలాంటి విశ్లేషణల్లో ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ ఏమిటంటే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాడినికే నరేంద్రమోడీ పెద్ద ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే అతివాదిగా పాపులరైన బండి సంజయ్ ను అర్ధాంతరంగా అధ్యక్షస్ధానం నుండి తప్పించారట. మితవాదిగా పేరున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావటం అన్నది కలలో మాటగా అగ్రనేతలకు అర్ధమైపోయిందట. ఒకపుడు బీజేపీకి ఉన్న ఊపు ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణాలో రాజకీయ సమీకరణలు చాలావేగంగా మారిపోతున్నాయి. ఒకపుడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన నేతలు కూడా మళ్ళీ పార్టీలో చేరుతున్నారు. అలాగే సొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి లాంటి గట్టినేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు.

ఇక బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, జితేందర రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఈటల, కోమటిరెడ్డికి పదవులు దక్కాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి మారకపోవచ్చు. మరి మిగిలిన నేతల పరిస్దితి ఏమిటి ?

ఇదంతా చూసిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమని తేలిపోయింది. అందుకనే అధికారంలోకి వచ్చేస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ అవకాశాలను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ తో చేతులు కలపాల్సిందే అని మోడీ నిర్ణయించినట్లు సమాచారం. జాతీయస్ధాయిలో బీజేపీకి ఎప్పటికైనా కాంగ్రెస్ తోనే సమస్య కానీ బీఆర్ఎస్ తో కాదు. అందుకనే కాంగ్రెస్ ను ముందు తెలంగాణాలో దెబ్బకొట్టడానికే మోడీ నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే బండిని తీసేసి కిషన్ కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఎవరి వ్యూహాలు వర్కవుటవుతాయో చూడాల్సిందే.

This post was last modified on July 6, 2023 12:49 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

5 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

5 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

7 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

7 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

8 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

8 hours ago