Political News

కాంగ్రెస్ ను దెబ్బకొట్టడమే అసలు ప్లానా ?

తెలంగాణా బీజేపీ అధ్యక్షుడిపై అనేకరకాల విశ్లేషణలు వినబడుతున్నాయి. ఈ విశ్లేషణలు పార్టీ నేతల చర్చల్లో కూడా దొర్లుతున్నాయి. ఇంతకీ అలాంటి విశ్లేషణల్లో ఒక ఇంట్రెస్టింగ్ విశ్లేషణ ఏమిటంటే కాంగ్రెస్ ను దెబ్బకొట్టాడినికే నరేంద్రమోడీ పెద్ద ప్లాన్ వేశారట. ఇందులో భాగంగానే అతివాదిగా పాపులరైన బండి సంజయ్ ను అర్ధాంతరంగా అధ్యక్షస్ధానం నుండి తప్పించారట. మితవాదిగా పేరున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అధ్యక్షుడిని చేసినట్లు పార్టీలోనే చర్చలు జరుగుతున్నాయి.

దీనికి కారణం ఏమిటంటే కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావటం అన్నది కలలో మాటగా అగ్రనేతలకు అర్ధమైపోయిందట. ఒకపుడు బీజేపీకి ఉన్న ఊపు ఇపుడు ఎక్కడా కనబడటంలేదు. ముఖ్యంగా కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత తెలంగాణాలో రాజకీయ సమీకరణలు చాలావేగంగా మారిపోతున్నాయి. ఒకపుడు కాంగ్రెస్ నుండి బయటకు వచ్చేసిన నేతలు కూడా మళ్ళీ పార్టీలో చేరుతున్నారు. అలాగే సొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి లాంటి గట్టినేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు.

ఇక బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరటానికి రెడీ అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, విజయశాంతి, జితేందర రెడ్డి లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ లో చేరిపోవటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. అయితే ఈటల, కోమటిరెడ్డికి పదవులు దక్కాయి కాబట్టి ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ లోకి మారకపోవచ్చు. మరి మిగిలిన నేతల పరిస్దితి ఏమిటి ?

ఇదంతా చూసిన తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చేది కష్టమని తేలిపోయింది. అందుకనే అధికారంలోకి వచ్చేస్తుందని అనుకుంటున్న కాంగ్రెస్ అవకాశాలను దెబ్బకొట్టాలంటే బీఆర్ఎస్ తో చేతులు కలపాల్సిందే అని మోడీ నిర్ణయించినట్లు సమాచారం. జాతీయస్ధాయిలో బీజేపీకి ఎప్పటికైనా కాంగ్రెస్ తోనే సమస్య కానీ బీఆర్ఎస్ తో కాదు. అందుకనే కాంగ్రెస్ ను ముందు తెలంగాణాలో దెబ్బకొట్టడానికే మోడీ నిర్ణయించుకున్నారట. ఇందులో భాగంగానే బండిని తీసేసి కిషన్ కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరుగుతోంది. మరి చివరకు ఎవరి వ్యూహాలు వర్కవుటవుతాయో చూడాల్సిందే.

This post was last modified on July 6, 2023 12:49 pm

Share

Recent Posts

అల వైకుంఠపురములో కాదు అనంతపురములో… వైరల్

‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…

1 hour ago

మమిత బైజు – వయసు తక్కువా… హిట్లు ఎక్కువ!

ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…

2 hours ago

కేరళం ప్రకృతి వైద్యానికి పవన్ ప్రాధాన్యత

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…

2 hours ago

మల్లెపూల పల్లకి… ఊగుతున్న థియేటర్లు

ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…

4 hours ago

శాశ్వత సెలవు తీసుకున్న షావుకారు జానకి

దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…

5 hours ago

సింగిల్ సింహం అంటారు… ఇదేం రాజకీయం జగన్?

ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…

6 hours ago