టిడిపి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు మంచి ట్రాక్ రికార్డు ఉన్న సంగతి తెలిసిందే. వరుసగా ఒకసారి ఎంపీ, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఘనత గంటాకు ఉంది. అంతేకాదు, నాలుగు సార్లు నాలుగు వేర్వేరు నియోజకవర్గాలలో పోటీ చేసి తన సత్తా చాటుకున్నారు గంటా. ప్రస్తుతం విశాఖ నార్త్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న శ్రీనివాసరావు రాబోయే ఎన్నికలలో కూడా టిడిపి తరఫున భీమిలి నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే, దాదాపుగా 2024 ఎన్నికల గంటాకు చివరి ఎన్నికలు కావచ్చు అని ప్రచారం జరుగుతుంది.
తన రాజకీయ వారసుడిగా తనయుడు గంటా రవితేజను ప్రమోట్ చేసేందుకే ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకోబోతున్నారని వదంతులు వినిపిస్తున్నాయి. ఆ పుకార్లకు తగ్గట్టుగానే గత వారం రోజులుగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో రవితేజ చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఉంటున్న రవితేజ హఠాత్తుగా లోకేష్ వెంట పాదయాత్రలో నడవడంతో రవితేజ రాజకీయ అరంగేట్రానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తెను రవితేజ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఆయనకు రాజకీయ వారసుడిగా అటువైపు నుంచి కూడా రవితేజ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నెల్లూరులో లోకేష్ పాదయాత్ర సందర్భంగా గంట రవితేజ యాక్టివ్ గా పాల్గొంటున్నట్టుగా ప్రచారం జరుగుతుంది. 2024 ఎన్నికల లక్ష్యంగా రవితేజ ముందుకు వెళ్తున్నారా అన్న ప్రచారం కూడా మొదలైంది.
మరోవైపు నారాయణ కూడా అనారోగ్య కారణాల రీత్యా రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ క్రమంలోనే రవితేజను తన స్థానంలో నారాయణ పోటీ చేయించినా ఆశ్చర్యపోనవసరం లేదని ప్రచారం జరుగుతుంది.
This post was last modified on July 6, 2023 6:18 am
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…