భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా మొదలు సీఎం జగన్ వరకు అందరినీ టార్గెట్ చేసిన పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపరథ్యంలోనే పవన్ కు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి అదే రేంజ్ లో కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రతి విమర్శలు చేశారు.
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని అంబటి సెటైర్లు వేశారు. వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందని చురకలంటించారు. ఉభయగోదావరి జిల్లాలలో చంద్రబాబుకు జనసేన అమ్ముడుపోయిందని, ఇక్కడ పోటీ చేసి అధికారంలోకి వచ్చే దమ్ముందా అని పవన్ ను ప్రశ్నించారు. జగన్ పోవాలి అని పవన్ నినాదం అందుకన్నారని, జగన్ పోతే ఎవరు రావాలో కూడా చెప్పాలని అంబటి ప్రశ్నించారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని, అందుకే జగన్ పోవాలన్న వాడే పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పవన్ కు ధ్యాస లేదని ఎద్దేవా చేశారు.
పవన్ సినిమాల్లో మాత్రమే కథానాయకుడని నిజజీవితంలో కంత్రీ నాయకుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. హలో ఏపీ నా పార్టీని అమ్మేశాను అంటూ వారాహిపై పవన్ ఊరేగుతున్నారని, స్థిరత్వం లేని పవన్ రాజకీయాలకు పనికిరాడని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కినందుకు వారాహి వాహనం వరాహమైందని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వివాహ వ్యవస్థ పై పవన్ కి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడకుండా ప్రజల కోసం పోరాడారని, నలుగురు విప్లవకారుల పేర్లు చెబితే పవన్ విప్లవకారుడైపోడని ఎద్దేవా చేశారు.
పవన్ పెళ్లిళ్ల వీరుడని, ప్రజలకు నీతులు చెబుతున్నాడని సెటైర్లు వేశారు. జగన్ పేదల పక్కన నిలబడితే పవన్ చంద్రబాబు పక్కన చేరారని చురకలటించారు. పవన్ మాటలు అసాంఘిక శక్తులను రెచ్చగొట్టేలా సంస్కారహీనంగా ఉన్నాయి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధైర్యవంతులే ఆవేశపడతారని,.తెగించి రావడానికి పవన్ ఏమన్నా యుద్ధం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సినిమాలు చేసి పవన్ కోట్లు సంపాదిస్తున్న పవన్ కు సామాన్యుల కష్టాలు తెలియవని దుయ్యబట్టారు.
This post was last modified on July 1, 2023 4:34 pm
మా మంచి ఎమ్మెల్యే- ఈ మాట చాలా తక్కువ నియోజకవర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వంపై ప్రజల సంతృప్తి - అసంతృప్తి…
మాజీ మంత్రి, జనసేన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో తాను ఎలాంటి పదవులూ…
రన్బీర్ కపూర్ హీరోగా రూపొందుతున్న రామాయణ దీపావళి విడుదలకు రెడీ అవుతోంది. ఆ మధ్య వచ్చిన టీజర్ కు మిశ్రమ…
మనం ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నాం. ఎవరికీ ఎలాంటిఇబ్బంది లేకుండా చేస్తున్నాం. అయినా.. జగన్ను కొందరు కలుస్తున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది..?…
ఏపీ రాజధాని విషయంలో వైసీపీ అధినేత జగన్ పక్కా క్లారిటీతోనే ఉన్నారా? అంటే.. ఔననే ఆయన చెబుతున్నారు. ప్రజలు మెచ్చుతారా..…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధమైనా.. విపత్తయినా.. ప్రజలకు ఏం…