సీఎం జగన్ రాజకీయ వ్యూహాల గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏం చేసేందుకైనా వెనుకాడరంటూ దుయ్యబడుతుంటారు. అన్నదమ్ములు, బావాబామ్మర్దులు, బాబాయ్ అబ్బాయ్..ఇలా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ అసలు సందేహించరంటూ వారు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.
ఉదయగిరిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేకపాటి చంద్రశేఖరరెడ్డిని జగన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, చంద్ర శేఖర్ రెడ్డిపై పోటీకి జగన్…చంద్రశేఖర్ సోదరుడు మేకపాటి రాజగోపాల్రెడ్డిపని దించబోతున్నారు. దీంతో, వీరిద్దరి మధ్య చిచ్చు రేగింది. దీంతో, అన్నదమ్ముల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మాజీ మంత్రి అనిల్ వర్సెస్ రూప్ కుమార్ అన్న రీతలో మాటల యుద్ధం జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ నడుస్తోంది. అనిల్ కు చెక్ పెట్టేందుకు పార్టీ కార్యాలయం ప్రారంభించిన రూప్ కుమార్…అనిల్ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు.
అయితే, రూప్ కుమార్ గురించి జగన్ కు అనిల్ కంప్లయింట్ చేయగా…పోయి పనిచూసుకోబ్బా అని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అనిల్ షాకయ్యారట. మంత్రి పదవి ఉన్నప్పుడు జగన్ పై ఈగ వాలనివ్వని అనిల్ ఇప్పుడు తనకి ఈ స్థితి రావడంతో దిగాలుగా ఉన్నారట. రూప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అనిల్ కోరినా జగన్ పట్టించుకోలేదటజ తనకు అండగా నిలబడతాడని భావించిన జగన్ కూడా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ తీవ్ర అసహనానికి గురవుతున్నారట. మరోవైపు, తన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా జగన్ చెక్ పెట్టారట. గతంలో జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన బ్రదర్ అనిల్…ఇపుడు సైలెంట్ అయ్యారట.
This post was last modified on July 1, 2023 4:37 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…