Political News

రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు

సీఎం జగన్ రాజకీయ వ్యూహాల గురించి ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తుంటారు. రాజకీయ లబ్ధి కోసం జగన్ ఏం చేసేందుకైనా వెనుకాడరంటూ దుయ్యబడుతుంటారు. అన్నదమ్ములు, బావాబామ్మర్దులు, బాబాయ్ అబ్బాయ్..ఇలా ఎవరి మధ్య అయినా చిచ్చు పెట్టేందుకు జగన్ అసలు సందేహించరంటూ వారు విమర్శిస్తుంటారు. ఈ క్రమంలోనే నెల్లూరులో రెండు కుటుంబాల మధ్య జగన్ చిచ్చు పెట్టారని ప్రచారం జరుగుతోంది.

ఉద‌య‌గిరిలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మేక‌పాటి చంద్ర‌శేఖ‌ర‌రెడ్డిని జగన్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, చంద్ర శేఖర్ రెడ్డిపై పోటీకి జగన్…చంద్రశేఖర్ సోదరుడు మేక‌పాటి రాజగోపాల్‌రెడ్డిపని దించబోతున్నారు. దీంతో, వీరిద్దరి మధ్య చిచ్చు రేగింది. దీంతో, అన్నదమ్ముల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. మరోవైపు, మాజీ మంత్రి అనిల్ వర్సెస్ రూప్ కుమార్ అన్న రీతలో మాటల యుద్ధం జరుగుతోంది. జిల్లావ్యాప్తంగా బాబాయ్ వర్సెస్ అబ్బాయ్ వార్ నడుస్తోంది. అనిల్ కు చెక్ పెట్టేందుకు పార్టీ కార్యాలయం ప్రారంభించిన రూప్ కుమార్…అనిల్ వ్యతిరేక వర్గాన్ని చేరదీస్తున్నారు.

అయితే, రూప్ కుమార్ గురించి జగన్ కు అనిల్ కంప్లయింట్ చేయగా…పోయి పనిచూసుకోబ్బా అని జగన్ చెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో అనిల్ షాకయ్యారట. మంత్రి పదవి ఉన్నప్పుడు జగన్ పై ఈగ వాలనివ్వని అనిల్ ఇప్పుడు తనకి ఈ స్థితి రావడంతో దిగాలుగా ఉన్నారట. రూప్ కుమార్ ను సస్పెండ్ చేయాలని అనిల్ కోరినా జగన్ పట్టించుకోలేదటజ తనకు అండగా నిలబడతాడని భావించిన జగన్ కూడా పట్టించుకోకపోవడంతో అనిల్ కుమార్ తీవ్ర అసహనానికి గురవుతున్నారట. మరోవైపు, తన బావమరిది బ్రదర్ అనిల్ కుమార్ కు కూడా జగన్ చెక్ పెట్టారట. గతంలో జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పించిన బ్రదర్ అనిల్…ఇపుడు సైలెంట్ అయ్యారట.

This post was last modified on July 1, 2023 4:37 pm

Share
Show comments
Published by
Satya
Tags: Feature

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago