ఏపీలోని వైసీపీ పాలన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తానని 2019లో రోడ్లవెంట తిరిగి.. ఓట్లు గుంజుకున్న సీఎం జగన్.. రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడికో తీసుకువెళ్లారని.. ఎవరూ ఇలా ఊహించలేదని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పంటగా గంజాయిని.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని.. ఆయన పరిచయం చేశారని పవన్ సటైర్లు వేశారు. రాష్ట్ర గుర్తుల గురించి.. నేటి యువతకు, పిల్లలకు ఇదే బోధించాలా? అని ప్రశ్నించారు. ఒకప్పుడునెమలి, పూర్ణకుంభం వంటివి చదువుకున్నామని.. కానీ.. ఇప్పుడు గంజాయి.. గొడ్డలే గుర్తుకు వస్తోందని అన్నారు.
జగన్ … నీ గురించి చెబితే.. రక్త కక్కుకుంటావ్ అని పవన్ తీవ్రంగా విమర్శించారు. జగన్ తన చిన్న వయసులోనే తాత రాజారెడ్డి ప్రోద్బలంతో అప్పటి పులివెందుల ఎస్ఐ ప్రకాశ్బాబుని స్టేషన్లో పెట్టి కొట్టాడు. పోలీసు వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి జగన్. సొంత ఎంపీ.. అది కూడా ఇక్కడి నరసాపురానికి సేవ చేయాలని వచ్చిన మా ప్రత్యర్థి.. కనుమూరి రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించాడు అని పవన్ విరుచుకుపడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ సవాల్ విసిరారు. వైసీపీతో సై అంటే సై. నిండా మునిగినోడికి చలేంటి అని పవన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అప్పుడు జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటుతామని తెలిపారు. ఏది ఏమైనా సేవ, పోరాటం మాత్రం ఆపను. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి. అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు అండగా ఉంటాం అని జనసేనాని చెప్పారు.
తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై కొందరు మంత్రులు, నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో పెరిగిన సీఎం జగన్.. నీ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు నాకు చాలా తెలుసు. మీరు, మీ మంత్రుల చిట్టా మొత్తం విప్పగలను. నేను చెప్పేది వింటే జగన్ చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. రక్తం కక్కుకుంటావ్ కూడా! ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, క్రిమినల్స్ అని జగన్ ఎగురుతున్నారేమో.. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on June 30, 2023 11:01 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…