మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ సర్కారు నాలుగు మాసాల కిందటికి.. ఇప్పటికి.. భిన్నంగా రియాక్ట్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నాలుగైదు నెలల కిందట.. ఈటలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత నుంచి మంత్రుల వరకు.. రాజకీయాలను వేడెక్కించారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనను ఓడించేందు కు గట్టి ప్రయత్నమే చేశారు.
ఇక, ఈటల కూడా.. అధికార పార్టీపై దూకుడుగానే వ్యవహరించారు.. మాటకు మాట కౌంటర్ ఇచ్చారు. తీవ్రంగా కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది నిన్నటి ముచ్చట. కానీ, ఇప్పుడు అనూహ్యంగా పరిణామా లు మారిపోయాయి. రెండురోజుల కిందట ఈటల సతీమణి జమున.. మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. ఆయనను హత మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. సహజంగానే.. ఇరు పక్షాలకు మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా.. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆమె చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదని.. అందరూ భావించారు. ఈటల సతీమణి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఈ వాదనకుభిన్నంగా.. ఏకంగా.. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిపోయి.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడేశారు. ఏకంగా డీజీపీతోనే ఫోన్లో మాట్లాడారు. తర్వాత.. ఎస్పీతో మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని వెంటనే తెలుసుకుని భద్రతకల్పిస్తామనని కూడా చెప్పారు. కట్ చేస్తే.. అసలు ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈటలపై నిన్నటి వరకు నిప్పులు చెరిగి బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రేమ చూపించడం వెనుక పరిణామం ఏంటనేది ఆసక్తిగా మారింది. దీనిపై పరిశీలకులు చెబుతున్న మాట.. కుదిరితే.. ఈటలను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే! ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల అసంతృప్తితో ఉన్నారు.
పైగా..వ చ్చే ఎన్నికల్లో మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఉభయ కుశలోపరిగా.. ఈటలను పార్టీలో చేర్చుకుంటే బెటర్ అని.. ఒక అంచనాకు వచ్చే ఇలా స్పాట్లో రియాక్ట్ అయిందని పరిశీకులు చెబుతున్నారు. ఇక, ఈటల కూడా.. ఇతర పార్టీలకన్నా బీఆర్ ఎస్లో ఉండడమే బెటర్ అని కనుక అనుకుంటే.. ఈ చేరికకు పెద్దగా సమయం పట్టకపోవచ్చని కూడా అంటున్నారు.
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర…
ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే…
బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్…