Political News

బెజవాడ పై కేసీఆర్ నజర్

సోలాపూర్ ట్రిప్‌తో జోష్ నింపుకున్న గులాబీ బాస్ ఇప్పుడు ఏపీలోనూ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు మహారాష్ట్రలో మూడు సభలు పెట్టినప్పటికీ ఈసారి భారీ వాహన శ్రేణితో బల ప్రదర్శనలా ఆ రాష్ట్రానికి వెళ్లడంతో కేసీఆర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పార్టీలు ఆయనపై మాటల దాడి ప్రారంభించాయి. శివసేన ఉద్దవ్ వర్గం నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లు కేసీఆర్‌ తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటే చాలు, మహారాష్ట్రకు అవసరం లేదని చెప్పగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ నేతలు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.

శరద్ పవార్ లాంటి నేతలు కేసీఆర్‌పై విమర్శలు చేయడంతో కేసీఆర్ స్థాయి పెరగడంతో పాటు వార్తల్లో, చర్చల్లో నిలుస్తున్నారు. కేసీఆర్ కోరుకుంటున్నదీ ఇదే. మహారాష్ట్రలో మూడు సభలు పెట్టినా రాని చర్చ ఇప్పుడు అక్కడి నేతలు విమర్శల వేడి పెంచడంతో వచ్చింది. మరాఠీ మీడియాలోనూ కేసీఆర్ ఫస్ట్ పేజీ వార్తల్లో కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే.

మహారాష్ట్రలో తాను అనుకుంటున్నట్లుగానే జరుగుతుండడంతో అక్కడ ఎంట్రీ లెవల్ దాటి ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఇకపై కేసీఆర్ లేకుండా బీఆర్ఎస్‌ నుంచి కేటీఆర్, హరీశ్ వంటి నేతలూ మహారాష్ట్రలో సభలు నిర్వహించబోతున్నారు.. వీరితో పాటు స్థానిక నేతలు ఎక్కడికక్కడ సభలు నిర్వహించబోతున్నారు. ఈ గ్యాప్‌లో కేసీఆర్ మరో కొత్త రాష్ట్రంలో పని ప్రారంభిస్తారు. కేసీఆర్ త్వరలో పని ప్రారంభించబోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

వచ్చే ఎన్నికలలో ఏపీలో పోటీ చేస్తామని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సో… ఏపీలోనూ ప్లాట్ ఫాం రెడీ చేసుకోవాలి. ఇప్పటికే ఏపీలో పార్టీ అధ్యక్షుడిని, కొంత కార్యవర్గాన్ని ప్రకటించారు. త్వరలో కేసీఆర్ ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఈ సభ ఉంటుందని బీఆర్ఎస్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. సోలాపూర్ వెళ్లినప్పుడు హడావుడి చేసినట్లే వందల కార్లతో హైదరాబాద్, విజయవాడ హైవేపై ర్యాలీగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

ఏపీలో విశాఖ ఉక్కు, విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలను ప్రధానాస్త్రాలుగా చేసుకుంటూ రాజకీయం చేయాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. అంతేకాదు… పాలక వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఏవీ కేంద్రంలోని బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా తమలో తామే కొట్టుకుంటుండడంతో అక్కడ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ తమ రాజకీయం ప్రారంభించాలన్నది కేసీఆర్ ప్లాన్.

విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తొలి సభ నిర్వహించిన తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ వరుసగా సభలు నిర్వహించి దూసుకెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్ర తరహాలోనే చేరికలనూ ప్రోత్సహిస్తూ హైప్ క్రియేట్ చేసుకోవాలని.. పాలక వైసీపీ నేతలను రెచ్చగొడితే చాలు తాము నిత్యం వార్తల్లో ఉంటూ ప్రజల్లో తమ పేరు వినిపిస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ నేతల నోటి వీక్‌నెస్‌ను తాము ఉపయోగించుకుంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే హరీశ్ రావు వంటివారు తరచూ వైసీపీని విమర్శిస్తూ ప్లాట్ ఫాం వేస్తుండగా త్వరలో కేసీఆర రంగంలోకి దిగుతారని చెప్తున్నారు.

This post was last modified on June 29, 2023 5:31 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాష్ట్రంలో పెట్టుబడుల వెల్లువ – ఒక రోజులో ఎన్ని లక్షల కోట్లు?

గ‌త నెల‌లో ఏపీలోని విశాఖ‌లో నిర్వ‌హించిన సీఐఐ పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు పోటీ ప‌డుతున్న‌ట్టుగా.. తెలంగాణ ప్ర‌భుత్వం తాజాగా రెండు రోజ‌లు…

43 minutes ago

చరణ్-సుకుమార్… కథ ఇంకా ఫైనల్ అవ్వలేదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అగ్ర దర్శకుడు సుకుమార్‌ల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘రంగస్థలం’ ఎంత…

48 minutes ago

ప్రదీప్ రంగనాథన్ రికార్డు… కష్టమేనా?

పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ నుంచి వచ్చిన హీరోలకు కూడా సాధ్యం కాని ఘనతను.. తమిళ యంగ్ హీరో ప్రదీప్…

1 hour ago

పెళ్లి ఆగిపోతే ఎవరైనా డిప్రెషన్ లోకి వెళ్తారు.. కానీ మందాన మాత్రం..

సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్‌లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…

2 hours ago

‘వైసీపీ తలా తోకా లేని పార్టీ’

తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…

3 hours ago

మహేష్ బాబును మరిచిపోతే ఎలా?

టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…

3 hours ago