తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్పై సటైర్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో.. అంటూ.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని.. దీనిని ముందే పసిగట్టి తనయుడు కేటీఆర్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు.. హస్తినాపురం చుట్టూ ప్రదక్షిణలు చుట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. వాటిని కాపాడుకునేందుకు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, పత్రికల్లో, మీడియాలో కూడా అవి రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని దుయ్యబట్టారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని రేవంత్ విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న మోడీ… లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు వదిలేశారని.. దీనిని బట్టి బీజేపీకి బీటీంగా బీఆర్ ఎస్ ఉందంటే తప్పెలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు.
This post was last modified on June 29, 2023 4:10 pm
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల్లో ఒకరైన కొడాలి నానికి తెలుగుదేశం అన్నా, జనసేన అన్నా ఎంత కోపమో ప్రత్యేకంగా…
హైడ్రా కూల్చివేతలపై చాలామంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మరికొంత మంది మాత్రం నాలాలపై, చెరువలు…
మాస్ రాజా రవితేజ కొత్త సినిమా ఇరుముడి తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వాళ్లుండే ప్రతి చోటా ఇరగాడేస్తోంది. తెలుగులో…
బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తున్న ఇరుముడి ఎక్కడికి వెళ్తుందో ఎవరికి అంతు చిక్కడం లేదు. పాజిటివ్ టాక్ రావడంలో…
అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ కొత్త సినిమా ‘రాకా’ మొదలైనపుడే అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. సన్ పిక్చర్స్ ప్రొడక్షన్లో…
విశాఖపట్నంలో విద్యార్థులు చెలరేగిపోయారు. ప్రేమ వ్యవహారంలో రెండు గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాడ్లు పట్టుకొని రోడ్డెక్కారు. సినిమా తరహాలో నడి…