తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్పై సటైర్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో.. అంటూ.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని.. దీనిని ముందే పసిగట్టి తనయుడు కేటీఆర్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు.. హస్తినాపురం చుట్టూ ప్రదక్షిణలు చుట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. వాటిని కాపాడుకునేందుకు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, పత్రికల్లో, మీడియాలో కూడా అవి రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని దుయ్యబట్టారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని రేవంత్ విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న మోడీ… లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు వదిలేశారని.. దీనిని బట్టి బీజేపీకి బీటీంగా బీఆర్ ఎస్ ఉందంటే తప్పెలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు.
తెలంగాణపై మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో సోమవారం చేపట్టిన జాతీయ…
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బీజేపీని మరింత బలోపేతం చేసుకునేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నం చేస్తున్నారా? ప్రాంతీయ పార్టీల…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పురోగతిపై సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆసక్తి కనబరిచారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి…
మాస్ మహారాజా రవితేజ లైనప్ అభిమానుల అంచనాలకు తగ్గట్టు చక్కగా కనిపిస్తోంది. వరస డిజాస్టర్ల సంగతి పక్కనపెడితే ఇరుముడి మీద…
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో నిర్వహించిన…
జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…