తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్పై సటైర్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో.. అంటూ.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని.. దీనిని ముందే పసిగట్టి తనయుడు కేటీఆర్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు.. హస్తినాపురం చుట్టూ ప్రదక్షిణలు చుట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. వాటిని కాపాడుకునేందుకు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, పత్రికల్లో, మీడియాలో కూడా అవి రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని దుయ్యబట్టారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని రేవంత్ విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న మోడీ… లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు వదిలేశారని.. దీనిని బట్టి బీజేపీకి బీటీంగా బీఆర్ ఎస్ ఉందంటే తప్పెలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు.
This post was last modified on June 29, 2023 4:10 pm
ఎప్స్టీన్ ఫైల్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న మాట. ఎప్స్టీన్ అనే అమెరికన్ వ్యాపారవేత్త.. తాను ఇచ్చే ప్రైవేట్ పార్టీలకు ఎంతోమంది…
తెలంగాణలో జరుగుతున్న మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు వీలుగా అధికార కాంగ్రెస్ పార్టీ కొన్ని కమిటీలను నియమించింది. మరో…
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
సినీ రంగంలోకి కాస్త పేరు తెచ్చుకున్న ఎవ్వరైనా.. మళ్లీ జన్మంటూ ఉంటే ఇలా పుట్టాలని కోరుకోను అన్నారంటే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…