తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్పై సటైర్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో.. అంటూ.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని.. దీనిని ముందే పసిగట్టి తనయుడు కేటీఆర్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు.. హస్తినాపురం చుట్టూ ప్రదక్షిణలు చుట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. వాటిని కాపాడుకునేందుకు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, పత్రికల్లో, మీడియాలో కూడా అవి రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని దుయ్యబట్టారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ను ఎవరూ నమ్మరని రేవంత్ విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్పై విచారణ జరిపిస్తున్న మోడీ… లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ను ఎందుకు వదిలేశారని.. దీనిని బట్టి బీజేపీకి బీటీంగా బీఆర్ ఎస్ ఉందంటే తప్పెలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు.
This post was last modified on June 29, 2023 4:10 pm
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు.. సత్తా చాటుకున్నారు. సాధారణ అభివృద్ధి పనులతో పాటు.. ఎవరూ ఊహించని…
నిన్న విడుదలైన బైకర్ కు పబ్లిక్ టాక్, రివ్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. సినిమా చూస్తే నిరాశపడరనే అభిప్రాయం అధిక…
నిన్న విడుదలైన రాకాస, బైకర్ రెండు సినిమాలకు నెగటివ్ రెస్పాన్స్ రాలేదు. అత్యద్భుతంగా ఉన్నాయని కాదు కానీ ఒకసారి చూడొచ్చనే…
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా ఉన్న రాయపాటి శైలజ త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేయనున్నారా? అంటే…
ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్, ఐపీఎస్ అధికారి.. ప్రస్తుతం సస్పెన్షన్లో ఉన్న సునీల్కు రఘురామకు…
టీడీపీలో నాయకులు.. చంద్రబాబు కనుసన్నల్లోనే మెలుగుతున్నారా? ఆయన చెప్పినట్టే చేస్తున్నారా? అంటే.. మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా…