తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి పడేస్తారో.. అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జితేందర్ రెడ్డి చేసిన ఓ పోస్టు మరింత కలకలం రేపింది. దున్నపోతు తోక గట్టిగా లాగి.. డొక్కలో తన్ని మరీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. ఈట్వీట్ను ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరో నేత బీఎల్ సంతోష్, బన్సాలీలకు ట్యాగ్ చేశారు.
అయితే.. దీనిని జితేందర్ రెడ్డి కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు. కానీ, అది అప్పటికే జోరుగా వైరల్ అయిపోయింది. దీంతో తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతలుగా ఎవరున్నారో.. వారు సరిగా పనిచేయడం లేదని.. వారిని సరైన దారిలో పెట్టాలనే అర్ధం వచ్చేలా జితేందర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులు సరైన దారిలో లేరని, వారిని దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పెట్టి ట్వీట్ కాకరేపుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…