తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి పడేస్తారో.. అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జితేందర్ రెడ్డి చేసిన ఓ పోస్టు మరింత కలకలం రేపింది. దున్నపోతు తోక గట్టిగా లాగి.. డొక్కలో తన్ని మరీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. ఈట్వీట్ను ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరో నేత బీఎల్ సంతోష్, బన్సాలీలకు ట్యాగ్ చేశారు.
అయితే.. దీనిని జితేందర్ రెడ్డి కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు. కానీ, అది అప్పటికే జోరుగా వైరల్ అయిపోయింది. దీంతో తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతలుగా ఎవరున్నారో.. వారు సరిగా పనిచేయడం లేదని.. వారిని సరైన దారిలో పెట్టాలనే అర్ధం వచ్చేలా జితేందర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులు సరైన దారిలో లేరని, వారిని దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పెట్టి ట్వీట్ కాకరేపుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. బీజేపీకి జనసేనతో…
అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాకా సినిమా మేజర్ షెడ్యూల్ ఈ జూన్ మధ్యలో ప్రారంభం కాబోతున్నట్లు…
ఒకప్పుడు ఎంత పెద్ద సినిమా వచ్చినా.. దానికి ఎంత క్రేజున్నా, దాని బడ్జెట్ ఎంత అయినా సరే.. ప్రభుత్వం నిర్ణయించిన…
కరుప్పు / వీరభద్రుడు ఇచ్చిన సక్సెస్ కిక్కుతో సూర్య మాములు ఆనందంలో లేడు. పదమూడేళ్ళగా తన హయ్యెస్ట్ కలెక్షన్ దాటలేని…
తెలంగాణ ఎవరి అయ్య జాగీరు కాదు అంటూ జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నేతలు తెలంగాణ వ్యతిరేకిగా…