తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి పడేస్తారో.. అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జితేందర్ రెడ్డి చేసిన ఓ పోస్టు మరింత కలకలం రేపింది. దున్నపోతు తోక గట్టిగా లాగి.. డొక్కలో తన్ని మరీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. ఈట్వీట్ను ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరో నేత బీఎల్ సంతోష్, బన్సాలీలకు ట్యాగ్ చేశారు.
అయితే.. దీనిని జితేందర్ రెడ్డి కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు. కానీ, అది అప్పటికే జోరుగా వైరల్ అయిపోయింది. దీంతో తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతలుగా ఎవరున్నారో.. వారు సరిగా పనిచేయడం లేదని.. వారిని సరైన దారిలో పెట్టాలనే అర్ధం వచ్చేలా జితేందర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులు సరైన దారిలో లేరని, వారిని దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పెట్టి ట్వీట్ కాకరేపుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్పై.. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భగ్గుమన్నారు. పవన్ కల్యాణ్ కాదు.. దిష్టి…
ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…
తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగంపై ప్రస్తుతం సీబీఐ విచారణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్ను కూడా నెల్లూరు…
డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…
వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…