తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి పడేస్తారో.. అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జితేందర్ రెడ్డి చేసిన ఓ పోస్టు మరింత కలకలం రేపింది. దున్నపోతు తోక గట్టిగా లాగి.. డొక్కలో తన్ని మరీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్మెంట్ అవసరమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. ఈట్వీట్ను ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరో నేత బీఎల్ సంతోష్, బన్సాలీలకు ట్యాగ్ చేశారు.
అయితే.. దీనిని జితేందర్ రెడ్డి కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు. కానీ, అది అప్పటికే జోరుగా వైరల్ అయిపోయింది. దీంతో తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతలుగా ఎవరున్నారో.. వారు సరిగా పనిచేయడం లేదని.. వారిని సరైన దారిలో పెట్టాలనే అర్ధం వచ్చేలా జితేందర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులు సరైన దారిలో లేరని, వారిని దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పెట్టి ట్వీట్ కాకరేపుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…