Political News

ఎల‌క్ష‌న్ ఎఫెక్ట్‌: ఔట‌ర్ రింగ్ రోడ్డు చుట్టూ.. రైలు ప్రాజెక్ట్

మ‌రికొన్ని నెల్ల‌లోనే ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో తెలంగాణ‌పై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. హైద‌రాబాద్‌లోని ఔట‌ర్ రింగ్ రోడ్ చుట్టూ.. కొత్త‌గా రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్ప‌టికే మెట్రో రైలుప్రాజెక్టును వివిధ ద‌శ‌ల్లో పెంచుతున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా  రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కేంద్రం ప‌చ్చ జెండా ఊపింది. ఈ విష‌యాన్ని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

రైలు రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ఆయ‌న పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే శాఖ 14 వేల కోట్ల రూపాయ‌లు కేటాయించిందని కిష‌న్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కార‌ణంగా హైద‌రాబాద్ పేరు మ‌రింత పెరుగుతుంద‌ని.. అభివృద్దిలో దూసుకుపోతుంద‌ని కేంద్ర మంత్రి వివ‌రించారు. రైలుతో అనుసంధానం కానీ, అనేక ప్రాంతాల‌కు ఈ ప్రాజెక్టు క‌లిసి వ‌స్తుంద‌న్నారు.

మొత్తం 26 వేల కోట్ల రూపాయ‌ల వ్య‌యం అంచ‌నాతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించ‌నున్న‌ట్టు  కిషన్ రెడ్డి చెప్పారు.  భూసేకరణకు సంబంధించి స‌గం  ఖర్చు కేంద్రమే భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం వెచ్చించాల‌ని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివ‌రాల‌ను ఇప్ప‌టికే రాష్ట్ర స‌ర్కారుకు చేర‌వేసిన‌ట్టు ఆయ‌న తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా సానుకూలంగా స్పందించింద‌ని చెప్పారు. రైలు ప్రాజెక్టుకు భూసేకరణ కోసం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని వెల్ల‌డించారు.

రైలు రింగ్ ప్రాజెక్టు రూట్ మ్యాప్‌పై 99 శాతం ఆమోదం లభించిందని కిష‌న్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.  రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ సర్వే చేస్తున్నారని, ఈ ప్రాజెక్టులో ఉత్తర భా­గా­నికి సంబంధించి భూసేకరణ, సర్వే ప్రక్రియ పూ­ర్తైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వ‌ని రైతుల‌కు సంబంధించిన ప్రాంతాల‌ను ప‌క్క‌న పెట్టి(సంగారెడ్డి, రాయగిరి) మిగతా చోట్ల  సర్వే పూర్తి చేశారు.  

This post was last modified on June 29, 2023 8:11 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

49 minutes ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

1 hour ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

4 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

6 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

6 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

6 hours ago