మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ.. కొత్తగా రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మెట్రో రైలుప్రాజెక్టును వివిధ దశల్లో పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రైలు రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే శాఖ 14 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ పేరు మరింత పెరుగుతుందని.. అభివృద్దిలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి వివరించారు. రైలుతో అనుసంధానం కానీ, అనేక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు కలిసి వస్తుందన్నారు.
మొత్తం 26 వేల కోట్ల రూపాయల వ్యయం అంచనాతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. భూసేకరణకు సంబంధించి సగం ఖర్చు కేంద్రమే భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే రాష్ట్ర సర్కారుకు చేరవేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. రైలు ప్రాజెక్టుకు భూసేకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
రైలు రింగ్ ప్రాజెక్టు రూట్ మ్యాప్పై 99 శాతం ఆమోదం లభించిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ సర్వే చేస్తున్నారని, ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ, సర్వే ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వని రైతులకు సంబంధించిన ప్రాంతాలను పక్కన పెట్టి(సంగారెడ్డి, రాయగిరి) మిగతా చోట్ల సర్వే పూర్తి చేశారు.
This post was last modified on June 29, 2023 8:11 am
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఒకే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. రెండు సభల్లోనూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏపీలో…
అసలే జనం… పిచ్చ క్లారిటీతో ఉన్నారు. వారికి గూగుల్ తల్లి రౌండ్ ద క్లాక్ అందుబాటులోనే ఉంటోంది. ఇట్టా అనుమానం…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం ప్రత్యేకంగా భేటీ అయ్యారు.…
శతచిత్రాలకు నాగార్జున దగ్గరగా ఉన్నారు. కౌంట్ పరంగా కుబేరనే వందో సినిమా అంటున్నారు కానీ క్యామియోలు, స్పెషల్ రోల్స్, కొన్ని…
ఇటీవలే విడుదలైన దిల్ రుబా కిరణ్ అబ్బవరంకు పెద్ద షాకే ఇచ్చింది. ముందు రోజు సాయంత్రం ప్రీమియర్ షో నుంచే…
ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో కొనసాగుతున్న కూటమి ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సాయంత్రం…