మరికొన్ని నెల్లలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. హైదరాబాద్లోని ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ.. కొత్తగా రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మెట్రో రైలుప్రాజెక్టును వివిధ దశల్లో పెంచుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా రింగ్ రోడ్ చుట్టూ ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ విషయాన్ని సికింద్రాబాద్ ఎంపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
రైలు రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు దేశంలోనే తొలి ప్రాజెక్టుగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు సర్వే కోసం రైల్వే శాఖ 14 వేల కోట్ల రూపాయలు కేటాయించిందని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కారణంగా హైదరాబాద్ పేరు మరింత పెరుగుతుందని.. అభివృద్దిలో దూసుకుపోతుందని కేంద్ర మంత్రి వివరించారు. రైలుతో అనుసంధానం కానీ, అనేక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు కలిసి వస్తుందన్నారు.
మొత్తం 26 వేల కోట్ల రూపాయల వ్యయం అంచనాతో ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించనున్నట్టు కిషన్ రెడ్డి చెప్పారు. భూసేకరణకు సంబంధించి సగం ఖర్చు కేంద్రమే భరిస్తుందని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించాలని అన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను ఇప్పటికే రాష్ట్ర సర్కారుకు చేరవేసినట్టు ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. రైలు ప్రాజెక్టుకు భూసేకరణ కోసం కేసీఆర్ ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించిందని వెల్లడించారు.
రైలు రింగ్ ప్రాజెక్టు రూట్ మ్యాప్పై 99 శాతం ఆమోదం లభించిందని కిషన్ రెడ్డి చెప్పారు. ఎంఎంటీఎస్ రెండో దశలో ఔటరి రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. రీజినల్ రింగ్ రోడ్ కు సంబంధించి భూ సేకరణ సర్వే చేస్తున్నారని, ఈ ప్రాజెక్టులో ఉత్తర భాగానికి సంబంధించి భూసేకరణ, సర్వే ప్రక్రియ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు భూములు ఇవ్వని రైతులకు సంబంధించిన ప్రాంతాలను పక్కన పెట్టి(సంగారెడ్డి, రాయగిరి) మిగతా చోట్ల సర్వే పూర్తి చేశారు.
This post was last modified on June 29, 2023 8:11 am
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…