ఓపక్క కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం కిందా మీదా పడుతున్న వేళ.. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పడతాయన్న అంచాలున్న వేళ.. అందరిని సర్ ప్రైజ్ చేస్తూ.. దీనికి వ్యాక్సిన్ వచ్చిందంటూ రష్యా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. తాను నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మొదలు.. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన వివరాలు ప్రపంచానికి పెద్దగా షేర్ చేసుకోకపోవటమే కారణం.
మరి.. ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంత? అదెలా పని చేసే అవకాశం ఉంది? అసలు దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? వ్యాక్సిన్ పై ఎలాంటి సమాచారం బయటకు రాని నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలపై శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలుగా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ -19కు చెక్ చెప్పేలా రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తే ప్రజలు లక్కీనేనని పేర్కొన్నారు. అయితే.. దీని సమర్థత.. భద్రత గురించి ఇంకా ఏమీ తెలీదన్నారు. క్లినికల్ ట్రయల్స్ ను రష్యా సంపూర్ణంగా నిర్వహించలేదన్న ఆయన.. టీకా తయారీలో మూడో దశ ట్రయల్స్ ఎంతో కీలకమన్నారు. ఎందుకంటే.. ఆ దశలో టీకాను ఎక్కువ మందిపై ప్రయోగించి.. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో లేదో రెండు నెలలు ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు.
తనకున్న అవగాహన ప్రకారం రష్యా వ్యాక్సి్ న్ కు భారీగా పరీక్షలు చేసినట్లుగా కనిపించలేదన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే..సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. రష్యా తయారుచేసినట్లుగా చెబుతున్న వ్యాక్సిన్.. ఎంతమేరకు సురక్షితం అన్నది తెలీదని.. టీకా తయారీని వేగవంతంగా చేసేందుకు మాత్రం కొన్ని నెలలు ఆ దేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మొత్తంగా చూస్తే.. సామాన్యులకే కాదు.. శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వారిలోనూ రష్యా వ్యాక్సిన్ వివరాలపై పెద్దగా అవగాహన లేదని చెప్పక తప్పదు.
This post was last modified on August 13, 2020 12:21 pm
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…