Political News

త్రిమూర్తులతో బీజేపీ భారీ సభ ?

వచ్చేనెలలలో బీజేపీ భారీ బహిరంగసభకు ప్లాన్ చేస్తోంది. జూలై 8వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే బహిరంగసభలో త్రిమూర్తులు పాల్గొనబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. త్రిమూర్తులంటే నరేంద్రమోడీ, అమిత్ షా, జేపీ నడ్డాలే. ఇప్పటికే మోడీతో జరగాల్సిన  బహిరంగసభ వాయిదాపడింది. అలాగే మొన్నటి 15వ తేదీన ఖమ్మంలో అమిత్ షా ముఖ్యతిధిగా నిర్వహించాల్సిన బహిరంగసభ కూడా వాయిదాపడింది. అందుకనే వచ్చేనెల 8వ తేదీన హైదరాబాద్ లో పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశం జరగబోతోంది.

జూలై 8న ఇక్కడ జరగబోయే జాతీయ స్ధాయి సమావేశానికి 11 రాష్ట్రాల అధ్యక్షులు, ఇన్చార్జిలు, సంస్ధాగత కార్యదర్శులతో పాటు తెలంగాణా ఇన్చార్జిలంతా పాల్గొనబోతున్నారు. ఇంతభారీగా జరగబోతున్న జాతీయ స్ధాయి సమావేశం తర్వాత అంతే భారీస్ధాయిలో బహిరంగసభ కూడా నిర్వహించాలని తెలంగాణా పార్టీ సిద్ధమవుతోంది. ఇందుకు అమిత్ షా సానుకూలంగా స్పందించారట. దాంతో మోడీని కూడా తప్పకుండా రావాలని పార్టీ కోరుతున్నది. మోడీ వచ్చే విషయం ఇంకా ఖరారు కాకపోయినా ప్రధానమంత్రి కార్యాలయం మాత్రం ఏచిన్న అవకాశం దొరికినా మోడీ షెడ్యూల్ లో హైదరాబాద్ పర్యటనను చేరుస్తామని హామీ ఇచ్చిందట.

పీఎంవో హామీ ఇవ్వటమే కాకుండా డైరెక్టుగా అమిత్ షా కూడా ఇదే విషయాన్ని మోడీతో చెప్పినట్లు తెలంగాణా నేతలంటున్నారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మోడీని ఎలాగైనా హైదరాబాద్ కు రప్పించాలని అందరు కలిసే ప్లాన్ చేస్తున్నారు.

గ్రౌండ్ లెవల్ వ్యవహారాలను చూస్తే పార్టీ వీకైందన్నది వాస్తవం. కొత్తచేరికలు లేకపోగా ఉన్న నేతలు కూడా ఎంతోకాలం ఉండరని తొందరలోనే పార్టీని వదిలేయబోతున్నారనే ప్రచారం పెరిగిపోతోంది. ఇదే సమయంలో కాంరెస్ మంచి జోష్ మీదుంది. తాజాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు పార్టీలో చేరారు. వచ్చేనెలలో ఖమ్మం, మహబూబ్ నగర్లో భారీ బహిరంగసభలు నిర్వహించి మద్దతుదారుల సమక్షంలో పార్టీ కండువ కప్పుకోబోతున్నారు. ఒకవైపు కొత్త చేరికలు, ఘర్ వాపసీలతో కాంగ్రెస్ కళకళలాడుతుంటే బీజేపీ వెలాతెలా పోతోంది. అందుకనే కమలంపార్టీ నేతల్లో ఉత్సాహం నింపేందుకైనా మోడీ రావాల్సిందే అన్నట్లుగా పట్టుబట్టి ఏర్పాట్లు చేస్తున్నారు. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే. 

This post was last modified on June 28, 2023 9:12 am

Share
Show comments
Published by
Satya
Tags: BJPModi Govt

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago