Political News

వైసీపీలో డేంజ‌ర్ జోన్లో ఉన్న లీడ‌ర్లు వీళ్లే…

ఇటీవ‌ల ఏపీ సీఎం జ‌గ‌న్‌.. వైసీపీలో ప్ర‌జ‌ల‌కు చేరువ కాని నేత‌లు అంటూ.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో వైసీపీ చేప‌ట్టిన గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మం ద్వారా నాయ‌కులు ప్ర‌జ‌ల‌కు చేరువ కావాల‌నేది వైసీపీ ల‌క్ష్యం. దీంతో ప్ర‌జ‌ల‌కు, నేత‌ల‌కు మ‌ధ్య ఉన్నగ్యాప్ త‌గ్గుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు, ఈ క్ర‌మంలో నే గ‌డ‌ప‌గ‌డ‌ప కు కార్య‌క్ర‌మాన్ని సీఎం జ‌గ‌న్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మాన్ని ఈ ఏడాది ఆగ‌స్టు 31 వ‌ర‌కు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇప్పటికీ ఈ కార్య క్ర‌మం ప్రారంభించి ఏడాది అవుతోంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌తిమూడు మాసాల‌కు ఒక‌సారి ఈ కార్య‌క్ర‌మంపై సీఎం జ‌గ‌న్ ఆరాతీస్తున్నారు. ఐప్యాక్ టీం ఇస్తున్న నివేదిక‌ల‌ను కూడా ఆయ‌న ప‌రిశీలిస్తున్నారు. త‌ర‌చుగా ఎమ్మెల్యేల‌తో భేటీ అయినా.. గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మంపై ఆయ‌న స‌మీక్షిస్తున్నారు.

ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సార్లు ఎమ్మెల్యేల‌తో సీఎం జ‌గ‌న్ స‌మీక్ష నిర్వ‌హించారు. అయితే.. ఈ స‌మీక్ష లో ఎప్ప‌టిక‌ప్పుడు 20-25-18-15 అంటూ.. అసంతృప్త ఎమ్మెల్యేల సంఖ్య‌ను సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. వీరు ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం లేద‌ని, ప్ర‌జ‌ల్లో ఉండ‌డం లేద‌ని వివ‌రిస్తున్నారు. వీరికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు క‌ష్ట‌మేన‌ని కుండ‌బ‌ద్ద‌లు కొడుతున్నారు. గ‌తంలో అయితే.. ఎవ‌రెవ‌రు వెనుక‌బ‌డి ఉన్నార‌నేది సీఎం జ‌గ‌న్ పేర్లుతో చెప్పేవారు.

అయితే.. తాజాగా మాత్రం 15 మంది ఎమ్మెల్యేలు వెనుక‌బ‌డి ఉన్నార‌ని.. చెబుతూనే వారి పేర్ల‌ను మాత్రం బ‌హిరంగంగా చెప్ప‌బోన‌ని వ్యాఖ్యానించారు. అయితే.. ఇలా ఎందుకు గుట్టుగా ఉంచార‌నేది కూడా ఆస‌క్తిగా మారింది. దీనిని ప‌రిశీలిస్తే.. కీల‌క‌మైన నాయ‌కులే ఉన్నార‌నేది తాజాగా తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్న మాట‌. వీరిలో మాజీ మంత్రులు ముగ్గురు ఉన్నార‌ని.. వీరిలోనూ ఒక మ‌హిళా మాజీ మంత్రి ఉన్నార‌ని..అంటున్నారు.

అ దేవిధంగా రెడ్డి సామాజిక వ‌ర్గానికే చెందిన న‌లుగురు ఎమ్మెల్యేలు ఉన్నార‌ని, ఒక ఎస్టీ ఎమ్మెల్యే కూడా ఉన్నార‌ని.. ప్ర‌చారం జ‌రుగుతోంది. అందుకే వారి పేర్లు బ‌య‌ట‌కు చెప్ప‌లేద‌ని.. చెబితే.. పార్టీలో పెను ఉప్పెన ఖాయ‌మ‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నార‌ని అంటున్నారు. ఇదీ.. సంగతి!

This post was last modified on June 27, 2023 11:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

2 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

2 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

2 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

3 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

5 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

7 hours ago