Political News

అంతా హై కమాండే నడిపిస్తోందా ?

తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఒకపుడు ఇతర పార్టీల నుండి ఎవరైనా కాంగ్రెస్ లో చేరాలంటే వ్యవహారం అంతా దాదాపుగా హైదరాబాద్ లోనే జరిగిపోయేది. ఏదో లాంఛనంగా ఢిల్లీకి వెళ్ళి హైకమాండ్ ను కలిసొచ్చేవాళ్ళంతే. నిజానికి హైకమాండ్ దాకా వెళ్ళే నేతల సంఖ్య చాలా తక్కువగానే ఉండేది. ఎంతో ముఖ్యమైన నేతలు మాత్రమే ముందుగా హైకమాండుతో మాట్లాడుకుని ఢిల్లీలోనే పార్టీ కండువా కప్పుకునేవారు.

అలాంటిది ఇపుడు జరుగుతున్న వ్యవహారమంతా రివర్సులో నడుస్తోంది. ఎందుకంటే ఇపుడు కాంగ్రెస్ లో చేరుతున్న నేతల్లో అత్యధికులు ముందుగా కాంగ్రెస్ హైకమాండుతో మాట్లాడుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళను తర్వాత లాంఛనంగా మాత్రమే కలుస్తున్నారు. ఢిల్లీలోని హైకమాండుకు రాష్ట్రంలోని నేతలకు మధ్య సమన్వయకర్తగా కర్నాటక ఉపముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ వ్యవహరిస్తున్నారు.

పార్టీలోకి తాజాగా చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసులరెడ్డి, జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ ఎంఎల్సీ దామోదర్ రెడ్డి లాంటి వాళ్ళంతా ముందుగా డీకేతోనే మాట్లాడుకున్నారు. రాష్ట్ర నేతల్లో ఒకళ్ళతో మాట్లాడితే మరొకళ్ళకు కోపం వచేస్తోంది. రేవంత్ తో మాట్లాడితే రేవంత్ ఒక్కడేనా నేత తాము కాదా అంటు కొందరు సీనియర్లు అలుగుతున్నారు. దాంతో కాంగ్రెస్ లో చేరుదామని అనుకుంటున్న వాళ్ళకు ఇదో పెద్ద సమస్యగా మారింది.

అందుకనే కాంగ్రెస్ లోకి రాదలచుకున్న డైరెక్టుగా డీకేతోనే మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ డిమాండ్లు, హామీల చర్చలన్నీ బెంగుళూరు వేదికగానే జరుగుతున్నాయి. అంతా సెట్ అయ్యిందని అనుకున్న తర్వాత రేవంత్ తో పాటు ఇతర సీనియర్లను కూడా కలుస్తున్నారు. అంతా అయిపోయిందని అనుకున్న తర్వాత ముహూర్తంపెట్టుకుని ఢిల్లీకి వెళ్ళి రాహుల్, ప్రియాంక గాంధిల సమక్షంలో చేరుతున్నారు. తొందరలో పార్టీలో చేరుతున్నారనే ప్రచారంలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల, డీకే అరుణ, కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు కూడా హైకమాండ్ తోనే టచ్ లో ఉన్నారని సమాచారం. మొత్తానికి లోకల్ నేతల నోళ్ళు మూయించి హైకమాండ్ మొత్తం వ్యవహారాలను నడిపిస్తున్నట్లు అర్ధమైపోతోంది. 

This post was last modified on June 27, 2023 4:03 pm

Share
Show comments
Published by
Satya
Tags: Telangana

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

6 hours ago