Political News

జగన్ కు మోడీ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇదేనా?

అమరావతి రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఆర్ 5 జోన్ లో వేలాది ఇళ్ళ నిర్మాణాలకు వచ్చేనెలలో భూమిపూజ జరగబోతోంది. జూలై 8వ తేదీన జగన్మోహన్ రెడ్డి ముహూర్తం నిర్ణయించినట్లు సమాచారం. ఆర్ 5 జోన్ లో ఏకకాలంలో 47 వేల ఇళ్ళ నిర్మాణాలకు ప్రభుత్వం రెడీ అవుతోంది. 47 వేల ఇళ్ళనిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వం నుండి ప్రతిపాదన అందగానే కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఇళ్ళనిర్మాణ పథకంలో వేలాది ఇళ్ళను నిర్మించాలని జగన్ అనుకున్నారు.

ఇందుకు అనుగుణంగానే ఈమధ్యనే జగన్ వేలాదిమందికి ఇళ్ళపట్టాల పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఈ పట్టాల్లో ఇళ్ళు నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని, ఇళ్ళను మంజూరు చేయాలని రాష్ట్రప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అనుమతి ఇంత వేగంగా వస్తుందని వైసీపీ నేతలు కూడా అనుకోలేదు.  ఇదే విషయమై సోమవారం సమావేశమైన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇళ్ళపట్టాలపై న్యాయవివాదం ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇళ్ళపట్టాలు పంపిణీచేయవచ్చు కానీ అది అంతిమ తీర్పుకు లోబడే ఉండాలని హైకోర్టు స్పష్టంగా ఆదేశించింది. ఇలాంటి న్యాయ చిక్కులు ఉన్నపుడు సాధారణంగా అనుమతులు రావు. కానీ కేంద్రం అనుమతి ఇచ్చేసింది.

అయితే ఇళ్ళపట్టాల పంపిణీకి ఓకేనే కానీ ఏకంగా వేలాది ఇళ్ళు కూడా కట్టేస్తే ఎలాగన్నదే అసలు సమస్య. అంతిమతీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తే అప్పుడు కట్టేసిన ఇళ్ళ విషయంలో ప్రభుత్వమైనా, కోర్టయినా ఏమి చేయగలుగుతుంది. ఇళ్ళనిర్మాణాలకు కేంద్రప్రభుత్వం ఒక్కో ఇంటికి రు. 1.5 లక్షల రూపాయలిస్తోంది. ఇదికాకుండా రాష్ట్రప్రభుత్వం షేర్ రు. 30 వేలుంటుంది. కేంద్రం షేర్ నే తీసుకుంటే 47 వేల ఇళ్ళకు 1.5 లక్షల చొప్పున 705 కోట్లు వృధా అవుతుందనటంలో సందేహంలేదు.

వ్యవహారం న్యాయస్ధానం పరిధిలో ఉన్నా కేంద్రం రు. 705 కోట్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడు ఇళ్ళు కట్టేసిన తర్వాత కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే కట్టేసిన ఇళ్ళను కేంద్రం లేదా రాష్ట్రప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటాయా ? అన్నదే అసలు పాయింట్. మొదటి విడతలో 47 వేల ఇళ్ళకు రెండో విడతలో మరో 4 వేల ఇళ్ళ నిర్మాణాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయటమే ఆశ్చర్యంగా ఉంది. 

This post was last modified on June 27, 2023 12:58 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

ఏపీలో ఆ జిల్లాల‌కు ఒక క‌లెక్ట‌ర్‌-ముగ్గురు ఎస్పీలు !

ఏపీలో ఎన్నిక‌ల పోలింగ్ అనంత‌రం చెల‌రేగిన హింసాత్మ‌క ఘ‌ట‌న‌ల‌ను నిలువ‌రించ‌లేక పోయిన‌.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా క‌లెక్ట‌రు, ముగ్గురు ఎస్పీలు) వేటు…

11 hours ago

మహేష్ బాబు కోసం వరదరాజ మన్నార్ ?

ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…

12 hours ago

లండ‌న్‌లో జ‌గ‌న్… ఫ‌స్ట్ లుక్ ఇదే!

ఏపీ సీఎం జ‌గ‌న్ కుటుంబ స‌మేతంగా విహార యాత్ర‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. స‌తీమ‌ణి వైఎస్ భార‌తి, కుమార్తెలు హ‌ర్ష‌,…

13 hours ago

నమ్మశక్యం కాని రీతిలో కంగువ యుద్ధం

మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…

14 hours ago

మిరల్ రిపోర్ట్ ఏంటి

నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…

18 hours ago

త్రివిక్రమ్ కోసం స్రవంతి ప్రయత్నాలు

గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…

20 hours ago