Political News

ఎంపీ ఎఫెక్ట్‌: విశాఖ‌లో వైసీపీకి మైన‌స్ నిజ‌మేనా ?

వైసీపీ కీల‌క‌నాయ‌కుడు.. తొలిసారి ఎంపీ అయిన‌.. విశాఖ పార్ల‌మెంటు స‌భ్యుడు ఎంవీవీ స‌త్యానారాయ‌ణ కుటుంబం, ఆయ‌న స్నేహితుడు కిడ్నాప్ అయిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్య‌వ‌హారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ సాగుతోంది. అయితే.. ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. వైసీపీపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే సెప్టెంబ‌రు నాటికి.. సీఎం జ‌గ‌న్ త‌న నివాసాన్ని(కాపురం) విశాఖ‌కు మార్చుకుంటాన‌ని.. గ‌తంలోనే చెప్పారు. అదేవిధంగా పాల‌న‌ను కూడా విశాఖ నుంచే నిర్వ‌హిస్తాన‌న్నారు. అయితే.. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న కిడ్నాప్ క‌థ‌.. జిల్లా వాసుల‌ను వ‌ణికిస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇసుక మ‌ట్టిభూముల విష‌య‌లో వైసీపీ నేత‌ల ఆగ‌డాలు పెరిగాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. దీనికితోడు.. ఎంపీ స్వ‌యంగా.. త‌న వ్యాపారాల‌ను హైద‌రాబాద్‌కుత ర‌లిస్తాన‌ని వెల్ల‌డించారు. దీంతో వైసీపీ ఉంటే.. ఇక్క‌డ అరాచ‌కం పెరుగుతుంద‌ని.. కొంద‌రు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు కానీ.. దీనిని ప్ర‌శాంతంగా ఉంచాల‌ని వారు కోరుతున్నారు.

అయితే.. ఈ విష‌యంలో విశాఖ‌కు చెందిన వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు. నిత్యం మీడియాకు ట‌చ్‌లో ఉండే మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నుంచి ఇత‌ర నేత‌ల దాకా ఎవ‌రూ కూడా స్పం దించ‌లేదు. దీనికి తోడు ఎంపీ విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది ప్ర‌భుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. దీంతో విశాఖ విష‌యంలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం వంటి వాటిపై అంత‌ర్మ‌థ‌నం చెందుతోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి విశాఖ‌లో అయితే..వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌నేది విశ్లేష‌కుల మాట‌.

This post was last modified on June 27, 2023 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్ర‌బాబు నిర్ణ‌యమే.. తెలంగాణ‌కు ఊపిరా?!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు కేంద్రం చేసిన ప్ర‌తిపాద‌న తీవ్ర సంక‌ట స్థితిలోకి నెట్టేసింది. పాల‌మూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమ‌తి ఇవ్వాలంటూ.. కేంద్ర…

4 hours ago

ఏపీలో ఎన్నికల కోలాహ‌లం.. ఎప్పుడైనా?!

దాదాపు రెండేళ్ల త‌ర్వాత‌.. ఏపీలో మ‌రోసారి ఎన్నిక‌ల‌కు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయ‌తీ స‌హా.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు…

6 hours ago

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

13 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

14 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

14 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

16 hours ago