వైసీపీ కీలకనాయకుడు.. తొలిసారి ఎంపీ అయిన.. విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యానారాయణ కుటుంబం, ఆయన స్నేహితుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. అయితే.. ఈ పరిణామం తర్వాత.. వైసీపీపై ప్రభావం పడుతోందని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే సెప్టెంబరు నాటికి.. సీఎం జగన్ తన నివాసాన్ని(కాపురం) విశాఖకు మార్చుకుంటానని.. గతంలోనే చెప్పారు. అదేవిధంగా పాలనను కూడా విశాఖ నుంచే నిర్వహిస్తానన్నారు. అయితే.. ఇది జరిగిన తర్వాత.. చోటు చేసుకున్న కిడ్నాప్ కథ.. జిల్లా వాసులను వణికిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మట్టిభూముల విషయలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.
ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. దీనికితోడు.. ఎంపీ స్వయంగా.. తన వ్యాపారాలను హైదరాబాద్కుత రలిస్తానని వెల్లడించారు. దీంతో వైసీపీ ఉంటే.. ఇక్కడ అరాచకం పెరుగుతుందని.. కొందరు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ప్రజల మధ్య కూడా చర్చకు వస్తోంది. విశాఖను రాజధానిగా చేయకపోయినా.. ఫర్వాలేదు కానీ.. దీనిని ప్రశాంతంగా ఉంచాలని వారు కోరుతున్నారు.
అయితే.. ఈ విషయంలో విశాఖకు చెందిన వైసీపీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. నిత్యం మీడియాకు టచ్లో ఉండే మంత్రి గుడివాడ అమర్నాథ్ నుంచి ఇతర నేతల దాకా ఎవరూ కూడా స్పం దించలేదు. దీనికి తోడు ఎంపీ విషయంలో ఏం జరిగిందనేది ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. దీంతో విశాఖ విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతోందా? ఇక్కడ జరుగుతున్న పరిణామాలు.. ప్రజల ఆలోచనా విధానం వంటి వాటిపై అంతర్మథనం చెందుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి విశాఖలో అయితే..వైసీపీ గ్రాఫ్ పడిపోయిందనేది విశ్లేషకుల మాట.
This post was last modified on June 27, 2023 12:33 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…