వైసీపీ కీలకనాయకుడు.. తొలిసారి ఎంపీ అయిన.. విశాఖ పార్లమెంటు సభ్యుడు ఎంవీవీ సత్యానారాయణ కుటుంబం, ఆయన స్నేహితుడు కిడ్నాప్ అయిన విషయం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్యవహారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దీనిపై విచారణ సాగుతోంది. అయితే.. ఈ పరిణామం తర్వాత.. వైసీపీపై ప్రభావం పడుతోందని అంటున్నారు పరిశీలకులు.
వచ్చే సెప్టెంబరు నాటికి.. సీఎం జగన్ తన నివాసాన్ని(కాపురం) విశాఖకు మార్చుకుంటానని.. గతంలోనే చెప్పారు. అదేవిధంగా పాలనను కూడా విశాఖ నుంచే నిర్వహిస్తానన్నారు. అయితే.. ఇది జరిగిన తర్వాత.. చోటు చేసుకున్న కిడ్నాప్ కథ.. జిల్లా వాసులను వణికిస్తోంది. ఎందుకంటే.. ఇప్పటికే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. ఇసుక మట్టిభూముల విషయలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగాయని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.
ఇటీవల బీజేపీ అగ్రనేత అమిత్ షా కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. ఇక, ఇప్పుడు ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. దీనికితోడు.. ఎంపీ స్వయంగా.. తన వ్యాపారాలను హైదరాబాద్కుత రలిస్తానని వెల్లడించారు. దీంతో వైసీపీ ఉంటే.. ఇక్కడ అరాచకం పెరుగుతుందని.. కొందరు ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విషయంపై ప్రజల మధ్య కూడా చర్చకు వస్తోంది. విశాఖను రాజధానిగా చేయకపోయినా.. ఫర్వాలేదు కానీ.. దీనిని ప్రశాంతంగా ఉంచాలని వారు కోరుతున్నారు.
అయితే.. ఈ విషయంలో విశాఖకు చెందిన వైసీపీ నాయకులు ఇప్పటి వరకు నోరు మెదపలేదు. నిత్యం మీడియాకు టచ్లో ఉండే మంత్రి గుడివాడ అమర్నాథ్ నుంచి ఇతర నేతల దాకా ఎవరూ కూడా స్పం దించలేదు. దీనికి తోడు ఎంపీ విషయంలో ఏం జరిగిందనేది ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. దీంతో విశాఖ విషయంలో వైసీపీ తర్జన భర్జన పడుతోందా? ఇక్కడ జరుగుతున్న పరిణామాలు.. ప్రజల ఆలోచనా విధానం వంటి వాటిపై అంతర్మథనం చెందుతోందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. మొత్తానికి విశాఖలో అయితే..వైసీపీ గ్రాఫ్ పడిపోయిందనేది విశ్లేషకుల మాట.
This post was last modified on June 27, 2023 12:33 pm
ప్రస్తుతం మంచి ఊపులో షూటింగ్ జరుపుకుంటున్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని మూవీలో ముందు తీసుకున్న హీరోయిన్ నయనతార. ఇది…
స్కూల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన, పరీక్షలు రాయాల్సిన వయసులో ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అనే కుర్రాడు ఎలా చెలరేగిపోతున్నాడో చూస్తున్నాం. సినీ…
టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఏప్రిల్ అంటే చాలా స్పెషల్. ఎందుకంటే చరిత్రలో చెప్పుకోదగిన ఎన్నో బ్లాక్ బస్టర్లు ఈ నెలలోనే…
కొన్ని కథలు ముగిసిపోవడాన్ని ప్రేక్షకులు అంతగా ఇష్టపడరు. వాటికి కొనసాగింపు ఉంటేనే బాగుంటుందని ఆశిస్తారు. వాటి మేకర్స్ కూడా ఆ…
నిందితులను పోలీసులు పబ్లిక్లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన…
దేవర పార్ట్ 2 ఉంటుందో లేదోననే అనుమానాలు ఇంకా కొనసాగుతుండగానే దర్శకుడు కొరటాల శివ బాలకృష్ణతో ఒక ప్రాజెక్టు లాక్…