Political News

ఎంపీ ఎఫెక్ట్‌: విశాఖ‌లో వైసీపీకి మైన‌స్ నిజ‌మేనా ?

వైసీపీ కీల‌క‌నాయ‌కుడు.. తొలిసారి ఎంపీ అయిన‌.. విశాఖ పార్ల‌మెంటు స‌భ్యుడు ఎంవీవీ స‌త్యానారాయ‌ణ కుటుంబం, ఆయ‌న స్నేహితుడు కిడ్నాప్ అయిన విష‌యం తెలిసిందే. మూడు రోజుల పాటు సాగిన ఈ వ్య‌వ‌హారం.. రెండు తెలుగు రాష్ట్రాల్లోనేకాకుండా.. దేశ‌వ్యాప్తంగా కూడా సంచ‌ల‌నం సృష్టించింది. అయితే. . మొత్తానికి పోలీసులునిందితుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్ర‌స్తుతం దీనిపై విచార‌ణ సాగుతోంది. అయితే.. ఈ ప‌రిణామం త‌ర్వాత‌.. వైసీపీపై ప్ర‌భావం ప‌డుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వ‌చ్చే సెప్టెంబ‌రు నాటికి.. సీఎం జ‌గ‌న్ త‌న నివాసాన్ని(కాపురం) విశాఖ‌కు మార్చుకుంటాన‌ని.. గ‌తంలోనే చెప్పారు. అదేవిధంగా పాల‌న‌ను కూడా విశాఖ నుంచే నిర్వ‌హిస్తాన‌న్నారు. అయితే.. ఇది జ‌రిగిన త‌ర్వాత‌.. చోటు చేసుకున్న కిడ్నాప్ క‌థ‌.. జిల్లా వాసుల‌ను వ‌ణికిస్తోంది. ఎందుకంటే.. ఇప్ప‌టికే కొన్ని ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. ఇసుక మ‌ట్టిభూముల విష‌య‌లో వైసీపీ నేత‌ల ఆగ‌డాలు పెరిగాయ‌ని ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు.

ఇటీవ‌ల బీజేపీ అగ్ర‌నేత అమిత్ షా కూడా ఇదే విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇక‌, ఇప్పుడు ఎంపీ కుటుంబం కిడ్నాప్ అయింది. దీనికితోడు.. ఎంపీ స్వ‌యంగా.. త‌న వ్యాపారాల‌ను హైద‌రాబాద్‌కుత ర‌లిస్తాన‌ని వెల్ల‌డించారు. దీంతో వైసీపీ ఉంటే.. ఇక్క‌డ అరాచ‌కం పెరుగుతుంద‌ని.. కొంద‌రు ప్ర‌తిప‌క్ష నాయ‌కులు చెబుతున్నారు. ఇప్పుడు ఇదే విష‌యంపై ప్ర‌జ‌ల మ‌ధ్య కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది. విశాఖ‌ను రాజ‌ధానిగా చేయ‌క‌పోయినా.. ఫ‌ర్వాలేదు కానీ.. దీనిని ప్ర‌శాంతంగా ఉంచాల‌ని వారు కోరుతున్నారు.

అయితే.. ఈ విష‌యంలో విశాఖ‌కు చెందిన వైసీపీ నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు నోరు మెద‌ప‌లేదు. నిత్యం మీడియాకు ట‌చ్‌లో ఉండే మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ నుంచి ఇత‌ర నేత‌ల దాకా ఎవ‌రూ కూడా స్పం దించ‌లేదు. దీనికి తోడు ఎంపీ విష‌యంలో ఏం జ‌రిగింద‌నేది ప్ర‌భుత్వం నుంచి కూడా క్లారిటీ లేదు. దీంతో విశాఖ విష‌యంలో వైసీపీ త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతోందా? ఇక్క‌డ జ‌రుగుతున్న ప‌రిణామాలు.. ప్ర‌జ‌ల ఆలోచ‌నా విధానం వంటి వాటిపై అంత‌ర్మ‌థ‌నం చెందుతోందా? అంటే ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి విశాఖ‌లో అయితే..వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌నేది విశ్లేష‌కుల మాట‌.

This post was last modified on June 27, 2023 12:33 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…

2 hours ago

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

4 hours ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

7 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

8 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

9 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

9 hours ago