Political News

టీడీపీ కొత్త వ్యూహం.. త్వ‌ర‌లోనే మ‌రో కార్య‌క్ర‌మం..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇటీవ‌ల కాలంలో ప‌లుకార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతున్న విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చి అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా ఆయ‌న ముందుకు సాగుతున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్నారు. అదేవిధంగా ఇదేం ఖ‌ర్మ రాష్ట్రానికి కార్య‌క్ర‌మాన్ని కూడా ముందుకు తీసుకువెళ్తున్నారు. మొత్తంగా వైసీపీ ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు. తాజాగా మ‌రో కార్య‌క్ర‌మంతో చంద్ర‌బాబు ముందుకు వ‌చ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్  వేదికగా ఈ వినూత్న కార్య‌క్ర‌మానికి సంబంధించిన‌ ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు ..  రానున్న రోజుల్లో గల్లీ నుండి పట్టణాల వరకు ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, వైసీపీ నాయకుల  అక్రమాలను ఎత్తి చూపే విధంగా ఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలియచేయడం ఈ ‘నాలుగేళ్ల నరకం’ కార్యక్రమం  చేప‌ట్ట‌నున్న‌ట్టు తెలిపారు. దీనికి “రాష్ట్ర‌మా.. రావ‌ణ కాష్ట‌మా!“ అనే స‌బ్ టైటిల్ కూడా చెప్పారు. ఈ కార్య‌క్ర‌మాన్ని ఊరూవాడా ప్ర‌చారం చేస్తామ‌ని వివ‌రించారు.  

ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా  టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపడతారని చంద్రబాబు తెలిపారు. గత నాలుగేళ్లుగా వైసీపీ పాలనలో ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎత్తి చూపుతూ జనంలోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా ‘నాలుగేళ్ల నరకం’ రంగాల వారీగా జరిగిన అన్యాయాన్ని చెబుతూ.. నలభైఏళ్లు రాష్ట్రాన్ని వెనక్కి ఎలా నెట్టారో చూపిస్తామ‌న్నారు.  ప్రజల వద్దకు నేతలు ఆయా కార్య‌క్ర‌మాల‌ను తీసుకువెళతారని చంద్రబాబు తెలిపారు.  

Satya

Recent Posts

భారత్ బోర్డర్లో దొరికిన అమెరికా మాజీ సైనికుడు… పెద్ద కుట్రేనా?

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్‌బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…

2 hours ago

బహదూర్ పోరాటం ఎలా జరిగింది

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…

2 hours ago

వంద కోట్ల ఆస్తి… పీకే సంచలన అఫిడవిట్!

రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…

2 hours ago

కొడుకుల్ని గెలిపించాడు… నాన్న గెలవాలి

తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…

4 hours ago

కోహ్లీ, రోహిత్‌… అసలైన అగ్నిపరీక్ష

టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…

4 hours ago

చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టుకు కేంద్రం గుర్తింపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు క‌ల‌ల ప్రాజెక్టు.. విజ‌య‌న‌గ‌రం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి కేంద్ర ప్ర‌భుత్వం `ప్ర‌త్యేక‌`…

4 hours ago