Political News

న‌న్ను కొనాల‌ని చూస్తున్నారు.. :  ద‌స్త‌గిరి

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసుకు సంబంధించిన వ్య‌వ‌హారం మ‌లుపుల‌పై మలుపులు తిరుగుతోందా?  ఈ కేసులో ఇప్ప‌టికే సీబీఐ విచార‌ణ మంద‌గించేలా తెర‌వెనుక `కొన్ని శ‌క్తులు` ప్ర‌య‌త్నించాయ న్న టీడీపీ స‌హా విప‌క్షాల విమ‌ర్శ‌లు ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఇక‌, ఇంకేముంది.. క‌డ‌ప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేస్తామ‌ని ప్ర‌క‌టించిన సీబీఐ కూడా ఇప్పుడు ఆయ‌న‌ను ప్ర‌తి శ‌నివారం విచారించి.. ఊరుకుంటోంది. ఇలా అనేక ట్విస్టులు  ఈ కేసులో వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇదిలావుంటే.. ఇప్పుడు మ‌రో సంచ‌లన విష‌యం వెలుగు చూసింది.

వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారి, బెయిల్‌పై బ‌య‌ట ఉన్న అప్ప‌టి వివేకా డ్రైవ‌ర్ ద‌స్త‌గిరి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ మీడియా సంస్థ‌తో ఆయ‌న మాట్లాడుతూ..  వైసీపీ శ్రేణులు రాజీకి రమ్మని త‌న‌కు రాయబారాలు పంపుతున్నాయ‌ని బాంబు పేల్చాడు. త‌న‌ను కొనేందుకు `కొంద‌రు` ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని కూడా చెప్పాడు. ` పెద్దమనుషుల`తో రాజీ అయితే డబ్బులు కూడా ఇప్పిస్తామంటూ ప్రలోభ పెడుతున్నారి తెలిపాడు. తాను చావడానికైనా సిద్ధం.. కానీ రాజీ ప్రసక్తే లేదని తేల్చి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

వివేకా దారుణ‌ హత్యకేసులో ఒక్కొక్కరు అరెస్ట్‌ అవుతున్నారని ద‌స్త‌గిరి తెలిపారు. అయితే.. కొంద‌రి విష‌యంలో కొంత ఆల‌స్యం జ‌ర‌గ‌వ‌చ్చేమో కానీ.. ప్ర‌ధాన పాత్రులు అంద‌రూ అరెస్టు అవుతార‌ని చెప్పారు. తనను లొంగతీసుకునేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని దస్తగిరి చెప్పాడు. తాను ఎవరికీ లొంగేది లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పాడు. త‌న‌కు కూడా ప్రాణ భ‌యం ఉంద‌ని అయినా.. ఎవ‌రో ఏదో ఇస్తారంటే మాత్రం తానేమీ లొంగిపోన‌ని తేల్చి చెప్పారు. ఈ విష‌యాన్ని కూడా కోర్టులోనే తేల్చుకుంటానని చెప్పాడు. తనపై వైసీపీ నేతలు కక్షకట్టి వేధిస్తున్నారని వాపోయాడు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారని, అయినా.. తాను ఎవ‌రికీ లొంగ‌బోన‌ని ద‌స్త‌గిరి చెప్ప‌డం గ‌మ‌నార్హం.

Satya

Recent Posts

13 ఏళ్ల బాలుడు బాబు గారితో ఫోటో కోసం…

సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…

7 hours ago

టికెట్ రేట్లు చేస్తున్న మేలు అర్థమవుతోందా

లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…

8 hours ago

పోల‌వ‌రంపై చంద్ర‌బాబు శ‌ప‌థం

పోల‌వ‌రం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామ‌ని సీఎం చంద్ర‌బాబు శ‌ప‌థం చేశారు. గోదావ‌రి జిల్లాల్లో ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ఆయ‌న…

10 hours ago

నాగార్జున 101 ఫిక్సయిందా?

అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…

10 hours ago

ఇప్పుడున్న రాజకీయాల్లో ఎన్టీఆర్‌ ఇమ‌డ‌గ‌ల‌రా?

జూనియ‌ర్ ఎన్టీఆర్‌.. రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై త‌ర‌చుగా ప్ర‌చారం జ‌రుగుతూనే ఉంది. ఆయ‌న‌కు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…

11 hours ago

చిరు దిగాడు… పంచాయితీ ముగిసింది

తెలుగు టాప్ కొరియోగ్రాఫ‌ర్ల‌యిన జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ ప‌ర‌స్ప‌రం అరుచుకుంటూ ఒక‌రి మీదికి ఒక‌రు దూసుకువెళ్తున్న వీడియో తాజాగా…

11 hours ago