Political News

అందుకోస‌మే కాంగ్రెస్‌లో చేరుతున్నా: పొంగులేటి

కొన్ని రోజులుగా తెలంగాణ రాజ‌కీయాల్లో ఉత్కంఠ‌గా మారిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి రాజ‌కీయ వ్య‌వ‌హారానికి తాజాగా ఫుల్ స్టాప్ ప‌డింది. తాను కాంగ్రెస్‌లో చేరుతున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే.. దీనికి ఏకైక కార‌ణం.. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకేన‌ని పొంగులేటి చెప్పారు. తాజాగా ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర‌నేత‌ రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్య‌క్షుడు మల్లిఖార్జున ఖర్గేతో పొంగులేటి స‌మావేశం అయ్యారు. అనంత‌రం  ఆయ‌న మాట్లాడుతూ.. పదవులు ఇవ్వలేదని బీఆర్ఎస్ నుంచి బయటకు రాలేదన్నారు.

బీఆర్ ఎస్ పార్టీనే త‌మ‌ను ప‌క్క‌న పెట్టింద‌ని పొంగులేటి వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్‌ను గద్దె దించేందుకే తాను కూడా బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.  “నాకు పదవులు ముఖ్యం కాదు.  పదవుల కంటే ఆత్మాభిమానమే ముఖ్యం. ఓ దశలో ప్రాంతీయ పార్టీ పెట్టాలని ఆలోచించా. దీనిపై అభిప్రాయ సేకరణ కూడా చేశా. కొత్త పార్టీతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలదని భావించి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా” అని పొంగులేటి వివ‌రించారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై కూడా సర్వే చేయించానన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకవైపే కేంద్రీకృతమైందని, దీనిని తాను గుర్తించాన‌ని పొంగులేటి వెల్లడించారు. మ‌రోవైపు ఈ ఏడాది జ‌రిగిన కర్ణాటక ఎన్నిక‌ల త‌ర్వాత తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగింద‌న్నారు.  బీజేపీ పరిస్థితి దిగజారిందని పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చాయంటే కేసీఆర్ కొత్త స్కీములు పెడతారని.. గారడి మాటలు చెప్పడంలో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడ‌ని వ్యాఖ్యానించారు. ఇప్పుడు జ‌రిగే ఎన్నిక‌ల్లో మూడోసారి మాయమాటలు, మాయ ప‌థ‌కాల‌తో అయినా.. మ‌రో సారి  ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనుకుంటున్నారని విమ‌ర్శించారు.

రాష్ట్ర వ‌చ్చినా.. తెలంగాణ బిడ్డలు కోరుకున్న నీళ్లు, నిధులు, నియామ‌కాలు మాత్రం నెరవేరలేదని పొంగులేటి చెప్పారు.  “ప్రజలు, యువత ఏం కోరుకుంటున్నారనేది పరిశీలించాం.. తెలంగాణ బిడ్డలు ఆత్మగౌరవం కోల్పోయారు. దానిని సాధిస్తాం. ప్ర‌తి ఒక్క‌రి ఆత్మ‌గౌర‌వాన్ని పెంచుతాం” అని తెలిపారు. జూలై 2 ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు పొంగులేటి స్పష్టం చేశారు.  

Satya

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

40 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

1 hour ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

10 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

12 hours ago