సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరితో మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు భేటీ అయ్యారు. దాంతో పార్టీలోని నేతలందరి చూపు ఇపుడు వీళ్ళిద్దరిపైనే నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోమటిరెడ్డి, ఈటల తొందరలోనే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిని పార్టీలోనే ఉండేట్లుగా చర్చలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో అంత సఖ్యత లేదు.
అందుకనే ఇద్దరినీ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రదారైన కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయాలని. స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళలో చాలామందిని అరెస్టు చేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయటం లేదని అడుగుతున్నారు. ఈడీ వైఖరి వల్ల బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారీగా ఒప్పందం జరిగిందని జనాలు డైరెక్టుగానే తమను నిలదీస్తున్నారంటు వీళ్ళిదరు అమిత్ షాతో చెప్పారట.
రెండుపార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందం వల్లే నరేంద్రమోడీ గురించి కేసీయార్ ఎక్కడా మాట్లాడటంలేదని, కవితను ఈడీ అరెస్టుచేయటం లేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో బీజేపీ నేతలు పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. ఈ ఆరోపణల నుండి బయటపడాలంటే కవితను వెంటనే ఈడీ అరెస్టు చేయాల్సిందే అని వీళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోతున్నారట.
జనాలు నమ్మని బీజేపీలో ఉండటం కన్నా బయటకు వెళ్ళిపోవటమే మేలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అందుకనే అన్నీపనులను పక్కనపెట్టి అమిత్ వీళ్ళిద్దరితో మూడు రోజుల్లోల రెండుసార్లు భేటీ అయ్యింది. కవిత అరెస్టుపైన అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే హైదరాబాద్ కు తిరిగొచ్చిన కోమటిరెడ్డి ఏమిచేస్తారో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈటల సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోవచ్చంటున్నారు. బహుశా ఢిల్లీలోనే ఉండిపోయింది కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేందుకే అనే ప్రచారం కూడా ఉంది. చివరకు ఏమవుతుందో ఏమో.
This post was last modified on June 26, 2023 10:59 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…