Political News

ఏపీలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేదు: సుమ‌న్

ఏపీ రాజ‌కీయాల‌పైనా.. ఇక్క‌డి పార్టీల‌పైనా న‌టుడు సుమ‌న్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింద‌ని అన్నారు. అదే స‌మయంలో ఇత‌ర కులాలైన రెడ్డి, క‌మ్మ‌, కాపు, ఎస్సీ కులాల‌కు రాష్ట్రంలో రాజ‌కీయ వేదిక‌లు ఉన్నాయ‌ని.. కానీ, బీసీల‌కు ఒక వేదిక కూడా లేదని విమ‌ర్శించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వ‌స్తుంద‌ని చెప్పారు. రాష్ట్రంలో గ‌త నాలుగేళ్లుగా బీసీ సామాజిక వ‌ర్గాల‌పై దాడులు, హ‌త్య‌లు జ‌రుగుతున్నాయ‌ని..అయితే.. వీరిని రాజ‌కీయంగా వాడుకుంటున్న పార్టీలు.. ఈ దారుణాల‌పై ప‌న్నెత్తు మాట కూడా మాట్లాడ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

గుంటూరు జిల్లా పేదకాకానిలో స్వ‌తంత్ర స‌మ‌ర‌యోదుడు, మాజీ ఎమ్మెల్యే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సినీ నటుడు సుమన్, టీడీపీ నేత గౌతు శిరీష ఇత‌ర నేత‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీసీల‌ను అణ‌దొక్కి.. వారికి అండ‌గా ఉన్నామ‌ని కొంద‌రు చెబుతున్నార‌ని.. ఇది బీసీల‌ను ఒక‌ర‌కంగా అవ‌మానించ‌డ‌మేన‌ని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని సుమన్ విమర్శించారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఘ‌ట‌న‌ల‌ను ఉద‌హ‌రించారు. బాపట్లలో పదో తరగతి విద్యార్థిని అత్యంత దారుణంగా చంపితే చర్యలే లేవని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కులానికో పార్టీ ఉందని, బీసీలకు పార్టీ లేదని సుమన్‌ అన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలని ఆయ‌న బీసీల‌కు పిలుపు నిచ్చారు. బీసీల‌కు మేలు చేసే పార్టీల దగ్గరకే బీసీలు వెళ్లాలని సుమన్‌ సూచించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని, అలాంటి ప‌రిస్థితి ఏపీలోనూ రావాల‌ని కోరుకుంటున్న‌ట్టు సుమన్ తెలిపారు.

This post was last modified on June 26, 2023 9:08 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాని ఎదుర్కున్న సమస్యే శ్రీవిష్ణుకి వస్తుందా

ఒకే హీరో రెండు సినిమాలు ఒకే టైంలో రిలీజ్ కు రెడీ కావడమంత సంకట పరిస్థితి మరొకటి ఉండదు. గతంలో…

3 hours ago

మూడు రోజులుగా లడ్డూ లడాయి.. వైసీపీ ట్రాప్‌లో చిక్కారా?

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కూటమి…

4 hours ago

తిరుమ‌ల ల‌డ్డూపై క‌మిష‌న్‌.. సూత్రధారులు దొరుకుతారా?

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో క‌ల్తీ నెయ్యి వినియోగంపై ప్ర‌స్తుతం సీబీఐ విచార‌ణ చేసింది. దీనికి సంబంధించిన చార్జిషీట్‌ను కూడా నెల్లూరు…

5 hours ago

రాజా సాబ్ మళ్ళీ టార్గెట్ అవుతాడా

డిజాస్టర్లు ప్రతి హీరో, దర్శకుడికి ఉంటాయి కానీ రాజా సాబ్ విషయంలో మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరయ్యా అంటే ఠక్కున…

5 hours ago

అర్జున్ ఈ విషయంలో అదృష్టవంతుడే

వచ్చే వారం విడుదల కాబోతున్న సినిమాల్లో సీత పయనం ఉంది. పేరు వింటే పెద్దగా విశేషం అనిపించదు కానీ ఈ…

6 hours ago

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు..…

7 hours ago