ఏపీ రాజకీయాలపైనా.. ఇక్కడి పార్టీలపైనా నటుడు సుమన్ హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. అదే సమయంలో ఇతర కులాలైన రెడ్డి, కమ్మ, కాపు, ఎస్సీ కులాలకు రాష్ట్రంలో రాజకీయ వేదికలు ఉన్నాయని.. కానీ, బీసీలకు ఒక వేదిక కూడా లేదని విమర్శించారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వస్తుందని చెప్పారు. రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా బీసీ సామాజిక వర్గాలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని..అయితే.. వీరిని రాజకీయంగా వాడుకుంటున్న పార్టీలు.. ఈ దారుణాలపై పన్నెత్తు మాట కూడా మాట్లాడడం లేదని విమర్శించారు.
గుంటూరు జిల్లా పేదకాకానిలో స్వతంత్ర సమరయోదుడు, మాజీ ఎమ్మెల్యే గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సినీ నటుడు సుమన్, టీడీపీ నేత గౌతు శిరీష ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటుడు సుమన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీసీలను అణదొక్కి.. వారికి అండగా ఉన్నామని కొందరు చెబుతున్నారని.. ఇది బీసీలను ఒకరకంగా అవమానించడమేనని చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు రక్షణ లేకుండా పోయిందని సుమన్ విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన పలు ఘటనలను ఉదహరించారు. బాపట్లలో పదో తరగతి విద్యార్థిని అత్యంత దారుణంగా చంపితే చర్యలే లేవని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో కులానికో పార్టీ ఉందని, బీసీలకు పార్టీ లేదని సుమన్ అన్నారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చే పార్టీకి మద్దతివ్వాలని ఆయన బీసీలకు పిలుపు నిచ్చారు. బీసీలకు మేలు చేసే పార్టీల దగ్గరకే బీసీలు వెళ్లాలని సుమన్ సూచించారు. బీసీలకు ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించిందని, అలాంటి పరిస్థితి ఏపీలోనూ రావాలని కోరుకుంటున్నట్టు సుమన్ తెలిపారు.
This post was last modified on June 26, 2023 9:08 am
బీజేపీ, జనసేనలతో కూటమి కట్టిన టీడీపీ ఏపీలో జరిగిన ఎన్నికల్లో పోరాటం చేసిన విషయం తెలిసిందే. పోలింగ్ శాతం పెరిగిన…
గేమ్ ఛేంజర్ దెబ్బకు ఏకంగా మూడు సంవత్సరాలకు పైగా దానికే కేటాయించాల్సి వచ్చిన రామ్ చరణ్ శంకర్ మీద ఉన్న…
ఎన్నికల సమరం ముగియడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశాలకు విహారయాత్రకు వెళ్లారు. జగన్ విదేశీ పర్యటనకు…
చాంతాడంత కారణాలు చెప్పుకుని జనం థియేటర్లకు రావడం లేదని ఎంత బాధ పడినా వాస్తవిక పరిస్థితిని అర్థం చేసుకుంటే కనక…
యానిమల్ దెబ్బకు జాతీయ స్థాయిలో భారీ గుర్తింపు తెచ్చేసుకున్న రష్మిక మందన్న బీజీపీ ప్రభుత్వం తరఫున అనధికార ప్రచార కర్త…
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో 370కి పైగా స్థానాలు సాధించి హ్యాట్రిక్ విజయంతో అధికారం చేజిక్కించుకోవాలన్న కమలం ఆశలమీద ఆయా…